logo

భువనగిరి బరిలో 39 మంది

భువనగిరి పార్లమెంటు స్థానానికిగాను 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా పోటీలో 39 మంది మిగిలారు.

Published : 29 Apr 2024 16:54 IST

భువనగిరి: భువనగిరి పార్లమెంటు స్థానానికిగాను 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా పోటీలో 39 మంది మిగిలారు. మొత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 10 నామినేషన్లను తిరస్కరించారు. 51 మంది రంగంలో ఉండగా 12 మంది సోమవారం తమ నామ పత్రాలను ఉపసంహరించుకోవడంతో 39 మంది బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, ఇతర రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు పోను మిగిలినవారికి గుర్తుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. కలెక్టర్ రిటర్నింగ్ అధికారి హనుమంతు కే జండగే ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని