ప్రేమజంట బలవన్మరణం
ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
ఆత్మకూర్ (ఎస్), న్యూస్టుడే: ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై వై.సైదులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండగాని సంజయ్(25), ఆ గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన కృష్ణసముద్రం గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి(23) ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని గతంలోనే నాగజ్యోతి ఇంట్లో తెలుపగా.. ఆమె తండ్రి వారించాడు. అప్పటినుంచి వారిద్దరు కొన్ని రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. నాగజ్యోతి ఇమాంపేటలోని ఓ కళాశాలలో బీఫార్మసీ పూర్తిచేసింది. ప్రస్తుతం సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ ఎం.ఫార్మసీ చదువుతోంది. సంజయ్ సూర్యాపేటలో ఉంటూ వాటర్ప్లాంట్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తిరిగి వారిద్దరు ప్రేమను కొనసాగిస్తున్నారు. గ్రామస్థులు కొందరు కలిసి నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుకు వీరిపై లేనిపోని మాటలు చెప్పి ఇద్దరిని విడదీయాలని యత్నించారు. వారి మాటలు నమ్మిన శ్రీను పలుమార్లు ఆమెను కొట్టాడు. యువతి తరఫు బంధువులు కొందరు కొద్ది రోజుల క్రితం సంజయ్తో గొడవపడి దూషించి అతడిని కొట్టి ఇబ్బంది పెట్టారు. దీంతో వారిద్దరు మనస్తాపానికి గురై శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి.. రాత్రి సమయంలో తుమ్మలపెన్పహాడ్ గ్రామశివారులో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ పెళ్లికి అడుగడుగునా అడ్డుపడి తమ చావుకు కారణమైన ఏడుగురు వ్యక్తుల పేర్లను సూచిస్తూ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాసిన లేఖ మృతురాలి బ్యాగులో లభించిందని ఎస్సై తెలిపారు. మృతురాలి తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
కూసుమంచి, న్యూస్టుడే: పాలేరుకు చెందిన ఓ వివాహిత ఆదివారం బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన ప్రకారం... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కోడిపుంజులగూడేనికి చెందిన తేజశ్రీ(26)కి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరుకు చెందిన రంజిత్రెడ్డితో మూడేళ్ల క్రితం వివాహమైంది. భర్త మిషన్ భగీరథ ఆపరేటర్గా చేస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఆదివారం భర్త రంజిత్ రెడ్డి, మామ రంగారెడ్డి స్థానికంగా లేరు. ఈ నేపథ్యంలో ఇంట్లోని బెడ్రూంలోకి వెళ్లిన తేజశ్రీ ఫ్యాన్కు ఉరేసుకుంది. ఉరికి వేలాడుతున్న విషయాన్ని పిల్లలు గమనించి చెప్పడంతో అత్త వెళ్లి చూసేసరికి ఆమె మృతి చెందింది. తేజశ్రీ ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ కిరణ్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
[ 14-05-2024]
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. -
స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 14-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం బాక్స్లను భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. -
ఓటే వజ్రాయుధమనె.. ప్రజాస్వామ్యానిదే విజయమనె..!
[ 14-05-2024]
నల్గొండ, భువనగిరి రెండు లోక్సభ స్థానాల్లోనూ పోలింగ్ అంకం సోమవారం ప్రశాంతంగా ముగిసింది. -
సిరా చుక్కలో.. భవిష్యత్తు లెక్క..!
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18వ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేలా, పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా ఎన్నికల సంఘం వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్ది ఆహ్వానించింది. -
ఓటు విలువ గుర్తించి.. ఖండాలు దాటొచ్చి
[ 14-05-2024]
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే.. ఓటు అనే ఆయుధాన్ని అందరూ సంధించాల్సిందే. వజ్రాయుధం లాంటి ఓటుహక్కు వినియోగించడానికి విదేశాల నుంచి వచ్చారు.. పలువురు ఓటర్లు. -
టెండర్ ఓటు వేసిన దంపతులు
[ 14-05-2024]
తమ ఓటును ఇది వరకే వేరొకరు వేయడంతో దంపతులు అవాక్కయిన ఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన ఇక్కె లక్ష్మీనారాయణ, ఉమారాణి దంపతులు లోక్సభ ఎన్నికల్లో -
ఈవీఎంల మొరాయింపు.. ఆలస్యంగా పోలింగ్
[ 14-05-2024]
శాసనసభ ఎన్నికల వేళ ఓటర్లలో, నాయకుల్లో, అభ్యర్థుల్లో కనిపించిన ఉత్సాహం లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ కనిపించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జనగామ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తగ్గింది. -
ఇటు ఖాళీగా.. అటు నిండుగా
[ 14-05-2024]
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. నిన్నటి వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేలాది వాహనాలు బారులు తీరాయి. -
వెబ్కాస్టింగ్ ద్వారా అధికారుల పర్యవేక్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తీరును కలెక్టరేట్లోని కంట్రోల్రూం ద్వారా అధికారులు పర్యవేక్షించారు. -
ఫలించిన ఎన్నికల ప్రణాళిక
[ 14-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎస్సెల్బీసీ ఎప్పటికి పూర్తయ్యేనో..!
[ 14-05-2024]
ఎన్నికలు ఏవైనా సరే.. లోక్సభ కావొచ్చు.. అసెంబ్లీ కావొచ్చు.. గత నాలుగు దశాబ్దాలుగా మారుమూల దేవరకొండ గిరిజన ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీల నినాదం ఎస్సెల్బీసీ సొరంగం నిర్మాణం పూర్తిపైనే. -
అభివృద్ధి చేసే నాయకులను వదులుకోవద్దు: ఎంపీ ఉత్తమ్
[ 14-05-2024]
ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అమ్యూలమైన ఓటుహక్కును వినియోగించుకున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఈ ఎన్నికలు స్ఫూర్తిదాయకం: ఎస్పీ
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా చిన్న ఘటన జరగకుండా లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. -
పరిశీలించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. -
ఇచ్చిందే కొసరంత.. అందులోనే కోత..!
[ 14-05-2024]
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బు, మద్యం పంపిణీ చేస్తుంటారు. -
బందోబస్తును పర్యవేక్షించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. -
తప్పిన పెను ప్రమాదం
[ 14-05-2024]
ఆలేరులోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ప్రభుత్వ కంపెనీలన్నీంటిని ప్రైవేటీకరిస్తాం: ప్రధాని షెహబాజ్
-
దిల్లీ vs లఖ్నవూ.. నేటి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్పై ప్రభావమెంత..?
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM