చినుకు పడాలి.. చింత తీరాలి!
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది.
ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు
వానాకాలం సీజన్పై రైతన్న ఆశలు
ఈనాడు, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పాలమూరు వాసులు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో రైతులు వర్షాల కోసం నిరీక్షిస్తున్నారు. యాసంగిలో చాలా మంది పంటలు వేసిన నీటి లభ్యత లేక సాగును మధ్యలోనే వదులుకున్నారు. జలాశయాల్లో నీటిమట్టం పడిపోతుండటం, చెరువులు ఎండిపోవడంతో పంటలు చేతికి రాకుండాపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు సైతం పడిపోయాయి. ఈ ఏడాదైనా నైరుతి రుతుపవనాలు తమకు కలిసి రావాలని కోరుకుంటున్నారు. ఈ నెల 31న కేరళ తీరాన్ని ఈ పవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ సారైనా ఆశించిన స్థాయిలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని కర్షకులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. గత వానాకాలంలో మహబూబ్నగర్లో 3.26 లక్షలు, నారాయణపేట-4.26 లక్షలు, నాగర్కర్నూల్-4.46లక్షలు, వనపర్తి-2.23 లక్షలు, జోగులాంబ గద్వాల-2.69 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈసారి కూడా దీనికి కొంచెం అటూఇటూగా పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.
గత ఏడాది నుంచి..
జోగులాంబ గద్వాల జిల్లాలో గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు సగటున సాధారణం కంటే లోటు వర్షపాతమే ఎక్కువ నమోదైంది. జిల్లాలో గట్టు, అయిజ, వడ్డేపల్లి మండలాల్లో మినహా మిగతా అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. వనపర్తి జిల్లాలో పాన్గల్, ఆత్మకూర్, వీపనగండ్ల, చిన్నంబావిలో లోటు వర్షపాతం నమోదవగా మిగతా మండలాల్లో సాధారణ స్థాయిలో మాత్రమే వర్షాలు పడ్డాయి. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ, వంగూరు, కోడేరు, కొల్లాపూర్ మినహా జిల్లాలో అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదు కాగా మరికల్లో లోటు వర్షపాతం పడింది. మిగతా చోట్ల సాధారణ వర్షాలే పడ్డాయి. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్లో అత్యధికంగా వర్షాలు పడ్డాయి. మహబూబ్నగర్ అర్బన్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్డిల్ మండలాల్లో తక్కువగా వానాలు కురిశాయి.
అప్రమత్తత అవసరమే..
నైరుతి రుతుపవనాలు మరో 15 రోజుల్లో ఈ ప్రాంతాన్ని తాకే అవకాశాలుండటంతో వివిధ శాఖల అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. భారీ వర్షాలు పడితే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. పురపాలికల్లోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. గతంలో ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు పడితే పట్టణాల్లో పలు కాలనీలు నీట మునిగి ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పుర అధికారులు లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై ఓ అంచనాకు రావాల్సి ఉంటుంది. రుతుపవనాలు త్వరగా వస్తే రైతులు కూడా హడావుడి పడతారు. ఈ సమయంలోనే రైతులకు వ్యవసాయ శాఖ సాగుపై సూచనలు, సలహాలు ఇవ్వాలి. గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వానాకాలం సాగుకు సన్నద్ధం చేయాలి. ఒక్కోసారి నైరుతి రుతుపవనాలు రెండు, మూడు రోజులు ఊరించి తర్వాత ముఖం చాటేస్తాయి. ఈ నేపథ్యంలో రైతుల ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా వివరించాలి. సాగునీటి పారుదలశాఖ అధికారులు కూడా ఉమ్మడి జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పరిధిలోని మోటార్ పంపులకు డ్రై రన్ చేపట్టాలి. వర్షాలతో జలాశయాలకు నీళ్లు వచ్చి చేరితే మోటారు పంపుల ద్వారా తోడి కాలువ నుంచి నీటిని తరలించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రగతి విరిసేలా.. పాలమూరు మెరిసేలా!
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయ్యింది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఉమ్మడి మహబూబ్నగర్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు రంగాల్లో ప్రగతి దశగా అడుగులు పడ్డాయి. -
సమగ్ర వికాసమే సంకల్పం
[ 02-06-2024]
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ తమ నియోజక వర్గ సర్వతో ముఖాభివృద్ధే ధ్యేయమని పాలమూరు శాసనసభ్యులు అంటు న్నారు. ప్రధానంగా సాగునీటి వనరులపై దృష్టి సారిస్తామంటున్నారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు భారీ భద్రత
[ 02-06-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అవాంఛనీయ ఘటనలు -
ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పాలమూరు పట్టణం ముస్తాబైంది. తెలంగాణ, అంబేడ్కర్, క్లాక్టవర్, వన్టౌన్, కూడళ్లను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. -
డబ్బాలతోనే రండి.. మాంసం తీసుకెళ్లండి
[ 02-06-2024]
చికెన్, మటన్ కొనడానికి వెళ్లేందుకు ఇక నుంచి వట్టి చేతులతో వెళ్లవద్దని, స్టీల్ డబ్బాలు వెంట తీసుకెళ్లాలని మహబూబ్నగర్ పురపాలక సంఘం పట్టణవాసులను కోరుతోంది. -
విద్యుత్తు శాఖలో ప్రతి పనికి ఓ రేటు!
[ 02-06-2024]
విద్యుత్తు కనెక్షన్ లేని ఇల్లు బహుశ ఉండదేమో. అదే, ఆ శాఖ అధికారులు కొందరికి కలిసి వస్తోంది. నిబంధనల పేరుతో జాప్యం చేయడం.. చేయి తడిపితే పనులు చకచకా చేయడం వారికి సాధారణమైంది. -
చినుకు.. పడితే వణుకే!
[ 02-06-2024]
పట్టణాల్లో రహదారి పక్కనున్న కాలువ చిన్నదే అయినప్పటికీ అది సక్రమంగా లేకపోతే ఎదురయ్యే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఏళ్ల తరబడి నుంచి పట్టణాల్లో నివసిస్తున్న వారికి వర్షం పడితే దడే. -
లోతట్టు కాలనీలపై దృష్టేది?
[ 02-06-2024]
వర్షాల నేపథ్యంలో పురపాలకల్లోని లోతట్టు కాలనీల్లో ఆందోళన నెలకొంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది వార్డుల్లోని మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు -
వానాకాలం.. వ్యాధుల ముప్పు
[ 02-06-2024]
రుతువులతోపాటు వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల వచ్చే వ్యాధులే సీజనల్ రుగ్మతలు. అందులోనూ వానాకాలంలో దోమల వృద్ధి అపారంగా ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
-
అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి
-
రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
-
జగమొండి ప్రజ్వల్.. విచారణకు సహకరించడం లేదన్న సిట్