‘ఆమె’ చేతిలో గెలుపు
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది.. తుది జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 25న విడుదల చేసింది.
ఆరు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది.. తుది జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 25న విడుదల చేసింది. ఆరు నియోజకవర్గాల్లో 13,89,307 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6,89,402 మంది, మహిళలు 7,08,647 మంది ఓటర్లు ఉన్నారు. థర్డ్జండర్ ఓటర్లు 258 మంది ఉన్నారు.
నంద్యాలలో అధికం..
జిల్లా కేంద్రం నంద్యాలలో అత్యధికంగా 2,73,938 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా శ్రీశైలం నియోజకవర్గంలో 1,96,116 మంది ఓటర్లు ఉన్నారు.
17,216 మంది పెరిగారు
మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 17,216 ఓట్లు పెరిగాయి. అత్యధికంగా జిల్లా కేంద్రం నంద్యాలలో 6,293 ఓట్లు పెరిగాయి. ఆ తర్వాత డోన్ లో 3,240, బనగానపల్లిలో 2,279, శ్రీశైలంలో 2,154, ఆళ్లగడ్డలో 1762, నందికొట్కూరులో 1488 ఓట్లు పెరిగాయి. ఇదే సమయంలో థర్డ్ జండర్ ఓట్లు నాలుగు తగ్గాయి. 262 ఓట్ల నుంచి 258 ఓట్లకు తగ్గాయి.
ఎక్కడ ఎంత మంది
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,754 మంది ఎక్కువగా ఉన్నారు. శ్రీశైలంలో 4,530 , నందికొట్కూరులో 4,651 , నంద్యాలలో 7,864, బనగానపల్లిలో 4,931, డోన్ నియోజకవర్గంలో 3,515 మంది మహిళలలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏది కావాలో తేల్చుకోండి
[ 12-05-2024]
-
ఉపాధి కల్పించి.. వలసలు నివారిస్తాం
[ 12-05-2024]
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉపాధి కల్పించి వలసలు నివారిస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదోని పురపాలక మైదానంలో శనివారం నిర్వహించిన ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
అమ్మకు జగన్మోసం...
[ 12-05-2024]
అమ్మఒడికి దూరం చేశావు.. సాంకేతిక లోపాలు ముడిపెట్టావు. జగనన్న కాలనీల్లో ఇళ్లిస్తానన్నావు.. జలమయమైనా జాలిచూపలేకపోయావు. ఇంటింటికీ నీళ్లిస్తానన్నావు.. అసంపూర్తి పనులతో కన్నీళ్లే మిగిల్చావు. సున్నావడ్డీ రుణమన్నావు.. అమలుకు గుండుసున్నా చుట్టావు. -
భారం మోపారు.. బాధులు పెట్టారు
[ 12-05-2024]
జగనన్న జమానాలో సంపద సృష్టించటం తెలియదు.. ఉపాధి కల్పించడం ఇష్టం ఉండదు.. అభివృద్ధి అసలే గిట్టదు.. ఆదాయం కోసం జనాలపై పడ్డారు.. సందు దొరికితే చాలు బాదేస్తున్నారు.. ప్రజల నుంచి ఏదోరూపంలో పిండుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12.84 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. ధరల పెరుగుదల వీరిపై తీవ్ర ప్రభావం పడింది. -
మద్యం దుకాణాలు, బార్లు బంద్
[ 12-05-2024]
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూతపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు మద్యం విక్రయాలు ఆపేసేలా చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖను ఆదేశిస్తూ కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
[ 12-05-2024]
పోలింగ్కు ముందు 48 గంటల నుంచి ముగిసే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె.శ్రీనివాసులు ఆదేశించారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 12-05-2024]
స్వాత్రిక ఎన్నికల వేళ జిల్లాలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో పది చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. -
ముగిసిన ప్రచార పర్వం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానానికి జరగనున్న ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. -
పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు
[ 12-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లి, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 13,89,307 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. -
ఓటరుపై వైకాపా నాయకుల దాడి
[ 12-05-2024]
వైకాపాకు ఓటు వేయను అన్న కారణంగా ఓ యువకుడిపై ఆ పార్టీ నాయకులు దాడి చేసిన ఘటన శనివారం రాత్రి ఆస్పరిలో జరిగింది.