కన్నీటి శోకం..
గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి.
దారికాచిన మృత్యువు
ఓందత్తకుమార్ (పాత చిత్రం)
గార, న్యూస్టుడే: గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి. స్థానికులు 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించినట్లు గార ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు. ఓందత్తకుమార్ విశాఖలో చదువుతుండగా వేసవి సెలవులు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. ఇంతలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
హిరమండలం, న్యూస్టుడే: కిట్టాలపాడు గ్రామానికి చెందిన యువకుడు పాగోటి సంతోష్కుమార్ (26) ద్విచక్ర వాహన ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై జి.నారాయణస్వామి శనివారం తెలిపారు. ఆయన ద్విచక్ర వాహనంపై హిరమండలం నుంచి కిట్టాలపాడు వస్తుండగా భగీరథ]పురం సమీపంలోని నవతల శ్రీముఖలింగం రహదారిలో మలుపు వద్ద వాహనం అదుపు తప్పి పడిపోయినట్లు చెప్పారు. గాయపడిన వ్యక్తిని హిరమండలం పీహెచ్సీ నుంచి విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, భార్య పాగోటి గౌరీ ఉన్నారు. తన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అదృశ్యమై.. శవంగా తేలి..!
వృద్ధురాలి అనుమానాస్పద మృతి
వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్టుడే: వజ్రపుకొత్తూరు మండలం అమలపాడులో ఈ నెల 24న అదృశ్యమైన వృద్ధురాలు దున్న దమయంతి మృతదేహాన్ని శనివారం ఉదయం స్థానికులు డ్రైనేజీలో గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. ఇంటి వద్ద ఉన్న దమయంతికి ఈ నెల 24న ఉదయం అల్పాహారం అందించి జీడి తోటలో పనికి వెళ్లినట్లు కుమారుడు కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తున్న క్రమంలో.. శనివారం ఉదయం బస్షెల్టర్ వద్ద ఉన్న డ్రైనేజీలో దుర్వాసన రావడంతో చూసిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి సమాచారం అందించారు.
10 తులాల బంగారం కోసమేనా..?
డ్రైనేజీపై సిమెంట్ పలకలు ఉండడంతో అందులో పడి చనిపోయే అవకాశం లేదని, ఎవరో హతమార్చి కాలువలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె 10 తులాల బంగారం ధరించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం వెలికి తీయించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బంగారం కోసమే హతమార్చారా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పి ఎస్ఐ ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు..!
[ 12-05-2024]
ఓటు వజ్రాయుధం లాంటిది. ప్రజాస్వామ్య పరిరక్షణలో దానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో చాలామంది ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలింగ్ తక్కువగా నమోదవుతోంది. -
తెదేపాలోకి కొనసాగిన చేరికలు
[ 12-05-2024]
కొత్తపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహిస్తున్న టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు సమక్షంలో సంతబొమ్మాళి మండలం తోటాడ పంచాయతీకి చెందిన వారు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. -
వెబ్ కాస్టింగ్ పరిశీలన పక్కాగా జరగాలి
[ 12-05-2024]
వెబ్ కాస్టింగ్ పరిశీలన పక్కాగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పేర్కొన్నారు. జీపీఎస్, వెబ్ కాస్టింగ్ పరిశీలకులతో కంట్రోల్ రూమ్లో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. -
వంశధార నదిలో మునిగి బాలిక మృతి
[ 12-05-2024]
వంశధార నదిలో మునిగి బాలిక మృతి చెందిన ఘటన శనివారం హిరమండలంలో చోటుచేసుకుంది. ఎస్సై జి.నారాయణస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొమనాపల్లి గ్రామానికి చెందిన తెంబూరు సంజనశ్రేయ (9) తన తల్లిదండ్రులతో కలిసి రుగడ గ్రామం సమీపంలోని వంశధార నదికి స్నానానికి వెళ్లింది. -
క్షేత్రసహాయకుడికి షోకాజ్ నోటీస్ జారీ
[ 12-05-2024]
సంతబొమ్మాళి మండలం నౌపడ ఉపాధి హామీ క్షేత్రసహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న బొమ్మాళి రామారావుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ఎంపీడీవో ఉమా సుందరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జలవనరులపై జగనాసురుడి విధ్వంసం..!
[ 12-05-2024]
అన్న వేసిన బాటలో ఇసుకాసురులు చెలరేగిపోయారు. వైకాపా పాలనలో జగన్ అనుచరులు జలవనరులను ధ్వంసం చేశారు. జిల్లాను సస్యశ్యామలం చేసే వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులు ఘోషించేలా అనుమతులతో పని లేకుండా పరిమితికి మించి ఇసుకను తోడేశారు. -
ఒడిశా మద్యం పట్టివేత
[ 12-05-2024]
ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం దొరుకుతోంది. శుక్రవారం అర్ధరాత్రి మెళియాపుట్టి మండలం పట్టుపురం సమీపంలో ఒడిశాకి చెందిన మద్యం సీసాలు ఆటోలో ఉన్నట్లు టెక్కలి ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. -
ఇదేనా ‘ధర్మ’ పాలన..?
[ 12-05-2024]
జిల్లా రాజకీయాల్లో తల పండిన నేత ధర్మాన ప్రసాదరావు. వైకాపా ప్రభుత్వంలో రెవెన్యూ శాఖకు మంత్రిగా వ్యవహరించారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. -
ప్రచారానికి తెర
[ 12-05-2024]
నియోజకవర్గంలో ప్రచారానికి తెరపడింది. తెదేపా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు శనివారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సూపర్-6 పథకాల ప్రయోజనాలను వివరించారు. -
పోస్టర్ రూపకల్పనలో ప్రథమ స్థానం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటెయ్యాలి అంశంపై పోస్టర్ పోటీలు జరిగాయి. -
గేటు గండం
[ 12-05-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో కాశీబుగ్గ, తాళభద్ర రైల్వే లెవల్క్రాసింగ్ గేట్లు, ఇచ్ఛాపురం పరిధిలో పశ్చిమ మండలం, పురపరిధి రత్తకన్న ప్రాంతాలను కలిపే రైల్వే ఉత్తరకేబిన్ గేట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మద్యం పారుతోంది
[ 12-05-2024]
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాలు మూతపడటంతో ఒడిశా మద్యం అక్రమంగా రవాణా అవుతోంది. -
కాంగ్రెస్తోనే సుస్థిర పాలన
[ 12-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పి.పరమేశ్వరరావు అన్నారు. కాశీబుగ్గలో శనివారం విలేకరులతో మాట్లాడారు.