అలివి కాలేదట!
అలివి వలల మాఫియా చర్యలను అధికారులు నియంత్రించలేకపోతున్నారు.
జలాశయంలో అలివి వలలు
అలివి వలల మాఫియా చర్యలను అధికారులు నియంత్రించలేకపోతున్నారు. అధికార పార్టీ అండదండలు.. ముడుపుల ఆశ.. వారి చేతులు కట్టేస్తోంది. ఫలితంగా ఈ ఏడాదీ సోమశిల జలాశయంలో అక్రమ వేట మొదలైంది. సోమశిల జలాలను ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని అలవి వలలు లాగేందుకు అనువుగా చెట్లను కొట్టి చదును చేసి మరీ.. తమ దందాకు తెరలేపడం గమనార్హం.
ఆత్మకూరు, న్యూస్టుడే
సోమశిల జలాశయం నీటి నిల్వ విస్తీర్ణం 48 చదరపు కి.మీ. నిండుగా ఉన్న ప్రస్తుత తరుణంలో సాధారణ వేటతో చేపలు పెద్దగా పడవు. దాంతో తమ ఆదాయం కోసం కొందరు అలివి వలలను దించి వేటకు సిద్ధమయ్యారు. చెప్పాలంటే.. సోమశిలలో అలివి వలలతో వేట నిషిద్ధం. వాటితో వేటాడితే.. చిన్న చిన్న చేపపిల్లలు సహా ఊడ్చేస్తాయని.. తద్వారా మత్స్య సంపద అంతరించి.. మత్స్యకారుల జీవనం దుర్భరంగా మారుతుందని.. ఆ తరహా వేటను నిషేధించారు. కానీ, కొందరు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందాలని వాటిని జలాశయంలోకి దించారు. సుమారు 16 వలలు సోమశిల లోతట్టులోకి వెళ్లాయి. అలివిలు లాగేందుకు జలాశయం పరిసర ప్రాంతాలను అనువుగా చేసుకున్నారు.
జలాశయం పక్కనున్న అడవిని చదును చేసి..
సరిహద్దుల సాకుగా..
అలివి వలల వేటను అడ్డుకోవాల్సిన అధికారులు.. సరిహద్దులను సాకుగా చూపుతున్నారు. జలాశయం నుంచి 2 కి.మీ. లోపలికి నెల్లూరు జిల్లా ప్రాంతం ఉంది. అక్కడి నుంచి కడప జిల్లా పరిధి వస్తుంది. అక్రమ వేట చేసే వారు ఆ జిల్లా భూభాగాన్ని వేదిక చేసుకున్నారు. దాంతో అది తమ ప్రాంతం కాదని అధికారులు అటువైపు చూడటం లేదు. ఇది అక్రమార్కులకు పరోక్షంగా ప్రోత్సాహకరంగా మారింది. గత ఏడాది అలివి వలల విషయం పెద్ద వివాదానికి దారి తీసింది. వాటిని దించకుండా మత్స్యకారులు అడ్డుకున్నారు. ఈ ఏడాది మళ్లీ గుట్టుగా అదే పని జరుగుతోంది.
జిల్లా భూభాగం కాదు...
- నాగేశ్వరరావు, జేడీ మత్స్యశాఖ
జలాశయంలో.. జిల్లా ప్రాంతంలో అలివిలతో వేటాడేందుకు అనువైన ప్రాంతం లేదు. కడప జిల్లాలో ఆ పరిస్థితులు ఉన్నాయి. అక్కడి అధికారులు వాటిని అరికట్టాల్సి ఉంది. మేము వెళితే.. మీకిక్కడ ఏం పని అంటున్నారు. దాంతో ఏమీ చేయలేకున్నాం. అక్కడి అధికారులే అరికట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయకేతన.. జయదీవెన
[ 04-05-2024]
నెల్లూరు నగరంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్కల్యాణ్లు నిర్వహించిన రోడ్షో, ప్రజాగళం సభకు ప్రజలు పోటెత్తారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తమ అధినేతలకు ఘనస్వాగతం పలికారు. -
అయిదేళ్ల పాలన.. మూడుసార్లు వడ్డన!
