అన్యాయంపై అతివ అంకుశం!
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. హైదరాబాద్కు వలస వెళ్లి జీవనం గడుపుతుండగా గతేడాది భర్త మృతి చెందాడు.. ఇళ్లలో పని చేస్తూ జీవనం గడుపుతున్న ఆమె భర్త పేరిట ఉన్న కొద్దిపాటి భూమిని విరాసత్ చేసుకోవాలనుకుంది.. కానీ అధికారి
అనిశా వలలో మరికల్ తహసీల్దార్
అదే అధికారి చేతుల మీదుగా విరాసత్ పట్టా అందుకున్న వైనం
న్యూస్టుడే, నారాయణపేట న్యూటౌన్, మరికల్
బాధితురాలు శ్రీశైల
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. హైదరాబాద్కు వలస వెళ్లి జీవనం గడుపుతుండగా గతేడాది భర్త మృతి చెందాడు.. ఇళ్లలో పని చేస్తూ జీవనం గడుపుతున్న ఆమె భర్త పేరిట ఉన్న కొద్దిపాటి భూమిని విరాసత్ చేసుకోవాలనుకుంది.. కానీ అధికారి తీరు ఆశ్చర్యంగొలిపింది.. ఎవరూ లేనిదాన్ని దయచూడండి అన్నా కనికరం చూపని అతడిని క్షమించకూడదనుకుంది.. అవినీతి నిరోధకశాఖను ఆశ్రయించి తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టిచ్చింది.. అనిశా తహసీల్దార్ను విచారణ చేయడమే కాకుండా అదే అధికారి చేతుల మీదుగా విరాసత్ పూర్తి చేయించి ఆ మహిళకు పట్టా అందించారు.. లంచాలు అడిగిన అధికారులపై ఫిర్యాదు చేస్తే పనులు కావేమోనన్న భయం వీడాలన్న సందేశం పంపారు..
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్కోటకు చెందిన రాసాల సతీశ్ అలియాస్ సత్యనారాయణకు నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట శివారులో 1.07 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతేడాది ఏప్రిల్ 26న ఆయన మృతి చెందాడు. దీంతో ఆయన పేరున ఉన్న భూమిని తన పేరు మీద మార్చుకునేందుకు భార్య శ్రీశైల గతేడాది సెప్టెంబరులో ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకున్నారు. దస్త్రాలు పరిశీలించిన తహసీల్దారు శ్రీధర్ ఆధార్ కార్డులో ఆర్.సతీశ్ అని పట్టాదారు పాస్ పుస్తకంలో ఆర్.సత్యనారాయణ ఉందంటూ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని ఆమె తమ ఇంటి పక్కన ఉన్న రుక్ముద్దీన్ అనే వ్యక్తితో చెప్పుకొంది. ఆయన సహకారంతో తహసీల్దారు కార్యాలయంలో ఆర్వోఆర్, ఖాస్రా, పహాణీ తీసుకున్నారు. వీటన్నింటిని తహసీల్దారు ముందుంచి విరాసత్ చేయాల్సిందిగా కోరగా రూ.45 వేలు డిమాండ్ చేశారు. తన భర్త హమాలీ పని చేసేవాడని, తాను హైదరాబాద్లో ఇళ్లలో పని చేస్తూ జీవనం గడుపుతున్నానని దయ చూపమన్నా పట్టించుకోలేదు. రూ.25 వేలకు తక్కువైతే కుదరదని తహసీల్దారు తేల్చి చెప్పారు. దీంతో శ్రీశైల అనిశా అధికారులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. అధికారులు తహసీల్దారుకు ఇచ్చేందుకు గాను రూ.20 వేలు నగదు ఇచ్చారు. ఆ డబ్బును రుక్ముద్దీన్, శ్రీశైల బుధవారం సాయంత్రం తహసీల్దారుకు ఇవ్వబోతుండగా కాపుకాసిన అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కృష్ణగౌడ్, ఎస్సైలు లింగస్వామి, రామారావు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లోని శ్రీధర్ ఇంట్లో మరో బృందం తనిఖీ చేపట్టినట్లు డీఎస్పీ చెప్పారు. తహసీల్దార్ను విచారించి నాంపల్లి అనిశా కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.
