1500 మీటర్లకు 8 కిలోమీటర్ల ప్రయాణం
గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చేందుకు పక్కా రోడ్డు సౌకర్యం కల్పించడం ప్రభుత్వం, పాలకుల కనీస విధి. స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ కొన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు నేరుగా సరైన దారి లేదు.
వాగు అడ్డం.. తిరిగి వెళ్లాలంటే దూరాభారం
ఇటీవల వేచరేణి వాగులో పడిన ద్విచక్ర వాహన చోదకులను కాపాడుతున్న గ్రామస్థులు
న్యూస్టుడే, చేర్యాల: గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చేందుకు పక్కా రోడ్డు సౌకర్యం కల్పించడం ప్రభుత్వం, పాలకుల కనీస విధి. స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ కొన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు నేరుగా సరైన దారి లేదు. చేర్యాల మండలం వేచరేణి గ్రామస్థులదీ అదే పరిస్థితి. ఊరు మండల కేంద్రానికి చెంతనే ఉండగా నేరుగా వెళితే 1.5 కిలోమీటర్లే. ఆ దారిలో వెళ్లాలంటే వాగు దాటాల్సి వస్తోంది. వాగుపై వంతెన లేక చుట్టూ 8 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. గ్రామస్థులు ప్రతి చిన్న పనికీ మండల కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితుల్లో దూరా భారమైనా చుట్టూ తిరిగి వెళ్తున్నారు.
వర్షాకాలంలో మరింత కష్టం...
అసలే గుంతలతో కూడిన మట్టి రోడ్డు. అందుకు తోడు సుమారు 250 మీటర్ల వెడల్పుతో ఉన్న వాగు గ్రామస్థుల ప్రయాణానికి అడ్డంకిగా మారింది. వర్షాకాలం వస్తే వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. జీవనదిలా ఆరు నుంచి 9 నెలల పాటు కనీసం మోకాలి లోతు నీరు ఎప్పుడూ ఉంటుంది. వాగు దాటాలంటే చెప్పులు చేత పట్టుకొని, ప్యాంటు పైకి మడత వేసి వెళ్లాల్సిందే. దీంతో గ్రామస్థులు వ్యయ ప్రయాసాలకు ఓర్చి చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి ఆ మార్గంలో వచ్చిన ద్విచక్రవాహన చోదకులు వాగు నీటిలో పడిపోగా ఆ మార్గంలో వెళుతున్న వారు గమనించి కాపాడారు.
వంతెన నిర్మిస్తే.. ఎంతో ప్రయోజనం..
వేచరేణి వాగుపై వంతెన నిర్మిస్తే గ్రామస్థులకే కాకుండా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి వెళ్లేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. సుమారు 6 కిలోమీటర్ల అదనపు ప్రయాణం తప్పుతుంది. ఏటా స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు ప్రయోజనం కలుగుతుంది. పదేళ్ల క్రితం వాగులో ‘చెక్ డ్యాం’ నిర్మించగా రూపు మార్చి రోడ్డు కం వంతెనగా నిర్మించినా బాగుండేది. కేవలం అడ్డుకట్ట తరహాలో నిర్మించిన కాంక్రీటు కాస్తా ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ప్రతి ఏటా గ్రామస్థులు మట్టితో తాత్కాలికంగా రోడ్డు వేసుకుంటున్నా చిన్నపాటి వర్షం కురిసినా కొట్టుకుపోతోంది. సమస్యను ‘న్యూస్టుడే’ చేర్యాల ఐబీ డీఈ శ్యాం దృష్టికి తీసుకెళ్లగా సమస్య నా దృష్టికి రాలేదని, పరిశీలించి వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండగలా.. కదిలొచ్చారు
[ 14-05-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. పండగలా కదిలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
నొక్కి.. వక్కాణించారు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు జోరుగా సాగింది. మెదక్, జహీరాబాద్, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల అధినేతలు ప్రచారం హోరెత్తించి మాటల తూటాలు పేల్చారు. -
సంగాయిపేట తండాలో శత శాతం పోలింగ్
[ 14-05-2024]
కొల్చారం మండలం సంగాయిపేట తండాలోని 62/ఏ పోలింగ్ కేంద్రంలో శత శాతం పోలింగ్ నమోదైంది. -
సమస్యాత్మక కేంద్రాల్లో ప్రశాంత పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. -
సీఎంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
బీవీఆర్ఐటీలో 5, గురుకులంలో 2
[ 14-05-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపును నర్సాపూర్లో జూన్ 4న నిర్వహించనున్నామని ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి తెలిపారు. -
భారాస, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల కాంగ్రెస్, భారాస పార్టీల కార్యకర్తలు, నాయకులు గొడవ పడ్డారు. -
కార్పొరేట్ విద్య.. అందిపుచ్చుకుంటే భవిత
[ 14-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి 7 జీపీఏకు పైగా ఫలితం సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా అవకాశం కల్పిస్తుండటం విశేషం. -
పోలింగ్ శాతంపై తర్జనభర్జన
[ 14-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధి బెజ్జంకి మండలంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం నమోదులో అధికారులు తర్జనభర్జనకు గురయ్యారు. -
ఓటు వేసి వీడియో చిత్రీకరణ.. యువకులపై కేసు
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి చరవాణిలో స్వీయ వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
హల్దీ వాగులో దూకి వృద్ధుడి ఆత్మహత్య
[ 14-05-2024]
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు హల్దీ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం తూప్రాన్లో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక