సామూహిక నిర్లక్ష్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు.
మరుగుదొడ్లను గాలికొదిలేసిన వైకాపా సర్కారు
కేశవరాయునిపాలెంలో ముళ్లపొదల మధ్య మరుగుదొడ్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. వాటిని ఎక్కడా వినియోగించిన దాఖలాలు లేవు. దీంతో ప్రభుత్వం వెచ్చించిన నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా మారింది.
న్యూస్టుడే, లావేరు, రణస్థలం గ్రామీణం
ఇదీ పరిస్థితి...
జిల్లాలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కొన్నిచోట్ల ఇప్పటికే శిథిలమయ్యాయి. మరికొన్ని చోట్ల ముళ్లపొదలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా గ్రామానికి సుదూర ప్రాంతంలో మరుగుదొడ్ల నిర్మించడంతో వెళ్లి రావడం పెద్ద సమస్యగా మారిందని ఆయా గ్రామాలు ప్రజలు చెబుతున్నారు. నీటి సౌకర్యం కల్పించక పోవడంతో ఎక్కడా వినియోగించిన దాఖలాలు లేవు. రూ.కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి వినియోగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహిరిస్తున్నారు. ప్రభుత్వంగానీ అధికారులుగానీ వినియోగంలోకి తీసుకొచ్చే చర్యలు ఎక్కడ చేపట్టకపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లు వినియోగించడం పక్కన పెడితే చూడటానికే భయంకరంగా ఉన్నాయి.
రూ.38.65 కోట్లతో పనులు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాల్లో గత ప్రభుత్వ హయాంలో 2.74 లక్షల మరుగుదొడ్లను రూ.38.65 కోట్లతో నిర్మించారు. అప్పట్లో లక్ష్యాలను పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు ఆదేశాలతో మండల స్థాయి అధికారులు గుత్తేదారులతో నిర్మాణాలు చేపట్టారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా మరుగుదొడ్లు నిర్మించారు. కొన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టి తలుపులు బిగించలేదు. మరికొన్నిచోట్ల అన్నీ పూర్తి చేసి నీటి సౌకర్యం కల్పించలేదు. ప్రధానంగా విద్యుత్తు, నీటి సౌకర్యం, స్థల ఎంపికను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి సంగతి పూర్తిగా గాలి కొదిలేసింది. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
వినియోగంలోకి తీసుకొస్తే ఉపయోగం...
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాటిని వినియోగంలోకి తీసుకొస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఆరుబయట మలవిసర్జనను చాలా వరకు నిర్మూలించవచ్చు. దీంతో రోగాల బారి నుంచి బయట పడవచ్చు. అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం దీని గురించి కనీసం పట్టించుకోలేదని పలువురు పెదవి విరుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలోకి కొనసాగిన చేరికలు
[ 12-05-2024]
కొత్తపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహిస్తున్న టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు సమక్షంలో సంతబొమ్మాళి మండలం తోటాడ పంచాయతీకి చెందిన వారు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. -
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు..!
[ 12-05-2024]
-
వెబ్ కాస్టింగ్ పరిశీలన పక్కాగా జరగాలి
[ 12-05-2024]
వెబ్ కాస్టింగ్ పరిశీలన పక్కాగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పేర్కొన్నారు. జీపీఎస్, వెబ్ కాస్టింగ్ పరిశీలకులతో కంట్రోల్ రూమ్లో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. -
వంశధార నదిలో మునిగి బాలిక మృతి
[ 12-05-2024]
వంశధార నదిలో మునిగి బాలిక మృతి చెందిన ఘటన శనివారం హిరమండలంలో చోటుచేసుకుంది. ఎస్సై జి.నారాయణస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొమనాపల్లి గ్రామానికి చెందిన తెంబూరు సంజనశ్రేయ (9) తన తల్లిదండ్రులతో కలిసి రుగడ గ్రామం సమీపంలోని వంశధార నదికి స్నానానికి వెళ్లింది. -
క్షేత్రసహాయకుడికి షోకాజ్ నోటీస్ జారీ
[ 12-05-2024]
సంతబొమ్మాళి మండలం నౌపడ ఉపాధి హామీ క్షేత్రసహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న బొమ్మాళి రామారావుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ఎంపీడీవో ఉమా సుందరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జలవనరులపై జగనాసురుడి విధ్వంసం..!
[ 12-05-2024]
అన్న వేసిన బాటలో ఇసుకాసురులు చెలరేగిపోయారు. వైకాపా పాలనలో జగన్ అనుచరులు జలవనరులను ధ్వంసం చేశారు. జిల్లాను సస్యశ్యామలం చేసే వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులు ఘోషించేలా అనుమతులతో పని లేకుండా పరిమితికి మించి ఇసుకను తోడేశారు. -
ఒడిశా మద్యం పట్టివేత
[ 12-05-2024]
ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం దొరుకుతోంది. శుక్రవారం అర్ధరాత్రి మెళియాపుట్టి మండలం పట్టుపురం సమీపంలో ఒడిశాకి చెందిన మద్యం సీసాలు ఆటోలో ఉన్నట్లు టెక్కలి ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. -
ఇదేనా ‘ధర్మ’ పాలన..?
[ 12-05-2024]
జిల్లా రాజకీయాల్లో తల పండిన నేత ధర్మాన ప్రసాదరావు. వైకాపా ప్రభుత్వంలో రెవెన్యూ శాఖకు మంత్రిగా వ్యవహరించారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. -
ప్రచారానికి తెర
[ 12-05-2024]
నియోజకవర్గంలో ప్రచారానికి తెరపడింది. తెదేపా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు శనివారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సూపర్-6 పథకాల ప్రయోజనాలను వివరించారు. -
పోస్టర్ రూపకల్పనలో ప్రథమ స్థానం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటెయ్యాలి అంశంపై పోస్టర్ పోటీలు జరిగాయి. -
గేటు గండం
[ 12-05-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో కాశీబుగ్గ, తాళభద్ర రైల్వే లెవల్క్రాసింగ్ గేట్లు, ఇచ్ఛాపురం పరిధిలో పశ్చిమ మండలం, పురపరిధి రత్తకన్న ప్రాంతాలను కలిపే రైల్వే ఉత్తరకేబిన్ గేట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మద్యం పారుతోంది
[ 12-05-2024]
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాలు మూతపడటంతో ఒడిశా మద్యం అక్రమంగా రవాణా అవుతోంది. -
కాంగ్రెస్తోనే సుస్థిర పాలన
[ 12-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పి.పరమేశ్వరరావు అన్నారు. కాశీబుగ్గలో శనివారం విలేకరులతో మాట్లాడారు.