వక్ఫ్బోర్డు స్థలాల్లో ఆగని ఆక్రమణల పర్వం
రాజకీయ పలుకుబడి ధీమాతో కబ్జాదారులు వక్ఫ్బోర్డు స్థలాల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల వక్ఫ్బోర్డుకు ఛైర్మన్ను నియమించిన నేపథ్యంలోనైనా వాటి స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా...
నిర్మాణాన్ని కూలగొడుతున్న అధికారులు
న్యూస్టుడే, గజ్వేల్: రాజకీయ పలుకుబడి ధీమాతో కబ్జాదారులు వక్ఫ్బోర్డు స్థలాల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల వక్ఫ్బోర్డుకు ఛైర్మన్ను నియమించిన నేపథ్యంలోనైనా వాటి స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాలో ప్రభావం కనిపించటం లేదు. గజ్వేల్ పట్టణంలోని వక్ఫ్ బోర్డు సంబంధిత రూ.కోట్ల విలువైన స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. మసీదులు, దర్గాల నిర్వహణకు పూర్వం వక్్్ఫ బోర్డు కేటాయించిన ఈ భూముల్లో నిబంధనలు అతిక్రమించి ఎలాంటి నిర్మాణాలైనా.. క్రయవిక్రయాలైనా చేయరాదని ఉన్నా అనేక చోట్ల వాణిజ్య సముదాయాలు, ఇళ్ల నిర్మాణాలు సాగిపోతూనే ఉన్నాయి.
200 ఎకరాల ఖాళీ భూములు
రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టణంలో 292.29 ఎకరాల వక్ఫ్ భూములున్నాయి. ఇందులో 5.25 ఎకరాల్లో మసీదులు, ఈద్గాలు, ఇతర ప్రార్థన మందిరాలున్నాయి. కొంత స్థలం రోడ్ల విస్తరణలో కలిసిపోయింది. కబ్రస్థాన్, పాడుబడిన బావులు, కాలువలు, గుమ్మటాలు తదితరాలు పోనూ మిగతా సుమారు 200 ఎకరాలకుపైగా ఖాళీ స్థలం ఉంటుందని అధికారుల అంచనా. జాలిగామ రోడ్డులో కొంత భూమి సాగులో ఉండగా చాలా చోట్ల ఆక్రమణకు గురైందని స్థానికులు చెబుతున్నారు. రూ.20 కోట్ల విలువైన స్థలాలు ఆక్రమణకు గురైనట్లు అంచనా. పలు పార్టీలకు చెందిన నేతలు ఆ భూములపై కన్నేసి ప్రస్తుతం బినామీలతో నిర్మాణాలు చేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
తూతూమంత్రంగా చర్యలు
ఇక్కడ ఒక గజం స్థలం బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. అధికారులు ఫిర్యాదులు వచ్చినపుడు నిర్మాణాలను పాక్షికంగా ధ్వంసం చేసి ఊరుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత కబ్జాదారులు యథావిధిగా నిర్మించుకుంటున్నారు. గజ్వేల్ ఇందిరా పార్కు నుంచి తూప్రాన్ రోడ్డులో, జాలిగామ బైపాస్ దారిలో దుకాణ సముదాయాలు నిర్మిస్తున్నారు. వివిధ మండలాల్లోని సాగు భూములు సైతం పరాధీనమయ్యాయి. ఈ విషయమై ఆర్డీవో బన్సీలాల్ మాట్లాడుతూ.. వక్ఫ్బోర్డు భూములను ఎవరు ఆక్రమించినా చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జహీరాబాద్లో మూడు రంగులజెండా ఎగరాలి
[ 12-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోకు పార్టీ అగ్రనాయకురాలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
అభివృద్ధిని అడ్డుకొని..ఎలా ఓట్లడుగుతారు?
[ 12-05-2024]
‘నిధులన్నీ మెదక్ జిల్లాకు, గజ్వేల్ అభివృద్ధికే కేటాయిస్తున్నారని నాడు అడ్డు తగిలిన కాంగ్రెస్, భాజపా నాయకులు.. ఇవ్వాళ పార్లమెంటు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని.. ఈ ప్రాంతాల్లో ఓట్లు అడుగుతున్నారు? -
ప్రలోభాలకు లొంగొద్దు.. ధైర్యంగా ఓటేయండి
[ 12-05-2024]
ఓటర్లు ప్రలోభాలు, డబ్బులకు లొంగకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కును అమ్ముకోవద్దని, నిర్భయంగా, నిజాయతీతో ఓటు వేయాలని మెదక్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. -
ఎవరి మాట..మీటనొక్కించనుందో!
[ 12-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. -
తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్దే
[ 12-05-2024]
తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. -
మెతుకు సీమలో ఎగిరేది కాషాయ జెండానే: భాజపా
[ 12-05-2024]
మెదక్ సీమపై ఎగిరేది కాషాయ జెండానేనని భాజపా రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ ధీమా వ్యక్తం చేశారు -
అధికారంలోకి వస్తే పెరగనున్న వేతనాలు
[ 12-05-2024]
కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాహుల్గాంధీ ప్రధానమంత్రి కాగానే ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెరుగుతాయని మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. -
మూగబోయిన మైకులు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ఓటర్ల నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు అన్ని విధాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసు కమిషనర్ అనూరాధ వెల్లడించారు. కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్, జియోట్యాగింగ్ చేశామన్నారు. -
ఓటర్లను కదిలించు తల్లీ..
[ 12-05-2024]
అమ్మ.. అలుపు ఎరగకుండా శ్రమిస్తుంది. కుటుంబ ఉన్నతికి తపిస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. -
దివ్యస్ఫూర్తి.. శతాధిక కీర్తి
[ 12-05-2024]
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు పాత్ర కీలకం.. ఓటు హక్కు కలిగి ఉండటమే కాదు.. దాన్ని సద్వినియోగం చేసుకున్నపుడే సార్థకత చేకూరుతుంది. -
నిఘా నీడలో ఎన్నికలు
[ 12-05-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు, సమస్యలు ఉంటుండేవి. -
ఓటును అమ్ముకోకు.. ఆత్మాభిమానాన్ని చంపుకోకు
[ 12-05-2024]
ఓటుహక్కు ఉండి వేయలేకపోతే మనం భూమ్మీద ఉండి లేనట్లే లెక్క. ఏడాదికోసారి వచ్చే పండగలు బంధాలను కలుపుతాయి. -
ఓటర్లు సొంతూళ్లకు తరలేలా..
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సమాయత్తమైంది.