ఉపాధి నిధులు పక్కదారి
న్యాల్కల్ మండల పరిధిలో 2019 నుంచి 2022 వరకు రూ.10.99 కోట్ల విలువైన ఉపాధి పనులు చేపట్టారు. ఈ పనులపై ఈనెల 9న సామాజిక తనిఖీలు నిర్వహించారు.
సామాజిక తనిఖీల్లో వెల్లడి
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, రాయికోడ్, జోగిపేట
రాయికోడ్లో సామాజిక తనిఖీ సమావేశం(పాతచిత్రం)
న్యాల్కల్ మండల పరిధిలో 2019 నుంచి 2022 వరకు రూ.10.99 కోట్ల విలువైన ఉపాధి పనులు చేపట్టారు. ఈ పనులపై ఈనెల 9న సామాజిక తనిఖీలు నిర్వహించారు. కూలీలకు నగదు చెల్లింపులు, రికార్డుల నమోదు సక్రమంగా లేవు. సాంకేతిక, క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులకు తాఖీదులు జారీ చేశారు. రూ.65,815 రికవరీకి ఆదేశించారు.
రాయికోడ్ మండలంలో 2019 నుంచి 2022 వరకు రూ.15.89 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు చేశారు. ఆయా పనులపై ఈ నెల 10న తహసీల్దార్ కార్యాలయంలో సామాజిక తనిఖీలు చేపట్టారు. పనుల్లో రూ.2 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు తేల్చారు.
చాలా గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగినట్టు అధికారులు తేల్చారు. కూలీలు పనులకు రాకున్నా.. వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయటం, పనులు చేయకున్నా.. చేసినట్లు రాయడం, మొక్కలకు ఖర్చు విషయంలో ఇష్టారీతిన లెక్కలు రాయడం.. తదితర అంశాల్లో అవకతవకలు జరిగినట్టు సామాజిక తనిఖీల్లో అధికారులు తేల్చారు. 2019 నుంచి 2022 వరకు జరిగిన పనులకు సంబంధించిన సామాజిక తనిఖీలు జిల్లాలో కొనసాగుతున్నాయి.
639 గ్రామాల్లో అమలు
జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్) పథకాన్ని 639 గ్రామాల్లో అమలు చేస్తున్నారు. పంట కాల్వలు, ఊర కుంటలు, కందకాలు, చెరువులు, కుంటల్లో పూడికతీత, హరితహారంలో నాటిన మొక్కల పర్యవేక్షణ, నర్సరీలో మొక్కల పెంపకం తదితర పనులు చేపడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఆ పథకం అమలు బాధ్యత అప్పగించారు. అదనపు భారం వల్ల వారు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి.
సిబ్బందికి తాఖీదులు
సాంకేతిక సిబ్బంది, క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు ఉపాధి నిధుల అవకతవకలకు కారణమని అధికారులు గుర్తించారు. జిల్లాలో ఈ ఏడాది 22 మంది పంచాయతీ కార్యదర్శులు, 20 మంది క్షేత్ర సహాయకులు, 14 మంది సాంకేతిక సహాయకులు, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు తాఖీదులు జారీ చేశారు.
తిరిగి వసూలు చేస్తాం: శ్రీనివాస్రావు, డీఆర్డీవో
జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులు అక్కడక్కడా పక్కదారి పట్టినట్టు విచారణలో తేలింది. బాధ్యులకు ఇప్పటికే తాఖీదులు జారీ చేశాం. వారి నుంచి తిరిగి వసూలు చేస్తాం. జిల్లాలో పనులు సవ్యంగా చేసేలా ఎంపీడీవోలు, ఎంపీవోల పర్యవేక్షణ పెంచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండగలా.. కదిలొచ్చారు
[ 14-05-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. పండగలా కదిలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
నొక్కి.. వక్కాణించారు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు జోరుగా సాగింది. మెదక్, జహీరాబాద్, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల అధినేతలు ప్రచారం హోరెత్తించి మాటల తూటాలు పేల్చారు. -
సంగాయిపేట తండాలో శత శాతం పోలింగ్
[ 14-05-2024]
కొల్చారం మండలం సంగాయిపేట తండాలోని 62/ఏ పోలింగ్ కేంద్రంలో శత శాతం పోలింగ్ నమోదైంది. -
సమస్యాత్మక కేంద్రాల్లో ప్రశాంత పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. -
సీఎంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
బీవీఆర్ఐటీలో 5, గురుకులంలో 2
[ 14-05-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపును నర్సాపూర్లో జూన్ 4న నిర్వహించనున్నామని ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి తెలిపారు. -
భారాస, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల కాంగ్రెస్, భారాస పార్టీల కార్యకర్తలు, నాయకులు గొడవ పడ్డారు. -
కార్పొరేట్ విద్య.. అందిపుచ్చుకుంటే భవిత
[ 14-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి 7 జీపీఏకు పైగా ఫలితం సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా అవకాశం కల్పిస్తుండటం విశేషం. -
పోలింగ్ శాతంపై తర్జనభర్జన
[ 14-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధి బెజ్జంకి మండలంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం నమోదులో అధికారులు తర్జనభర్జనకు గురయ్యారు. -
ఓటు వేసి వీడియో చిత్రీకరణ.. యువకులపై కేసు
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి చరవాణిలో స్వీయ వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
హల్దీ వాగులో దూకి వృద్ధుడి ఆత్మహత్య
[ 14-05-2024]
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు హల్దీ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం తూప్రాన్లో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు