logo

లక్ష్మీనృసింహ దర్పం.. రథోత్సవ వైభవం

వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి విమాన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారు జామున ఆలయంలోని ఉత్తర భాగం నుంచి వీధుల్లోకి రథంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 22 Mar 2023 01:06 IST

వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి విమాన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారు జామున ఆలయంలోని ఉత్తర భాగం నుంచి వీధుల్లోకి రథంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కోలాటాలు, బోనాలు, మంగళహారతులు, వాయిద్యాలు, భజనల సందడి మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. ఈవో సుధాకర్‌రెడ్డ్ది, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాజీ ఛైర్మన్‌ కొట్టాల యాదగిరి, జడ్పీటీసీ సభ్యుడు బాలమల్లు, ఎంపీపీ లత, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ రామకృష్ణారెడ్డి, సర్పంచి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, ములుగు, వర్గల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని