శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు
గోపాల్పేట, న్యూస్టుడే : దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి గోపాల్పేటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కూడలి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను అధికసంఖ్యలో గెలిపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని అన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ను తిట్టి, లోక్సభ ఎన్నికల్లో భారాసలో చేరి ఆయన్ను పొగుడుతూ పోటీ చేస్తున్నారని విమర్శించారు. భారాస ఎంపీగా ఉన్న రాములు భాజపాలో చేరి కుమారుడిని ఆ పార్టీ ఎంపీగా పోటీ చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. సుమారు 30ఏళ్ల పాటు కాంగ్రెస్పార్టీలోనే ఉంటూ సేవలు అందిస్తున్న మల్లురవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు పూర్తవగానే ఇందిరమ్మ కమిటీలువేసి గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీకి మెజారిటీ ఓట్లు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి మల్లురవి ప్రసంగిస్తూ దేశంలో భాజపాను గద్దెదించాలని, రాహుల్గాంధీని ప్రధానిగా చేసి నిరుద్యోగ, వ్యవసాయరంగ సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, మాజీమంత్రి చిత్తరంజన్దాస్ తదితరులు ప్రసంగించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సత్యశీలారెడ్డి, పర్వతాలుయాదవ్, పర్వతాలు, సతీశ్, రమేశ్, మహేశ్, చీర్ల చందర్, శివన్న, చంద్రశేఖర్, సురేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి నుంచి రేవల్లి, గోపాల్పేట మండలాల కార్యకర్తలతో ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా గోపాల్పేటకు వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కందనూలు.. మొగ్గు ఎటు వైపో..
[ 02-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పులో మార్పు కనిపిస్తోంది. -
ఉన్నత విద్యావంతులు కొందరే
[ 02-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటర్లోపే విద్యార్హత ఉండటం విశేషం. -
అభ్యర్థికి టాటా.. పెరుగుతోంది నోటా
[ 02-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించడంతో పాటు ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడుతుంది. లోక్సభ ఎన్నికలైనా సరే.. గట్టిపోటీ ఉన్న చోట రెండు, మూడు వేల ఓట్లే కీలకంగా మారే పరిస్థితి ఉంటుంది. -
సూర్యప్రతాపం.. తగ్గిన ప్రచారం
[ 02-05-2024]
ఓ వైపు సూర్యప్రతాపం రోజురోజుకూ అధికం అవుతోంది. మరోవైపు ప్రచార గడువు దగ్గరకు వస్తోంది... ఈ వేడి వాతావరణంలో రాజకీయ పార్టీల ప్రచార సరళి మారిపోయింది. గతంలో ఉన్నంత జోష్ కనిపించడం లేదు. మంది ఉన్నచోట మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇంటింటి ప్రచారం పలచబడింది. -
రైల్వే లైన్ సాధనకు కృషి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ సాధనకు కృషి చేస్తానని నాగర్కర్నూల్ భాజపా ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్ పేర్కొన్నారు. -
కమనీయం శ్రీనివాసుడి కల్యాణం
[ 02-05-2024]
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. ఆపద మొక్కులవాడైన శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. -
న్యాయవాదులు ఆలోచించి ఓటేయాలి : డీకే అరుణ
[ 02-05-2024]
మేధావి వర్గమైన న్యాయవాదులు లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ కోరారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
[ 02-05-2024]
సైబర్ నేరాల పట్లపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ సత్తయ్య పేర్కొన్నారు. -
నాలుగు ప్రాంతాల్లో రెడ్జోన్
[ 02-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు రెడ్జోన్ పరిధిలోకి వెళ్లాయి. -
పొరుగుసేవల దరఖాస్తులపై అనుమానాలెన్నో !
[ 02-05-2024]
గద్వాల మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాలలో పనిచేయడానికి సిబ్బంది నియామకానికి అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. -
సామాజిక మాధ్యమాలపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామపత్రాల దాఖలు గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
తెలుగులోనూ తప్పారు!
[ 02-05-2024]
పదోతరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాగర్కర్నూల్ జిల్లా 21వ స్థానంలో నిలువడం నిరాశ కలిగించింది. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖాధికారులు చొరవ చూపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
[ 02-05-2024]
కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపడితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రసార, సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ అన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి : ఎస్పీ
[ 02-05-2024]
యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేశ్గౌతం అన్నారు. -
సార్వత్రిక పరీక్షలకు 804 మంది హాజరు
[ 02-05-2024]
సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 804 మంది విద్యార్థులు హాజరైనట్లు టాస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
[ 02-05-2024]
పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి ఆదేశించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో వనపర్తి పట్టణం, గ్రామీణం, రేవల్లి, వీపనగండ్ల పోలీస్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ కేసులపై బుధవారం ఎస్సైలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.