కొలతలు.. కలతలు
భూ సర్వే కోసం అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా భూ వివాదం ముగియడం లేదు. అధికారులు అర్జీలు తీసుకోవడానికే పరిమితమవుతున్నారు. వేధిస్తున్న సర్వేయర్ల కొరత సమస్యను
నెలల తరబడి దరఖాస్తుదారుల ఎదురుచూపులు
ఈనాడు డిజిటల్, కామారెడ్డి, న్యూస్టుడే, బాన్సువాడ గ్రామీణం
సర్వే చేయాల్సిన భూములు
భూ సర్వే కోసం అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా భూ వివాదం ముగియడం లేదు. అధికారులు అర్జీలు తీసుకోవడానికే పరిమితమవుతున్నారు. వేధిస్తున్న సర్వేయర్ల కొరత సమస్యను నానాటికీ పెంచుతోంది. జిల్లాలో దాదాపుగా అన్ని మండలాల్లో ఇబ్బడిముబ్బడిగా వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక మూలకు చేరుతున్నాయి.
నిబంధనల మేరకు.. సర్వేయరు నెలరోజుల్లోగా అర్జీలను పరిష్కరించాలి. కొంత మంది దరఖాస్తుదారులు ఇక సర్వే చేయరనే నమ్మకానికి వచ్చేశారు. పలుమార్లు ఫోన్లు చేసినా స్పందించడం లేదంటున్నారు. మరో వైపు కొన్ని గ్రామాల్లో పైరవీ ఉన్న వారి భూముల్నే సర్వే చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేతి వాటాల్ని ప్రదర్శిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పూర్తి చేసినట్లు విమర్శలున్నాయి.
సర్వేయర్ల కొరత..
* జిల్లాలో 27 మంది సర్వేయర్లకు గాను 13 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ఇద్దరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు.
* ప్రస్తుతం జిల్లాలో 22 మండలాలకు 11 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు రెండు మండలాల్లో పనులు చేపడుతున్నారు.
* దీనికి తోడు జాతీయ రహదారులు, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు, అటవీ, రెవెన్యూశాఖల తగాదాలు తేల్చేందుకు భూమి హద్దులు నిర్ణయించాల్సి వస్తోంది. దీంతో రైతుల అర్జీలు మూలనపడుతున్నాయి.
జోనల్ బదిలీలతో బేజారు.. జోనల్ బదిలీల అనంతరం సర్వే విభాగం పనితీరు అధ్వానంగా మారింది. ఇదివరకు జిల్లాలో విధులు నిర్వహించిన ఏడుగురు సర్వేయర్లు ఇతర జిల్లాలకు వెళ్లారు. కొత్తగా వచ్చిన వారు విధుల్లో చేరినప్పటికీ ఇప్పటికీ పని మొదలుపెట్టలేదు. వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లేందుకు పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం. దీనికి తోడు డివిజన్ స్థాయిలో ఉండే నలుగురు సర్వేయర్లను ఇతర జిల్లాలకు అటాచ్ చేశారు. వీరు రేపో మాపో రిలీవ్ కానున్నారు. కొత్తగా ఒక్కరిని కూడా జిల్లాకు కేటాయించలేదు.
కాలయాపన చేస్తున్నారు
బాన్సువాడ మండలం కొయ్యగుట్టకు చెందిన భాస్కర్ అనే రైతు మూడు నెలల కిందట భూ సర్వే కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. సర్వేనంబరు 134లో 7.5 ఎకరాలు సర్వే చేయాలని రుసుము చెల్లించారు. పక్కనే ఉన్న స్థలంలో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్ ఏర్పాటు చేసి 35 అడుగుల మేర కబ్జా చేస్తున్నారని స్థానిక సర్వేయరును పలుమార్లు కలిసినా రేపుమాపంటూ కాలయాపన చేస్తున్నారు.
రెండు నెలలు దాటింది
బీర్కూర్ మండలం కిష్టాపూర్కు చెందిన జెట్టి ప్రభు రెండు నెలల కిందట భూమి సర్వే కోసం అధికారులను కలిసి చెప్పినంత రుసుము చెల్లించారు. సర్వేనంబరు 474లోని 2.10 ఎకరాల భూమిలో ఇతరులు బోరు వేసి ఐదు గుంటలు కబ్జా చేశారని, సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరారు. సర్వేయర్, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
వచ్చే నెల వరకు పరిష్కరిస్తాం
- శ్రీనివాస్, జిల్లా అధికారి, భూ కొలతల విభాగం, కామారెడ్డి
జిల్లాలో సర్వేయర్ల కొరత కారణంగా సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తికావడం లేదు. దీనిపై ఉన్నతాధికారులకు విన్నవించాం. మండలాల్లో శక్తికి మించి కష్టపడుతూనే ఉన్నారు. వచ్చే నెల వరకు పెండింగ్ అర్జీలన్నింటిని పరిష్కరించేలా కార్యాచరణ సిద్ధం చేశాం.
జిల్లాలో ఎఫ్-లైన్ దరఖాస్తుల వివరాలు
సర్వే నిమిత్తం వచ్చినవి 879
పరిష్కరించిని 212
పెండింగ్లో ఉన్నవి 667
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆశీర్వదిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా’
[ 11-05-2024]
ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భారాస జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి ఝరాసంగంలో పాత బస్టాండు కూడలి వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
ఏడాదిన్నర తర్వాత హత్య కేసు ఛేదన
[ 11-05-2024]
ఏడాదిన్నర కిందట మూసేసిన కేసును సాంకేతికతను వినియోగించి పోలీసులు ఛేదించారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో డీఎస్పీ నాగేశ్వర్రావుతో కలిసి శిక్షణ ఐపీఎస్ కాజోల్ సింగ్ వివరాలు వెల్లడించారు. -
బిడ్డా.. ఓటు మరవొద్దు!
[ 11-05-2024]
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. రాజ్యాంగం మనకు వజ్రాయుధం వంటి ఓటుహక్కును కల్పించింది. దానిని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. ప్రతి ఓటు గెలుపోటములను నిర్దేశిస్తుంది. -
తప్పులకు తావు లేదిక
[ 11-05-2024]
ఉపాధ్యాయుల హాజరుకు మొన్నటి వరకు బయోమెట్రిక్ విధానం అమలులో ఉండేది. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు విధానం అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సందేశం.. ఆచరణీయం
[ 11-05-2024]
ఎన్నికల్లో ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయనే అపవాదు ఉంది. దానిని తొలగించడానికి వివిధ రూపాల్లో ఎవరో ఒకరు స్పందిస్తుంటారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో అలాంటి అవగాహన పెంచే సందేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
హోటల్ వ్యాపారం మాటున డ్రగ్స్ దందా
[ 11-05-2024]
ప్రేమలో విఫలమైన ఒక చెఫ్ డ్రగ్స్కు అలవాటుపడి.. దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కారు. కేసు వివరాలను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!