నాడు ప్రగతి... నేడు ఆధోగతి
ఎన్నికలకు ముందు ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచిపోయారు.
జగన్ జమానాలో ఔత్సాహికులకు అవకాశాలు దూరం
చంద్రబాబు అమలు చేసిన పథకాలకూ మంగళం
ఎన్నికలకు ముందు ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచిపోయారు. పోనీ... స్వయం ఉపాధి దిశగానైనా యువత, ఔత్సాహికులను ప్రోత్సహించారంటే అదీ లేదు. పైపెచ్చు తెదేపా హయాంలో ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలు చేసిన పథకాలకు మంగళం పాడారు. గత అయిదేళ్ల కాలంలో ఒక్కరంటే ఒక్కరికీ రుణం మంజూరు కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
న్యూస్టుడే - ఒంగోలు నగరం
పట్టుదలకు రాయితీ రుణం తోడై...
ఏదైనా వ్యాపారం ప్రారంభించి స్వశక్తితో బతకాలన్న పట్టదల ఉన్నా పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు... కబాడీపాలేనికి చెందిన నూతలపాటి మోహన్దాస్. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకం వల్ల... 2018లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రాయితీ రుణం లభించింది. ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని లైటింగ్ దుకాణం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్థిరమైన ఆదాయంతో... ఆత్మవిశ్వాసంతో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి స్వయం ఉపాధి పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తే పేద యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఉన్న వ్యాపారాన్ని విస్తరించి...
కొప్పోలుకు చెందిన ఎస్కే కాలే మస్తాన్ వలి... ఇస్లాంపేటలో చిన్న జిరాక్స్ షాపు నిర్వహించేవారు. వచ్చే ఆదాయం చాలక వ్యాపారాన్ని విస్తరించాలని భావించినా... పెట్టుబడి లేక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో 2018లో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా... రూ.75 వేల రాయితీతో రూ.లక్షన్నర రుణం లభించింది. ఈ మొత్తంతో ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్గా దుకాణాన్ని పూర్తిస్థాయిలో విస్తరించారు. ప్రస్తుతం ఇదే మా కుటుంబానికి ఆదరవుగా ఉందని తెలిపారు. ఇప్పుడు ఆ తరహా పథకాలేవీ లేకపోవడంతో ఔత్సాహికులకు స్వయం ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు.
ఆత్మాభిమానంతో బతుకుతున్నాం...
తగిన ఆదాయ వనరులు లేక మరాఠీపాలేనికి చెందిన కాకా దుర్గాభవాని కుటుంబ పోషణకు ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 2017లో రూ.లక్ష రాయితీ రుణం లభించింది. ఆ మొత్తంతో కిరాణా దుకాణం ఏర్పాటు చేశారు. నాణ్యత పాటిస్తూ ముందుకు సాగడంతో వినియోగదారుల నుంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆత్మాభిమానంతో బతుకుతున్నామని తెలిపారు. రాయితీ పోనూ మిగతా మొత్తానికి సంబంధించిన కిస్తీలను సైతం సక్రమంగా తిరిగి చెల్లించినట్లు చెప్పారు. ఎటువంటి హామీ, తనఖాలు లేకుండా రుణాలు ఇవ్వడం వల్ల నాలాంటి ఎందరో పేదలకు మేలు కలిగిందని వివరించారు.
తెదేపా పాలనలో అండ...
తెదేపా ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2018 వరకు నిరాటంకంగా లక్ష్యాల మేరకు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు. ఆయా కార్పొరేషన్లు... నగరపాలక సంస్థ, ఎంపీడీవోల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేవి. వారు నెలకొల్పే యూనిట్లను బట్టి రూ.50 వేలు నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు... ఆయా బ్యాంకుల ద్వారా రాయితీ రుణాలు అందజేశారు. ప్రతి యూనిట్కు రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం రాయితీ కల్పించింది. రుణాలు పొందిన వారు యూనిట్లు నెలకొల్పి... స్వశక్తిపై నిలవడంతో పాటు కుటుంబాలకూ ఆదరవుగా నిలిచారు. ఆ యూనిట్లు నేటికీ విజయవంతంగా నడుస్తున్నాయి.
వైకాపా ఏలుబడిలో తొండి...
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక... అప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్న 13 రకాల పథకాలను రద్దు చేశారు. దీంతో గత అయిదేళ్ల కాలంలో ఔత్సాహికులకు స్వయం ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. సొంతంగా బ్యాంకు రుణాలు పొందాలంటే ఆస్తులు తనఖా పెట్టాలి. లేదంటే బ్యాంకులో డిపాజిట్లు ఉన్న వ్యక్తులెవరైనా హామీ సంతకం పెట్టాలి. ఈ షరతులతో ఎవరూ రుణాలు పొందలేకపోయారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక నగరపాలక సంస్థ కార్యాలయం ఆన్లైన్ లాగిన్లో ఉన్న సమాచారాన్ని సైతం తొలగించారు. ఆ వివరాలు సైతం ఇప్పుడు అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు.
తెదేపా హయాంలో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీలకు... స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు, వారు చేసే వృత్తుల అభివృద్ధికి రాయితీ రుణాలు అందజేశారు. అలా ఒక్క ఒంగోలు నియోజకవర్గం పరిధిలోనే ఆయా కార్పొరేషన్ల ద్వారా 3,193 మందికి రాయితీ రుణాలు మంజూరు చేశారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ఒక్కరికీ రుణం ఇచ్చిన దాఖలాలు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలు రూ.2,000 కోట్లు.. ‘బలి’పీఠంపై ఒంగోలు
[ 12-05-2024]
అక్రమాలంటేనే తెలియని సుద్దపూసనంటూ గప్పాలు కొట్టుకుంటుంటారు. మరోవైపు.. అదే నోటితో ‘పదవిలో ఉన్నప్పుడు ఖర్చులకు కొంత పుచ్చుకున్నాను’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. -
అంతా సానుకూలం.. పోలింగ్కు సన్నద్ధమవుదాం
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఒంగోలు వచ్చారు. -
రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా మార్చిన జగన్
[ 12-05-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా మార్చారని సీనినటుడు శివాజీ ధ్వజమెత్తారు. మండలంలో పెదఉల్లగల్లు, లక్ష్మీనగర్ గ్రామాల్లో దర్శి ఎన్టీఏ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీకి మద్దతుగా ఆమెతో కలిసి శివాజీ ప్రచారం నిర్వహించారు. -
నేడు పోలింగ్ సామగ్రి తరలింపు
[ 12-05-2024]
మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో ఈవీఎంలు, ఈవీప్యాడ్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
[ 12-05-2024]
ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఈ నెల 13న నిర్వహించనున్న ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. -
భరించలేం.. పాపాల భైరవుడ్ని పంపేద్దాం
[ 12-05-2024]
నిలువెత్తు వంచనా రూపం.. ఇక పాలనంతా పచ్చి మోసం..ఒక్క పొరపాటుకు అయిదేళ్ల నరకం ! ఇదీ జగన్ అరాచక పాలనపై వెల్లువెత్తుతున్న జనాగ్రహం. యువతకు కొలువుల్లేవ్..శ్రామికులకు పనుల్లేవ్.. ఉద్యోగులకు ఒకటినే జీతాల్లేవ్ ! మరో పక్క అన్నం పెట్టే రైతన్న పొలం బీడయ్యింది.. ఇల్లాలికి కుటుంబం భారమైంది. -
వైభవంగా రంగనాయకస్వామి కల్యాణం
[ 12-05-2024]
రాచర్ల మండలం జెల్లివారిపుల్లలచెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి కల్యాణోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. -
అన్నింటా విధ్వంసం.. ఎక్కడా లేదు సంతోషం
[ 12-05-2024]
వైకాపా పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషకరంగా లేదు. 2019 నుంచి 2024 వరకు డీఎస్సీ విడుదల చేయకపోవడంతో పాటు ఉద్యోగాలు భర్తీ చేయక, ఉపాధి చూపకపోవడంతో యువతలో అనేక మంది నిరుద్యోగులుగా మారారు. -
జగన్ చట్టం.. జనులకు నష్టం
[ 12-05-2024]
వైకాపా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది. ఎన్నో ఏళ్లుగా తాము అనుభవిస్తున్న భూములకు గత ఎన్నికల కోడ్కు ముందు రీసర్వే పేరుతో రైతులకు నోటీసులు జారీచేసింది. -
ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం
[ 12-05-2024]
ఓటమి భయంతో వైకాపా నాయకులు ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అరకులో కూటమికే మొగ్గు!
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
-
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
-
అతివలు మెచ్చేలా.. అందరూ వచ్చేలా: మహిళా మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు
-
జగన్ సభలకేనా బస్సులు.. ఓటేసే వారికి ఉండవా!
-
ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎందుకు మార్చాల్సి వచ్చింది?