అనుమతి ఒక చోట.. తరగతులు ఇంకోచోట..!
ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒకచోట అనుమతి పొంది...వేరేచోట తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియేట్ బోర్డు నిబంధనలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు రేగుతున్నాయి.
ఇంటర్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల పరిస్థితి
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒకచోట అనుమతి పొంది...వేరేచోట తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియేట్ బోర్డు నిబంధనలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు రేగుతున్నాయి. కళాశాలల వైఖరి వల్ల మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి కళాశాలలు 11 వరకూ ఉన్నాయని గుర్తించిన బోర్డు అధికారులు నోటీసులు జారీచేసినట్లు ధ్రువీకరించారు.
మండలం దాటి..: విజయనగరం, గరివిడి, చీపురుపల్లి, ఎస్.కోట, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఇలా నిబంధనలు పాటించకపోవడంతో నోటీసులు అందుకున్న కళాశాలలు చాలానే ఉన్నాయి. ఎక్కువగా జిల్లా కేంద్రమైన విజయనగరంలోనే ఉండడం గమనార్హం. గరివిడిలో అనుమతి పొందిన ఓ కళాశాల చీపురుపల్లి శివరాం కూడలిలో నిర్వహిస్తున్నట్లు నోటీసు జారీతో వెలుగులోకి వచ్చింది. విజయనగరం లంకవీధిలో నిర్వహించిన ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల రెండుసార్లు పేర్లు మార్చుకొంది. ప్రస్తుతం అకాడమీగా నాయుడుతోటలో కొనసాగుతోంది. కె.ఎల్.పురంలో అనుమతి పొందిన మరొకటి ధనలక్ష్మి కాలనీ, నాయుడు కాలనీలో అనుమతిపొందినది తోటపాలెంలో తరగతుల్ని నిర్వహిస్తోంది. ఇటువంటి వాటికి నోటీసులు జారీచేశామని ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి సత్యనారాయణ ‘న్యూస్టుడే’కు తెలిపారు. తరలింపు అనుమతుల కోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.
నిబంధనలు ఇలా...:
* ప్రభుత్వం కళాశాల మంజూరు చేసిన ఉత్తర్వు ఇవ్వాలి.
* అనుబంధ గుర్తింపు పొందిన పత్రం అందజేయాలి.
* కార్పస్ఫండ్ కాపీని ఇవ్వాలి.
* కళాశాలను తరలించేందుకు కారణాలు సూచిస్తూ కళాశాల గవర్నింగ్ బాడీ తీర్మానం ఉండాలి.
* తరలించేందుకు ఒక కళాశాలకు తనిఖీ నిమిత్తం రుసుం రూ.27 వేలు చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,500 ప్రభుత్వానికి చెల్లించాలి.
* భూమి, భవనాలకు సంబంధించిన రిజిస్టర్డ్ ప్రణాళిక ఉండాలి.
* మెడికల్ అధికారి జారీచేసిన శానిటరీ ధ్రువపత్రం, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి.
* విజయనగరంలోని శ్రీరాంనగర్ కాలనీలో అనుమతి పొందిన ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల నగరానికి నడిబొడ్డున పదేళ్లకు పైగా నడుస్తోంది. రోడ్లు విస్తరణ నేపథ్యంలో కళాశాలను ఆరేళ్ల కిందట సమీపంలోని వేరే చోటికి తరలించారు. బోర్డు నిబంధనల ప్రకారం తగిన రుసుం చెల్లించి, ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఇవేవీ చేయకపోవడంతో తాజాగా ఈ ఏడాదీ ఆ కళాశాలకు ఇంటర్మీడియేట్ బోర్డు నోటీసు జారీ చేసింది.
* విజయనగరం పీఎస్ఆర్ కాంప్లెక్స్లో అనుమతిపొందిన రెండు ప్రైవేటు జూనియర్ కళాశాలలు ప్రస్తుతం తోటపాలెం, రింగురోడ్డులో తరగతులు నిర్వహిస్తున్నాయి. అయిదేళ్లకుపైగా కొనసాగుతున్నాయి. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించకపోవడంతో వాటికి నోటీసులు జారీ అయ్యాయి.
* పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం బైపాస్కాలనీలో ఉండాల్సిన ఒక కళాశాల ఉన్న చోట కాకుండా వేరే చోట తరగతుల్ని నిర్వహిస్తోంది. ఎస్.కోట విశాఖరోడ్లో నిర్వహించాల్సిన ఓ కళాశాల గాయత్రినగర్లో తరగతులు కొనసాగిస్తుండటం గమనార్హం.
* చీపురుపల్లిలో ఓ కళాశాల కాంప్లెక్స్ పరిసరాల్లో అనుమతి పొంది, శివరాంరోడ్డులో కొనసాగుతోంది. అదే ప్రాంతంలో అనుమతి పొందిన ఇంకో కళాశాల వేరోచోట తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాతకు రక్తకన్నీరు!!
[ 11-05-2024]
కాలువలకు సంబంధించి జరిగిన పనులకు గుత్తేదారుకు బిల్లులు బకాయిలు ఉన్నాయి. రూ.17 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. ఈ కారణంగా రబీలో తిరిగి పనులు ప్రారంభించలేదు. వచ్చే నెలతో పనులకు గడువు ముగియనుంది. -
యువ జపం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు చివరి దశకు చేరింది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైకాపా, కూటమి పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా దూసుకెళ్తున్నారు. -
నోట్లకట్టలు తెగుతున్నాయ్
[ 11-05-2024]
పోలింగ్కు నాలుగు రోజుల ముందు నుంచి వైకాపా ఓటర్లను ప్రలోభ పెడుతోంది. గురువారం రాత్రి నుంచే పంపకాలు మొదలెట్టింది. ముందస్తుగా నిల్వ చేసిన మద్యం సీసాలున్న పెట్టెలు విప్పుతున్నారు. -
ప్చ్.. గప్చుప్
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. గత నెల 29న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో 129 మంది పోటీలో ఉన్నారు. -
ప్రజా వైద్యానికి జగన్ వైరస్
[ 11-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రజావైద్యానికి వైరస్ సోకింది.. సామాన్యుడికి సుస్తీ చేస్తే ప్రభుత్వ దవాఖానాల్లో సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ‘వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం.. -
జగనన్న అప్పులు.. జీతాలకు తిప్పలు
[ 11-05-2024]
ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకులకు జీతాల చెల్లింపు బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొంది. స్థానికంగా అందుబాటులో ఉన్న నిధుల నుంచే చెల్లించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ విభాగం స్పష్టం చేసింది. -
సంచిలో నగదు.. యువకుడి నిజాయతీ
[ 11-05-2024]
రహదారి పక్కన సంచిలో కనిపించిన నగదును పోలీసులకు అప్పగించి తద్వారా సంబంధిత వ్యక్తికి అప్పగించి సూరజ్ అనే యువకుడు నిజాయతీని చాటుకున్నాడు. -
ఐసీయూలో సర్కార్ వైద్యం
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్ అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని మాటిచ్చిన ఆయన ఆసుపత్రులు, రోగుల సమస్యలను పట్టించుకోలేదు. -
బోద కనపడదా.. బాధ వినపడదా?
[ 11-05-2024]
జిల్లాలో ఫైలేరియా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో బలిజిపేట మండలం పెదపెంకి ఒకటి. వ్యాధి బారిన పడి ఎందరో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!