పేదలకు గృహలక్ష్మి అనుగ్రహం!
సొంతిల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ విషయాన్ని ఆలోచించరు. ఈ నేపథ్యంలో వీరి ఆకాంక్షను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
సొంత స్థలం ఉన్న పేదలకు ఆర్థిక సాయం
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్:
సొంతిల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ విషయాన్ని ఆలోచించరు. ఈ నేపథ్యంలో వీరి ఆకాంక్షను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే కొన్ని చోట్ల మాత్రమే వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో కొందరికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు. దీంతో సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించేందుకు ‘గృహలక్ష్మి’ పేరిట ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించనుంది. ఇప్పటికే ఆ పథకం కింద అర్హులు ఎవరు అనేది మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో జిల్లా గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది.
జిల్లాలో 15వేల మందికి లబ్ధి
ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి మూడు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు, జహీరాబాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 15వేల మందికి లబ్ధి చేకూరనుంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తోంది. ఈ మండలంలో ఎంత మందిని గుర్తిస్తారన్నది తేలాల్సి ఉందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కలెక్టర్కు ఎంపిక బాధ్యత
సొంత స్థలం ఉన్న పేదల గుర్తింపు బాధ్యత కలెక్టర్కు అప్పగించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయా దశల ఫొటోలు, ఇతర మార్గాల ద్వారా నిర్ధరించుకుని నిర్మాణాల పనులను పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు దశల వారీగా ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. లబ్ధిదారులకు పునాది దశలో రూ.లక్ష, స్లాబ్ దశలో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష మొత్తంగా రూ.3లక్షలు అందించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లుగా సంబంధిత జిల్లా అధికార వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం: ప్రసాద్, అధికారి,సంగారెడ్డి.
జిల్లాలో పథకం అమలు తీరుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. నియోజకవర్గానికి మూడు వేల మందిని ఎంపిక చేయనున్నాం. పాలనాధికారి ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. సొంత స్థలం ఉన్నా వారి వివరాలను సేకరించి ఎంపిక చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీలు రాక.. తూకం వేయక
[ 16-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు. కేంద్రాల్లో తూకం వేశాక, రోజుల తరబడి వడ్లను మిల్లులకు తరలించకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. -
వడ్లు తరలించాలని ధర్నా
[ 16-05-2024]
నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, తరలించాలని డిమాండ్ చేస్తూ చిట్కుల్లో బుధవారం రైతులు రోడ్డెక్కారు. -
నిధులున్నా నిస్తేజం
[ 16-05-2024]
ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు సర్కార్ కృషి చేస్తోంది. ఇందుకోసం నిధులు విడుదల చేసినా, పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
ఫలితాలపై జోరుగా పందేలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగియటంతో ఫలితాలపై బెట్టింగ్లు షురూ అయ్యాయి. ముఖ్యంగా మెదక్ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో అందరి దృష్టి ఈ స్థానంపైనే కేంద్రీకృతమైంది. -
తరలిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ..
[ 16-05-2024]
జిల్లా కేంద్రం మెదక్ పట్టణానికి మంజూరైన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆరేళ్లలో మూడు ప్రాంతాలకు మార్చారు. -
అప్రమత్తతే శరణ్యం.. ఆరోగ్యం సంపూర్ణం
[ 16-05-2024]
నిలువ, మురుగు నీరు ఆవాసంగా దోమలు పెరుగుతాయి. పూలకుండీలు, కూలర్లు, తాగి, వాడి పడేసిన కొబ్బరి బొండాలు, టైర్లలో ఆవాసం ఏర్పర్చుకొని పగటిపూట దోమలు కాటేస్తాయి. ఫలితంగా తీవ్రమైన కండరాల నొప్పి, వికారం, జ్వరం, కళ్లు ఎర్రబారటం లక్షణాలతో బాధపడుతుంటారు. -
ఫలితమిచ్చే చుక్క.. 37.110 లీటర్ల వినియోగం ఎంచక్కా!
[ 16-05-2024]
వేలిపై చుక్క.. ఫలితం ఇచ్చును ఎంచక్కా.. అనుకుంటూ.. ఈ నెల 13న రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు వరుస కట్టి హక్కు వినియోగించుకున్నారు. -
వేతన బకాయిలు కావాలని కార్మికుడి నిరసన
[ 16-05-2024]
వేతన బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో బుధవారం కార్మికుడు చిమ్నీ (పొగ గొట్టం) ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. -
కారు ఢీకొని భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
[ 16-05-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద (కొండాపురం మలుపు రోడ్డు) భువనగిరి-గజ్వేల్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. -
జాతీయ రహదారి విస్తరణ పనులు షురూ
[ 16-05-2024]
తెలంగాణ-కర్ణాటకలను అనుసంధానిస్తూ 161బి నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. -
పెరుగుతున్న ఖర్చులు.. తగ్గుతున్న రాబడి
[ 16-05-2024]
ప్రజలకు ఆనందాన్ని పంచుతున్న సినిమా థియేటర్లకు కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా పరిస్థితులకు ముందు ప్రేక్షకులతో కిటకిటలాడిన సినిమా హాళ్లు ప్రస్తుతం కళ తప్పాయి. -
పెట్రోల్లో నీళ్లు వచ్చాయని ఆందోళన
[ 16-05-2024]
ములుగు పెట్రోల్ బంక్లో తరచూ నీళ్లు వస్తున్నాయని బుధవారం వినియోగదారులు ఆందోళనకు దిగారు. ములుగుకు చెందిన తోడేటి వెంకటస్వామి తన ద్విచక్ర వాహనంలో ములుగు గ్రామంలో ఉన్న బంకులో పెట్రోలు పోయించుకున్నాడు. -
అందని వస్త్రం.. అందేనా ఏకరూపం
[ 16-05-2024]
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ప్రభుత్వమే ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తుంది. అందుకు ముందు నుంచి ప్రణాళికతో వ్యవహరిస్తుంటారు. -
అధిక లాభాలతో బురిడీ
[ 16-05-2024]
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ.1.98 లక్షలు కాజేసిన ఘటన ములుగు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత