క్రియాశీల నేతలకు ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాధాన్యం
భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు,
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
అచ్చంపేట న్యూటౌన్, న్యూస్టుడే : భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భరోసానిచ్చారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్యకర్తలు చొరవతో కృషి చేసి అభ్యర్థి మల్లురవికి భారీ మెజార్టీని కట్టబెట్టాలన్నారు. భారాస అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్పై దుమ్మెత్తిపోసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ భారాస నుంచి పోటీ చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీల పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, మాజీ సీఎం కేసీఆర్, హరీశ్రావు మాత్రం ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి, పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచారం ఇలా ముగించారు..!
[ 12-05-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో నెల రోజులుగా ప్రచారం హోరెత్తింది. -
ఎన్నికల వేళ ప్రయాణికుల పాట్లు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నానా పాట్లు పడ్డారు. -
మతతత్వ పార్టీలకు చరమగీతం పాడుదాం: భట్టి
[ 12-05-2024]
మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే మతతత్వ పార్టీలకు చరమగీతం పాడుదామంటూ రాష్ట్ర ఉప మఖ్యమంత్రి భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. -
డీకే అరుణ అంటేనే పాలమూరు నినాదం
[ 12-05-2024]
అరుణమ్మ అంటే పాలమూరు నినాదం.. ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి.. ఆమెను మీరంతా ఎంపీగా గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి మీ గొంతుక అవుతారని భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. -
ఓర్వలేక వెన్నుపోటుకు కుట్ర: వంశీచంద్రెడ్డి
[ 12-05-2024]
పాలమూరు అభివృద్ధికి వెన్నుపోటు పొవడానికి, సీఎం రేవంత్రెడ్డిని అప్రతిష్ఠపాలు చేయడానికి కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
అభివృద్ధి విస్మరించి అనవసర ఆరోపణలు: వి.శ్రీనివాస్గౌడ్
[ 12-05-2024]
అభివృద్ధి పనులను విస్మరించి భారాస నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. -
మోదీవి ప్రజావ్యతిరేక విధానాలు
[ 12-05-2024]
పదేళ్ల నుంచి కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఓటర్లు ప్రజాస్వామిక పార్టీలకు పట్టం కట్టాలని తెలంగాణ జాగో కన్వీనర్ ఆకునూరి మురళి కోరారు -
లెక్కింపు కేంద్రాల పరిశీలన
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్రూంల ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జి.రవి నాయక్తో కలసి శనివారం పరిశీలించారు. -
నిబంధనలు పాటించాల్సిందే
[ 12-05-2024]
రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. -
మోసం చేసిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పండి
[ 12-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని భారాస నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి డా. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. -
విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు గుణపాఠం నేర్పాలి
[ 12-05-2024]
కాంగ్రెస్తోనే దేశంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భాజపా వస్తే ఎన్నికలు ఉండవు
[ 12-05-2024]
కేంద్రంలోని భాజపా మరోసారి అధికారంలోకి వస్తే, ఎన్నికలు ఉండవని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు