స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు.
‘మహబూబ్నగర్ విజన్’ పేరుతో డీకే అరుణ మ్యానిఫెస్టో విడుదల
మహబూబ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే : పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. ‘మహబూబ్నగర్ విజన్’ పేరుతో ఆమె ప్రత్యేకంగా రూపొందించిన మ్యానిఫెస్టోను నామినేషన్ దాఖలు సందర్భంగా ఆమె భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ చేతుల మీదుగా గురువారం మహబూబ్నగర్ పట్టణం క్లాక్టవర్ వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో విడుదల చేశారు. 10 అంశాలను మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహబూబ్నగర్లో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతో నియోజకవర్గంలో అత్యున్నతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, నారాయణపేట, కొడంగల్, మక్తల్, దేవరకద్ర, షాద్నగర్, జడ్చర్ల నియోజకవర్గ కేంద్రాలు, వాటి పరిధిలోని పురపాలికలను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తానని, వికసిత్ మహబూబ్నగర్లో భాగంగా రహదారులు, రైలుమార్గాలు విస్తరిస్తామని, ఆయుస్మాన్ భారత్ ద్వారా పేదలకు కార్పొరేట్ తరహా వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామని, కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటు చేయిస్తామని, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మహిళా సంఘాలకు ముద్ర యోజన, లఖ్పతి దీదీ రుణాలు, స్వచ్ఛ మహబూబ్నగర్లో భాగంగా జిల్లా కేంద్రంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి కృషి, ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి భాజపా శ్రేణులు భారీ సంఖ్యలో మహబూబ్నగర్కు తరలి వచ్చారు. కలెక్టరేట్ నుంచి వన్టౌన్ కూడలి వరకు మహబూబ్నగర్ - భూత్పూర్ రోడ్డు కాషాయమయంగా మారింది. భగీరథకాలనీ నుంచి క్లాక్టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, ఒగ్గు కళాకారుల ఆటపాటలు, ఇతర కళాకారుల విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి, సీనియర్ నేతలు నాగురావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, పవన్కుమార్రెడ్డి, ఎగ్గని నర్సింహులు, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, నారాయణరెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, అందె బాబయ్య, విష్ణువర్ధన్రెడ్డి, కొండయ్య, కె.రాములు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కందనూలు.. మొగ్గు ఎటు వైపో..
[ 02-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పులో మార్పు కనిపిస్తోంది. -
ఉన్నత విద్యావంతులు కొందరే
[ 02-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటర్లోపే విద్యార్హత ఉండటం విశేషం. -
అభ్యర్థికి టాటా.. పెరుగుతోంది నోటా
[ 02-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించడంతో పాటు ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడుతుంది. లోక్సభ ఎన్నికలైనా సరే.. గట్టిపోటీ ఉన్న చోట రెండు, మూడు వేల ఓట్లే కీలకంగా మారే పరిస్థితి ఉంటుంది. -
సూర్యప్రతాపం.. తగ్గిన ప్రచారం
[ 02-05-2024]
ఓ వైపు సూర్యప్రతాపం రోజురోజుకూ అధికం అవుతోంది. మరోవైపు ప్రచార గడువు దగ్గరకు వస్తోంది... ఈ వేడి వాతావరణంలో రాజకీయ పార్టీల ప్రచార సరళి మారిపోయింది. గతంలో ఉన్నంత జోష్ కనిపించడం లేదు. మంది ఉన్నచోట మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇంటింటి ప్రచారం పలచబడింది. -
రైల్వే లైన్ సాధనకు కృషి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ సాధనకు కృషి చేస్తానని నాగర్కర్నూల్ భాజపా ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్ పేర్కొన్నారు. -
కమనీయం శ్రీనివాసుడి కల్యాణం
[ 02-05-2024]
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. ఆపద మొక్కులవాడైన శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. -
న్యాయవాదులు ఆలోచించి ఓటేయాలి : డీకే అరుణ
[ 02-05-2024]
మేధావి వర్గమైన న్యాయవాదులు లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ కోరారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
[ 02-05-2024]
సైబర్ నేరాల పట్లపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ సత్తయ్య పేర్కొన్నారు. -
నాలుగు ప్రాంతాల్లో రెడ్జోన్
[ 02-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు రెడ్జోన్ పరిధిలోకి వెళ్లాయి. -
పొరుగుసేవల దరఖాస్తులపై అనుమానాలెన్నో !
[ 02-05-2024]
గద్వాల మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాలలో పనిచేయడానికి సిబ్బంది నియామకానికి అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. -
సామాజిక మాధ్యమాలపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామపత్రాల దాఖలు గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
తెలుగులోనూ తప్పారు!
[ 02-05-2024]
పదోతరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాగర్కర్నూల్ జిల్లా 21వ స్థానంలో నిలువడం నిరాశ కలిగించింది. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖాధికారులు చొరవ చూపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
[ 02-05-2024]
కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపడితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రసార, సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ అన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి : ఎస్పీ
[ 02-05-2024]
యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేశ్గౌతం అన్నారు. -
సార్వత్రిక పరీక్షలకు 804 మంది హాజరు
[ 02-05-2024]
సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 804 మంది విద్యార్థులు హాజరైనట్లు టాస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
[ 02-05-2024]
పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి ఆదేశించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో వనపర్తి పట్టణం, గ్రామీణం, రేవల్లి, వీపనగండ్ల పోలీస్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ కేసులపై బుధవారం ఎస్సైలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.