డబ్బులతో పట్టుబడిన తహసీల్దార్ శ్రీధర్
విరాసత్ పూర్తయింది
2018లో జరిగిన భూ సర్వే కార్యక్రమంలోనే గుర్తింపు కార్డుకు అనుగుణంగా పేరు మార్పిడి జరగాలి. ఈ విషయాన్ని రాసాల సతీష్ అలియాస్ సత్యనారాయణ తాను బతికున్న సమయంలోనే పెద్ద చింతకుంట రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు సర్వే నంబరు 204-ఆ బీ2, 205-ఆ3 1.07 ఎకరాల భూమి ఉందని ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్కులో పేరు వేర్వేరుగా ఉన్నందున భవిష్యత్లో ఇబ్బందులు ఏర్పడుతాయేమోనని భయంగా ఉందని సరిచేయాలని విన్నవించినా పట్టించుకోలేదు. శ్రీశైల ఈ చిక్కుల నుంచి బయటపడేందుకు ఆర్వోఆర్, ఖాస్రా, పహాణీలు పొందేందుకు సైతం రెవెన్యూ సిబ్బంది రూ.2,500లు డిమాండ్ చేశారని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో రూ.1500లు ఇచ్చుకున్నట్లు బాధితురాలికి సహకరించిన రుక్ముద్దీన్ వెల్లడించారు. పత్రాలున్నా మళ్లీ విరాసత్ కోసం రూ.45 వేలు తహసీల్దారు డిమాండ్ చేయడంతో ఓపిక నశించిన శ్రీశైల అనిశా అధికారులను ఆశ్రయించారు. పట్టుబడ్డ తహసీల్దారు చేతుల మీదుగానే శ్రీశైలకు అనిశా అధికారులు బుధవారం రాత్రి విరాసత్ చేయించారు. ఈ సంఘటన తెలిసి రెవెన్యూ కార్యాలయం ముందు జనం పెద్ద ఎత్తున గుమిగూడి రెవెన్యూ అధికారుల తీరును చర్చించుకుంటూ కనిపించారు. శ్రీశైల ధైర్యాన్ని కొనియాడారు. ఆమెకు అండగా నిలిచిన రుక్ముద్దీన్ను అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూదరుల స్థావరంపై పోలీసుల దాడి
[ 03-05-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో జూదరుల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. -
గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
[ 03-05-2024]
వడ్డేపల్లి మండలం రామాపురం, కొంకల గ్రామాల్లో భాజపా మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. -
సమీక్షలు.. వ్యూహ రచనలు
[ 03-05-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల బలాలు, బలహీనతలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. -
ఇంజినీరింగ్ కళాశాలకు సన్నాహాలు
[ 03-05-2024]
నిధుల కొరత, అసౌకర్యాలతో 16 ఏళ్లుగా కొట్టుమిట్టాడుతున్న పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (పీఎం ఉష)కు ఎంపిక కావటంతో దశ మారనుంది. -
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: యెన్నం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన హన్వాడ మండలంలోని ఇబ్రహీంబాద్, తిర్మలగిరి, నాయినోనిపల్లి, పుల్పవానిపల్లి, చిన్నదర్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. -
మూడోసారి కేంద్రంలో భాజపానే
[ 03-05-2024]
దేశవ్యాప్తంగా భాజపా 400కు పైగా లోక్సభ స్థానాలు కైవసం చేసుకొని మూడోసారి కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని కావడం ఖాయమని కేంద్ర ప్రసార, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ అన్నారు. -
భారత్లో ఓటు ప్రస్థానమిదీ..
[ 03-05-2024]
ఆంగ్లేయుల పాలనలో మండలాలను ఫిర్కాలుగా పిలిచేవారు. అప్పట్లో ఫిర్కాకు కార్కోన్ అనే హోదాలో ఓ ఉద్యోగి విధులు నిర్వహించేవారు. -
పన్ను రాయితీ సద్వినియోగం అంతంతే
[ 03-05-2024]
ఏడాది కాలానికి సంబంధించిన ఆస్తిపన్ను ఏకకాలంలో చెల్లిస్తే పొందే 5 శాతం రాయితీ వెసులుబాటును పురపాలికల్లోని వ్యాపారులు, ఇళ్ల యజమానుల్లో తక్కువ మందే వినియోగించుకున్నారు. -
పరివార్
[ 03-05-2024]
లోక్సభ స్థానంలో విజయం సాధించడం అత్యంత గౌరవప్రదంగా ప్రతి నాయకుడూ భావిస్తున్నారు. అందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు అహర్నిశలు కష్టపడుతున్నారు. -
ఓటింగ్ను అడ్డుకుంటే మూడేళ్ల జైలు
[ 03-05-2024]
పోలింగ్ రోజున కేంద్రాల్లో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎన్నికల సంఘం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో దుండగులు పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనంలోకి తీసుకొని ఓటింగ్ అడ్డుకోవడాన్ని బూత్ క్యాప్చరింగ్ అంటారు. -
హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్కు కృషి : వంశీచంద్రెడ్డి
[ 03-05-2024]
హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానని కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్లోని కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ఓటమి భయంతో నీచ రాజకీయాలు: డీకే అరుణ
[ 03-05-2024]
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని భాజపా మహబూబ్నగర్ లోక్సభ స్థానం అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
మైనారిటీ విద్యార్థులకు 408 గురుకులాలు : మన్నె
[ 03-05-2024]
గత ప్రభుత్వాలు ముస్లింలను అన్ని రంగాల్లో విస్మరించారని, భారాస పదేళ్ల పాలనలో ప్రత్యేకంగా మైనార్టీలకు 408 గురుకులాలు నిర్మించామని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి: మల్లు రవి
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని అందుకే కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలని నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పార్టీ అభ్యర్థి మల్లు రవి కోరారు. -
ఆరు గ్యారంటీల అమలు ఏదీ: భాజపా
[ 03-05-2024]
కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి శూన్యమని నాగర్కర్నూల్ భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ విమర్శంచారు. గురువారం బావాయిపల్లి, తీగలపల్లి, జనుంపల్లి, కోడేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రాముడి పేరుతో రాజకీయాలా?
[ 03-05-2024]
భాజపా దిగజారుడు రాజకీయాలు చేస్తూ రాముని పేరుతో అక్షింతలు పంపిణీ చేసి ఓట్లు పొందాలనుకుంటోందని, కేసీఆర్కు మాత్రం ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కులేదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
మైకంలో ఆలినే కడతేర్చాడు
[ 03-05-2024]
ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను మద్యం తాగిన మైకంలో కత్తిపీటతో గొంతు కోసి దారణంగా హత మార్చిన సంఘటన గురువారం నాగర్కర్నూల్ మండలం వనపట్లలో చోటు చేసుకుంది. -
అవగాహన కల్పిస్తారా... మమ అనిపిస్తారా!
[ 03-05-2024]
ఏటా విద్యుదాఘాతానికి గురై పదుల సంఖ్యలో రైతులు, సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత నాలుగు నెలల వ్యవధిలో జిల్లాలో 14 మందికి పైగా రైతులు, వినియోగదారులు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
పురపాలికలపై సైబర్ నేరగాళ్ల నజర్
[ 03-05-2024]
సైబర్ నేరగాళ్లు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని రంగంలోకి దిగారు. ట్రేడ్ లైసెన్సు ఫీజులు, లేబర్ ఛార్జీలు తగ్గిస్తామంటూ అక్రమాలకు తెర లేపారు. బడా వ్యాపారులతో పాటు కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దుకాణాదారులను మోసం చేస్తున్నారు. -
అడ్డూ అదుపు లేని ఇసుక మాఫియా
[ 03-05-2024]
రాత్రీపగలు తేడాలేకుండా వాగుల్లోంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, ఠాణా నుంచి ఒక కానిస్టేబుల్ను పర్యవేక్షణకు ఇన్ఛార్జిగా నియమించారు.. రవాణాదారులు వారిని గుప్పెట్లోకి పెట్టుకుంటున్నారు. -
ప్రజా దీవెనలతో విజయం: జూపల్లి
[ 03-05-2024]
నమ్మి వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!