‘ఏక’స్వామ్య కోటకు బీటలు
అవుకు మండలంలో కాటసాని, చల్లా కోటకు బీటలు పడ్డాయి.. 50 ఏళ్ల తర్వాత అక్కడ తెదేపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. ఆయా గ్రామాల్లో తెదేపా జెండాలు రెపరెపలాడుతున్నాయి.
ప్రచారానికి శ్రీకారం చుట్టిన తెదేపా
నంద్యాల, న్యూస్టుడే: అవుకు మండలంలో కాటసాని, చల్లా కోటకు బీటలు పడ్డాయి.. 50 ఏళ్ల తర్వాత అక్కడ తెదేపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. ఆయా గ్రామాల్లో తెదేపా జెండాలు రెపరెపలాడుతున్నాయి. పలు గ్రామాల్లో కాటసాని, చల్లా కుటుంబాల పెత్తనం కొనసాగుతోంది. ఎన్నికలంతా ఏకపక్షంగా కొనసాగుతాయి.. ప్రతిపక్ష పార్టీలకు అక్కడ ఏజెంట్లు కూడా ఉండరు.. అక్కడ ప్రతిపక్ష నాయకులు కాలుమోపాలంటే భయపడతారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొనే పరిస్థితి ఉండదు..
చల్లా ఆధిపత్యానికి గండి
మాజీ ఎమ్మెల్యే, దివంగతనేత చల్లా రామకృష్ణారెడ్డి స్వగ్రామం ఉప్పలపాడు. ఆ గ్రామంతోపాటు జూనుంతల, కొండమనాయునిపల్లెలను గత 50 ఏళ్లుగా ఆ కుటుంబమే శాసిస్తోంది. వారు ఎక్కడ ఉంటే ఆ పార్టీకే మెజార్టీ వస్తుంది. ఎన్నికల ప్రక్రియను అంతా వారి కనుసన్నల్లో నడిపిస్తారు. ఆ కుటుంబానికి చెందిన చల్లా విజయ భాస్కరరెడ్డి తెదేపాలో చేరారు. కొండమనాయునిపల్లె, జూనుంతలలో గడప.. గడపకు వెళ్లారు. ఉప్పలపాడులోనూ ప్రచారం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. మూడు గ్రామాల్లో ఉన్న మూడు వేల ఓట్లు ఇప్పుడు కీలకం కానున్నాయి.
తెదేపా వ్యూహాలు
నియోజకవర్గంలో 2,38,900 మంది ఓటర్లు ఉండగా ఇందులో అవుకు మండలంలో 42,709, బనగానపల్లిలో 82,820, కోవెలకుంట్లలో 39,145, కొలిమిగుండ్లలో 42,317, సంజామలలో 31,909 ఉన్నారు. గత ఎన్నికల సమయంలో గుండ్లశింగవరంలో 1,450 ఓట్లకు 1,400, ఉప్పలపాడులో 1,750 ఓట్లకు 1,600 వైకాపాకు పడ్డాయి. గత ఎన్నికల్లో అవుకు మండలంలో అధికార పార్టీ వైకాపాకు ఎనిమిది వేల వరకు మెజార్టీ వచ్చింది. కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాల నుంచి తెదేపాలో చేరే వారి సంఖ్య పెరిగింది. అవుకు మండలానికి చెందిన కాటసాని చంద్రశేఖరరెడ్డి, చల్లా విజయ బాస్కరరెడ్డి, చెన్నంపల్లె నుంచి కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, కోనాపురం నుంచి వంగల పరమేశ్వరరెడ్డి తెదేపాలో చేరారు. అవుకు మండలం నుంచి గత ఎన్నికల్లో వైకాపాకు ఆరు వేల ఓట్ల మెజారీ వచ్చింది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
కాటసాని పెత్తనం కుదరదిక
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి సొంతూరు అవుకు మండలం గుండ్ల శింగవరం. ఆ గ్రామంతోపాటు చుట్టు పక్కల ఉన్న అన్నవరం, నిచ్చెనమెట్ల, లింగంబోడు, పెద్దకొట్టాల, కోనాపురం గ్రామాల్లో ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. ఎన్నికల సమయంలో అక్కడ ఏజెంట్లు కూర్చోవడానికి కూడా ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు దొరకరు. పోలింగ్ ప్రక్రియ అంతా ఏకపక్షంగా కొనసాగుతుంది. ఆయా గ్రామాల్లో కనీసం మూడువేలకు పైగా మెజార్టీ వస్తుంది. ఆయన సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డి సైకిలెక్కారు. గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. గడప..గడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు.. వైకాపా అరాచకాలు వివరిస్తూ తెదేపా గెలుపు ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏది కావాలో తేల్చుకోండి
[ 12-05-2024]
-
ఉపాధి కల్పించి.. వలసలు నివారిస్తాం
[ 12-05-2024]
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉపాధి కల్పించి వలసలు నివారిస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదోని పురపాలక మైదానంలో శనివారం నిర్వహించిన ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
అమ్మకు జగన్మోసం...
[ 12-05-2024]
అమ్మఒడికి దూరం చేశావు.. సాంకేతిక లోపాలు ముడిపెట్టావు. జగనన్న కాలనీల్లో ఇళ్లిస్తానన్నావు.. జలమయమైనా జాలిచూపలేకపోయావు. ఇంటింటికీ నీళ్లిస్తానన్నావు.. అసంపూర్తి పనులతో కన్నీళ్లే మిగిల్చావు. సున్నావడ్డీ రుణమన్నావు.. అమలుకు గుండుసున్నా చుట్టావు. -
భారం మోపారు.. బాధులు పెట్టారు
[ 12-05-2024]
జగనన్న జమానాలో సంపద సృష్టించటం తెలియదు.. ఉపాధి కల్పించడం ఇష్టం ఉండదు.. అభివృద్ధి అసలే గిట్టదు.. ఆదాయం కోసం జనాలపై పడ్డారు.. సందు దొరికితే చాలు బాదేస్తున్నారు.. ప్రజల నుంచి ఏదోరూపంలో పిండుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12.84 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. ధరల పెరుగుదల వీరిపై తీవ్ర ప్రభావం పడింది. -
మద్యం దుకాణాలు, బార్లు బంద్
[ 12-05-2024]
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూతపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు మద్యం విక్రయాలు ఆపేసేలా చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖను ఆదేశిస్తూ కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
[ 12-05-2024]
పోలింగ్కు ముందు 48 గంటల నుంచి ముగిసే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె.శ్రీనివాసులు ఆదేశించారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 12-05-2024]
స్వాత్రిక ఎన్నికల వేళ జిల్లాలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో పది చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. -
ముగిసిన ప్రచార పర్వం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానానికి జరగనున్న ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. -
పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు
[ 12-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లి, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 13,89,307 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. -
ఓటరుపై వైకాపా నాయకుల దాడి
[ 12-05-2024]
వైకాపాకు ఓటు వేయను అన్న కారణంగా ఓ యువకుడిపై ఆ పార్టీ నాయకులు దాడి చేసిన ఘటన శనివారం రాత్రి ఆస్పరిలో జరిగింది.