logo

నేడు పాలకొండలో వారాహి యాత్ర

పాలకొండ పట్టణంలో గురువారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విజయ వారాహి యాత్ర జరగనుంది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరఘట్టం ప్రధాన రహదారిలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.

Published : 02 May 2024 04:15 IST

పవన్‌ సభకు ఏర్పాట్లు

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ పట్టణంలో గురువారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విజయ వారాహి యాత్ర జరగనుంది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరఘట్టం ప్రధాన రహదారిలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.  ఏఎస్పీ దిలీప్‌కుమార్‌, డీఎస్పీ జీవీ.కృష్ణారావు, ట్రైనీ డీఎస్పీ అజీజ్‌ బుధవారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రోడ్‌షో, ప్రచార సభలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఏఎస్పీ ఆదేశించారు.

విజయవంతానికి పిలుపు

వారాహి యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకురాలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి పిలుపునిచ్చారు.  ప్రచార ర్యాలీ, సభ ఏర్పాట్లను బుధవారం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌, ఉపాధ్యక్షుడు గర్భాన సత్తిబాబు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెలీప్యాడ్‌ నుంచి వడమ కూడలి వరకు రోడ్‌షో ఉంటుందని తెలిపారు. అనంతరం వడమ కూడలి వద్ద వారాహి వాహనంపై నుంచి పవన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని