రేవంత్రెడ్డిపై నిషేధం ఏదీ?
ఎన్నికల ప్రచారంలో 48 గంటలపాటు పాల్గొనవద్దని తనపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ).. ‘పేగులు మెడలో వేసుకుంటా.. గుడ్లు పీకుతా’ అంటూ అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్రెడ్డిపై నిషేధం ఎందుకు పెట్టలేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.
ఆయన వ్యాఖ్యలను ఈసీ పట్టించుకోదా..
భారాస కార్యకర్తలు 96 గంటలపాటు అవిశ్రాంత ప్రచారం చేస్తారు
మానుకోట రోడ్షోలో కేసీఆర్
ఈనాడు, మహబూబాబాద్: ఎన్నికల ప్రచారంలో 48 గంటలపాటు పాల్గొనవద్దని తనపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ).. ‘పేగులు మెడలో వేసుకుంటా.. గుడ్లు పీకుతా’ అంటూ అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్రెడ్డిపై నిషేధం ఎందుకు పెట్టలేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. లక్షల సంఖ్యలో ఉన్న భారాస కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. భారాస మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవితను గెలిపించాలని కోరుతూ బుధవారం మహబూబాబాద్లో నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు
‘‘కాంగ్రెస్ పరిపాలనలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వడ్లు తెచ్చి 15 రోజులైనా కొనకపోవడంతో.. తట్టుకోలేక వాటిని ఆరబెడుతూ అక్కడే ఓ రైతు బుధవారం గుండె ఆగి చనిపోయారు. రైతుభరోసా కింద రేవంత్రెడ్డి ఇస్తామన్న రూ.15 వేలు ఇవ్వలేదు. రైతుబంధు కింద మేమిచ్చిన రూ.10 వేలు కూడా రాలేదు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12000, వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వలేదు. మహిళలకు ప్రతినెలా ఇస్తామన్న రూ.2,500 రాలేదు. కల్యాణలక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. అయితే, దాంతో ఆటోడ్రైవర్లు రోడ్డున పడుతున్నారు. వాళ్ల బతుకులు ఆగమైపోతున్నాయి. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయాలి. న్యాయం జరిగేదాకా భారాస కొట్లాడుతుంది. మా హయాంలో ఎనిమిదేళ్లు బాగా ఉన్న నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ ఏమయ్యాయి? ప్రస్తుతం ఖమ్మంలో మురుగు నీళ్లు వస్తున్నాయి. మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత వెన్నవరం కాలువ ద్వారా నీళ్లు వచ్చాయి. ఈ ఏడాది రాలేదు. మళ్లీ బోరుబండ్లు వస్తున్నాయి. దీనిపై ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిస్తే హామీలను అమలు చేయకున్నా ఏమీ కాదని పక్కనపెట్టేస్తుంది. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజనులను గౌరవించలేదు. భారాస ప్రభుత్వంలో సేవాలాల్ మహరాజ్, బంజారా భవనాలు కట్టించాం. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాం.
మోదీ హయాంలో నినాదాలు తప్ప పనులు లేవు
విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని గతంలో మోదీ అన్నారు. ఎవరికైనా వచ్చాయా? మోదీ హయాంలో బేటీ బచావో.. బేటీ పఢావో.. అమృత్ కాల్.. అంటూ అన్నీ నినాదాలే తప్ప ఏ ఒక్క పనీ జరగలేదు. గోదావరి నదిని ఎత్తుకుపోతానని అంటుంటే తెలంగాణ సీఎం నోరు మెదపడం లేదు. ఇదివరకే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పగించారు.
జిల్లాను తీసేస్తామంటున్నారు
మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ను అభివృద్ధి చేసేందుకు జిల్లాగా మార్చాం. జిల్లాను రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. జిల్లా ఉండాలంటే.. మాలోత్ కవిత గెలవాలి. భారాస అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎలా ఉండేదో, ఇప్పుడెలా ఉందో యువకులు, మేధావులు విచక్షణతో ఆలోచించాలి’’ అని కేసీఆర్ అన్నారు. ఆయన ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఎక్కువ సమయం లేదంటూ సాయంత్రం 7.20కి తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్ 7.34కు అంటే 14 నిమిషాల్లోనే ముగించారు. రోడ్షోలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రెడ్యానాయక్, సుదర్శన్రెడ్డి, హరిప్రియనాయక్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!