[ 04-05-2024]
నేనున్నాను.. నే విన్నానని పదేపదే చెప్పి.. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి.. ఆర్టీసీ ఛార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. గత ప్రభుత్వంపై నానా యాగీ చేసి పీఠమెక్కిన ముఖ్యమంత్రి.. వైకాపా అయిదేళ్ల పాలనలో మూడుసార్లు ఛార్జీలు పెంచారు. -
అదేతీరు.. పండుటాకుల కన్నీరు
[ 04-05-2024]
బ్యాంకుకు వెళ్లిన తర్వాత పాన్కార్డు, ఆధార్ కార్డు, ఫొటోలు తీసుకొస్తే నగదు డ్రా చేసుకోవచ్చన్నారు. ఎండలో నకలు కాపీల కోసం ప్రదక్షిణలు చేశాం. నాలుగేళ్లుగా ఖాతా లావాదేవీలు నిలిచిపోయినట్లు బ్యాంకర్లు చెప్పారు. పింఛను అందక నిరాశ చెందా. ప్రభుత్వ నిర్ణయం సరికాదు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 85 ఏళ్లుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కు కల్పించే ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. -
నేడు సీఎం జగన్ పర్యటన
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ శనివారం నెల్లూరుకు రానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు చాపర్లో వీఆర్సీ క్రీడా మైదానానికి చేరుకుని.. 3.10 గంటలకు రోడ్షో నిర్వహించనున్నారు. -
మాటల్లో ప్రేమ.. చేతల్లో ఏదయ!
[ 04-05-2024]
ఎస్సీ.. ఎస్టీలపై ప్రేమ ఒలకబోసిన జగన్.. ఆయా సామాజిక వర్గాల అభ్యున్నతిపై విషం కక్కారు. తెదేపా పాలనలో వెలుగు వెలిగిన ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. అయిదేళ్ల పాలనలో కార్పొరేషన్కు పైసా విదల్చని జగన్.. ఎన్నికల వేళ ఆయా సామాజిక వర్గాల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు. -
సోమశిల నుంచి 1.5 టీఎంసీల నీటిని తీసుకొస్తాం
[ 04-05-2024]
రాళ్లపాడు జలాశయానికి సోమశిల ప్రాజెక్టు నుంచి ఏటా రావాల్సిన 1.5 టీఎంసీల నీటిని తీసుకొచ్చి అన్నదాతను ఆదుకుంటామని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారు. -
వైకాపా ప్రచారంలో వీవోఏ, ఉపాధ్యాయుడు
[ 04-05-2024]
వరికుంటపాడు మండలం ధర్మవరంలో శుక్రవారం వైకాపా అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి ప్రచారంలో నార్తుకొండాయపాలెం వీవోఏ జె.అనూష పాల్గొన్నారు. అభ్యర్థికి గజమాల వేసి ప్రచారంలో పాల్గొన్నారు. -
జగన్ పాలన.. వేతన జీవులకు వెత
[ 04-05-2024]
జగన్ పాలనలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ప్రతి నెలా జీతం సకాలంలో అందక ఆర్థికంగా అవస్థ పడుతున్నారు. జీతం ఎప్పుడొస్తుందోనని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. -
సజావుగా ఎన్నికల నిర్వహణ: కలెక్టర్
[ 04-05-2024]
పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో శుక్రవారం పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్స్ నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణను పరిశీలించారు. -
అభి సుజుకి నూతన షోరూం ప్రారంభం
[ 04-05-2024]
నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో అభి సుజుకి రెండో షోరూంను శుక్రవారం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ జోనల్ సర్వీస్ మేనేజర్ వెంకటేషన్ ప్రారంభించారు. -
రైతు నేస్తమన్నావ్.. కన్నీరు నింపావ్!
[ 04-05-2024]
రైతు నేస్తమన్నావు.. అండగా నిలుస్తానన్నావ్.. వారి క్షేమమే ప్రాధాన్యమని ముఖ్యమంత్రి జగన్ నమ్మించారు. వారి కష్టాలు మాత్రం పట్టించుకోలేదు. పంటలు పండించే మార్గాలను గాలికొదిలేశారు. పొలాలకు నీరు అందించే కాలువల నిర్వహణ అయిదేళ్లుగా మరిచిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య