Jadcherla: లాకప్లో కోడిపుంజు.. ఇంతకీ దొంగ ఎవరు?
లాకప్లో కోడిపుంజును ఉంచిన ఆసక్తికర ఘటన జడ్చర్ల పోలీస్ స్టేషన్లో సోమవారం చోటు చేసుకుంది. జడ్చర్ల పురపాలిక పరిధి బూరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఓ బాలుడు కోడిపుంజును తీసుకెళ్తుండగా..
న్యూస్టుడే, జడ్చర్ల గ్రామీణం: లాకప్లో కోడిపుంజును ఉంచిన ఆసక్తికర ఘటన జడ్చర్ల పోలీస్ స్టేషన్లో సోమవారం చోటు చేసుకుంది. జడ్చర్ల పురపాలిక పరిధి బూరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఓ బాలుడు కోడిపుంజును తీసుకెళ్తుండగా.. గమనించిన స్థానికులు చోరీ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు సిబ్బంది వచ్చి బాలుడితో పాటు కోడిపుంజును ఠాణాకు తీసుకొచ్చారు. నిందితుడు మైనర్ కావటంతో తల్లిదండ్రులకు పిలిపించి వారికి అప్పగించారు. కోడిపుంజు ఎవరిదో తెలియలేదు. ఎవరి నుంచీ ఫిర్యాదు రాలేదు. కోడిపుంజు బయట ఉంటే కుక్కలు దాడిచేసే అవకాశముందని భావించిన సీఐ రమేశ్బాబు దాన్ని లాకప్లో పెట్టి గింజలు, నీరు ఏర్పాటు చేయించారు. ఠాణాకు వెళ్లినవారంతా లాకప్లో ఉన్న కోడిపుంజును ఆసక్తిగా చూశారు. సీఐని వివరణ కోరగా భద్రత కల్పించేందుకే లాకప్లో పెట్టినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సారూ.. పాలనపై ఇక దృష్టి పెట్టరూ..!
[ 16-05-2024]
పాలమూరులో అధికారులు రెండు నెలలుగా సార్వత్రిక ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. జిల్లా స్థాయి అధికారులతోపాటు కింది స్థాయి సిబ్బంది వరకు ఎన్నికల పనిలోనే ఉన్నారు. అధికారులు ఎన్నికల్లో తలమునకలు కావడంతో గ్రామాలు, పురపాలికల్లో పాలన ఎక్కడికక్కడ ఆగిపోయింది. -
విద్యుత్తు పొదుపు.. ప్రగతికి మలుపు
[ 16-05-2024]
మనిషి జీవితాన్ని సరళతరం చేసిన గొప్ప ఆవిష్కరణ విద్యుత్తు. గృహోపకరణాల నుంచి చరవాణి వరకు అంతా కరంటు మయమే. ఐదు నిమిషాలు సరఫరా నిలిచిపోతే ఊపిరాడనంత పని అవుతోంది. వేసవిలో ఏసీలు, కూలర్ల వినియోగం అధికం కావడంతో బిల్లులు గుండె గుభేల్మనేలా చేస్తున్నాయి. -
జూరాలకు కృష్ణా జలాలు చేరేనా..
[ 16-05-2024]
వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ డ్యాం నుంచి తెలంగాణకు విడుదల చేసిన 1.9 టీంఎసీల కృష్ణా జలాలు బుధవారం జూరాల ప్రాజెక్టుకు చేరాయి. -
మేకప్ ఆర్టిస్టు దారుణ హత్య
[ 16-05-2024]
నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. కార్మికనగర్ ప్రాంతంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నిమ్స్మేకు చెందిన ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా యువకుడి ఛాతీ, కడుపులో, వీపుపై కత్తితో పలుమార్లు పొడిచి హత్యచేశారు. -
అనుత్తీర్ణుల సన్నద్ధత ఏదీ?
[ 16-05-2024]
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఒక్క నారాయణపేట జిల్లాలోనే మంచి ఫలితాలు వచ్చాయి. వేలాది మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. వీరందరికీ జూన్ 3వ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. -
ఈ చిన్నారి ఎవరో!
[ 16-05-2024]
రెండు నెలల వయసున్న పసికందును ఎవరో నిర్దాక్షిణ్యంగా జిల్లా ఆసుపత్రిలో వదిలివెళ్లడం అక్కడున్న తల్లులకు కంటతడి తెప్పించింది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో జిల్లా ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రెండు నెలల వయసున్న బాబును వదిలి వెళ్లారు. -
విద్యార్థుల వెతలు పట్టవా
[ 16-05-2024]
మరికల్ మండలం పస్పుల శివారులో నిర్మిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయం నిర్మాణ పనులు ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చాయి. ఇంకా వెనుక భాగాన ప్రహరీ నిర్మించాల్సి ఉంది. ముందు భాగాన ర్యాంప్ పనులతో పాటు ప్రహరీ పూర్తి చేయాలి. -
రైతుల శ్రమ.. దళారులకు జమ
[ 16-05-2024]
కొల్లాపూర్ ప్రాంత మామిడిపండ్లకు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ప్రభుత్వపరంగా మార్కెటింగ్ సౌకర్యం లేక విక్రయాలకు తిప్పలు పడుతున్నారు. ఏటా దళారులకు విక్రయించి నష్టపోతూనే ఉన్నారు. ఈ సారి పూత మురిపించినా.. కాపు తగ్గి దిగుబడి 50శాతం కూడా రాలేదు. -
సమన్వయంతోనే ప్రశాంత ఎన్నికలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల్లో బందోబస్తు విధులు నిర్వహించి తిరిగి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న కేంద్ర సాయుధ బలగాల అధికారులను జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి బుధవారం సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. -
అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా డీసీసీబీ
[ 16-05-2024]
అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (డీసీసీబీ) ప్రగతి పథంలో సాగుతోందని బ్యాంకు ఇన్ఛార్జి ఛైర్మన్ కొరమోని వెంకటయ్య అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ సాధించిన ప్రగతిపై బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి
[ 16-05-2024]
జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తి చేసి రహదారి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
ఏ మీట నొక్కారోనన్న ఆందోళన !
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఈవీఎంల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్కు కొద్దిసేపు ముందు ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
తాజా వార్తలు (Latest News)
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
-
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!