Robbery: సీసీ కెమెరాలకు సున్నమేసి ఏటీఎంల లూటీ
జాతీయ రహదారి పక్కన విస్తరించిన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు.
సదాశివపేటలో సుమారు రూ.28 లక్షల అపహరణ
దొంగలు కొల్లగొట్టిన ఎస్బీఐ ఏటీఎం
సదాశివపేట, సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: జాతీయ రహదారి పక్కన విస్తరించిన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. సీసీ కెమెరాలకు పెయింట్తో కూడిన సున్నం చల్లి గ్యాస్ కట్టర్ల సాయంతో ఒకే బ్యాంకుకు చెందిన మూడు ఏటీఎంలను కొల్లగొట్టి సుమారు రూ.28 లక్షలతో ఉడాయించారు. సదాశివపేటలోని బసవేశ్వర మందిరం, గాంధీ చౌక్, బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ)కు చెందిన మూడు ఏటీఎంలు ఉన్నాయి.
బుధవారం ఉదయం నిద్రలేవగానే, చోరీ జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్యాంకు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం బృందాలను రంగంలోకి దించారు. ఆధారాలు చిక్కకుండా చేసేందుకు దొంగలు ఆయా ఏటీఎంల్లోని సీసీ కెమెరాలకు సున్నం పిచికారీ చేశారు. గ్యాస్ కట్టర్ల సాయంతో తెరిచారు. సమీప కాలనీల్లోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు బుధవారం తెల్లవారుజామున 3 నుంచి 3.40 గంటల మధ్య టీఎస్09 ఎఫ్ఈ 5840 కారులో చోరులు వచ్చినట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం మూడు ఏటీఎంలలో కలిపి సుమారు రూ.28 లక్షల వరకు చోరీ అయినట్లు భావిస్తున్నారు. ఏటీఎంలలో ఎంత నగదు పెట్టారు? ఎంత డ్రా చేశారనేది పక్కాగా తెలిస్తేనే స్పష్టత వస్తుంది. గతంలో ఈ తరహా చోరీలకు తెగబడిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన పాత నేరస్థుల ముఠా ఈ పని చేసిందా? లేక పొక్లెయిన్లకు మరమ్మతులు చేసే వ్యక్తులు ఎవరైనా చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పట్టణ సీఐ నవీన్ కుమార్ కేసు నమోదు చేశారు.
రంగంలోకి నాలుగు బృందాలు
ఈ ఘటనను సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ సీరియస్గా తీసుకున్నారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులను బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన శాంతిభద్రతల సమావేశానికి రావొద్దని, అక్కడే ఉండి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టణంతోపాటు 65వ నంబరు జాతీయ రహదారి, టోల్గేట్లు తదితర చోట్ల తనిఖీలు చేశారు. దొంగలు చోరీకి వినియోగించిన కారు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి వెళ్లింది.. అనే కోణంలో పరిశీలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత.. ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతం పెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య