ఎండ ప్రచండం.. ప్రచారానికి గండం!
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి తొలి అంకం ముగిసి అభ్యర్థుల లెక్కతేలింది. ఇక ప్రచారం మరింతగా వేడెక్కనుంది.
నాయకుల, కార్యకర్తల ఆపసోపాలు
న్యూస్టుడే, మెదక్
మెదక్లో నిర్మానుష్యంగా మారిన రహదారి
మిట్ట మధ్యాహ్నం 12.30 గంటలు, 44 డిగ్రీల ఎండలో ఒక్కరు కూడా కదలకుండా...పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్కు వచ్చిన కార్యకర్తలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇది భారాస కార్యకర్తల పట్టుదలకు నిదర్శనం.
ఈనెల 25న మెదక్లో కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి హరీశ్రావు
తీవ్రమైన ఎండ నేపథ్యంలో సభికులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సమయం ప్రసంగించబోనంటూ ఇటీవల సిద్దిపేటలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. ఆయన ఎనిమిది నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించారు.
సీఎం రేవంత్రెడ్డి అన్న మనసు చల్లగ లాగా... ఈ రోజు సూర్య భగవానుడు కరుణించడంతో వాతావరణం చల్లబడింది.
- ఈనెల 20న మెదక్లో సీఎం కార్నర్ మీటింగ్లో మంత్రి కొండా సురేఖ.
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి తొలి అంకం ముగిసి అభ్యర్థుల లెక్కతేలింది. ఇక ప్రచారం మరింతగా వేడెక్కనుంది. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అభ్యర్థులు, పార్టీ శ్రేణులు సతమతమవుతున్నారు. పూర్తిగా క్షేత్రస్థాయిలో నిమగ్నమవ్వాల్సిన సమయం ఆసన్నమైన తరుణంలో ఎండ ఓ సవాలుగా మారింది. రెండు వారాలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉండడంతో జోరు పెంచేందుకు సిద్ధమవుతున్నప్పటికీ ఎండలను ఎలా అధిగమించాలి? మిట్టమధ్యాహ్నం ప్రచారం ఎలా? ఒకవేళ ప్రచారానికి శ్రేణులను సమీకరించాల్సి వస్తే ముందుకు సాగడం సాధ్యమేనా.. అనే ప్రశ్నలు ఆయా పార్టీల్లో ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యప్రతాపం మొదలవుతోంది. ఇక మధ్యాహ్నం 12 దాటగానే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ఉష్ణతాపం తగ్గడం లేదు. దీంతో ఆయా పార్టీల్లో ఆందోళన నెలకొంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లకే మొగ్గు చూపుతున్నారు.
ఉదయం. రాత్రి వేళల్లో: ఎండ వేడి, ఉక్కపోత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రచారం, సభలు నిర్వహించాలని పార్టీల బాధ్యులు నిర్ణయించారు. బహిరంగ సభలను ఉదయం పూట నిర్వహించాల్సి వస్తే టెంట్లు వేస్తున్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్రావు నామినేషన్ తొలిరోజున రాత్రి మెదక్లో కార్నర్మీటింగ్ నిర్వహించారు. శుక్రవారం పెద్దశంకరంపేటలో సీఎం రేవంత్రెడ్డి సభను సాయంత్రం ఏర్పాటు చేశారు. మెదక్లో ఈనెల 20 సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా వాతావరణం చల్లబడింది. 25న మెదక్లో భారాస ర్యాలీ మండుటెండలో నిర్వహించారు. భాజపా అభ్యర్థి రఘునందన్రావు తరఫున పార్టీ శ్రేణులు బూత్ వారీగా ఉదయం, సాయంత్రమే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మండలాల వారీగా ఉదయం నుంచి రాత్రి వరకు పాల్గొంటున్నారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సైతం ప్రచారాన్ని ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జహీరాబాద్లో మూడు రంగులజెండా ఎగరాలి
[ 12-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోకు పార్టీ అగ్రనాయకురాలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
అభివృద్ధిని అడ్డుకొని..ఎలా ఓట్లడుగుతారు?
[ 12-05-2024]
‘నిధులన్నీ మెదక్ జిల్లాకు, గజ్వేల్ అభివృద్ధికే కేటాయిస్తున్నారని నాడు అడ్డు తగిలిన కాంగ్రెస్, భాజపా నాయకులు.. ఇవ్వాళ పార్లమెంటు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని.. ఈ ప్రాంతాల్లో ఓట్లు అడుగుతున్నారు? -
ప్రలోభాలకు లొంగొద్దు.. ధైర్యంగా ఓటేయండి
[ 12-05-2024]
ఓటర్లు ప్రలోభాలు, డబ్బులకు లొంగకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కును అమ్ముకోవద్దని, నిర్భయంగా, నిజాయతీతో ఓటు వేయాలని మెదక్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. -
ఎవరి మాట..మీటనొక్కించనుందో!
[ 12-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. -
తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్దే
[ 12-05-2024]
తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. -
మెతుకు సీమలో ఎగిరేది కాషాయ జెండానే: భాజపా
[ 12-05-2024]
మెదక్ సీమపై ఎగిరేది కాషాయ జెండానేనని భాజపా రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ ధీమా వ్యక్తం చేశారు -
అధికారంలోకి వస్తే పెరగనున్న వేతనాలు
[ 12-05-2024]
కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాహుల్గాంధీ ప్రధానమంత్రి కాగానే ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెరుగుతాయని మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. -
మూగబోయిన మైకులు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ఓటర్ల నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు అన్ని విధాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసు కమిషనర్ అనూరాధ వెల్లడించారు. కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్, జియోట్యాగింగ్ చేశామన్నారు. -
ఓటర్లను కదిలించు తల్లీ..
[ 12-05-2024]
అమ్మ.. అలుపు ఎరగకుండా శ్రమిస్తుంది. కుటుంబ ఉన్నతికి తపిస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. -
దివ్యస్ఫూర్తి.. శతాధిక కీర్తి
[ 12-05-2024]
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు పాత్ర కీలకం.. ఓటు హక్కు కలిగి ఉండటమే కాదు.. దాన్ని సద్వినియోగం చేసుకున్నపుడే సార్థకత చేకూరుతుంది. -
నిఘా నీడలో ఎన్నికలు
[ 12-05-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు, సమస్యలు ఉంటుండేవి. -
ఓటును అమ్ముకోకు.. ఆత్మాభిమానాన్ని చంపుకోకు
[ 12-05-2024]
ఓటుహక్కు ఉండి వేయలేకపోతే మనం భూమ్మీద ఉండి లేనట్లే లెక్క. ఏడాదికోసారి వచ్చే పండగలు బంధాలను కలుపుతాయి. -
ఓటర్లు సొంతూళ్లకు తరలేలా..
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సమాయత్తమైంది.