logo

రోడ్డు ప్రమాదంలో లారీ చోదకుడు మృతి

ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. గొబ్బూరు సమీపంలో శుక్రవారం ఇది చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు...మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వైపాలెం నుంచి మార్కాపురానికి బయలుదేరింది..

Published : 28 May 2022 06:29 IST

లారీని పరిశీలిస్తున్న ఎస్సై పులి రాజేష్‌

పెద్దారవీడు, న్యూస్‌టుడే: ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. గొబ్బూరు సమీపంలో శుక్రవారం ఇది చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు...మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వైపాలెం నుంచి మార్కాపురానికి బయలుదేరింది.. గొబ్బూరు సమీపంలో ప్రయాణికుడిని ఎక్కించుకునే క్రమంలో బస్సు ఆగింది. ఇదే సమయంలో విద్యుత్తు ప్రభల సామాన్లతో వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీ కొంది. దీంతో లారీ చోదకుడు శివాజీ కృష్ణమూర్తి(35)కి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మృతి చెందారు.. ఆర్టీసీ బస్సులోని ఒక వ్యక్తికి గాయాలు కాగా, లారీలో ఉన్న ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి రాజేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని