మూలికా న్యాప్కిన్లకు ఆదరణ
హెర్బల్ న్యాప్కిన్లు తయారు చేస్తూ స్త్రీల ఆరోగ్యానికి కృషి చేస్తున్నారు రామనాథపురానికి చెందిన షర్మిలా బేగం. నెలకు రూ.50 వేల ఆదాయం గడిస్తూ విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.
స్త్రీలలో అనారోగ్య సమస్యలకు పరిష్కారం
విదేశాలకూ ఎగుమతి చేస్తున్న షర్మిలా బేగం
న్యాప్కిన్లు తయారు చేస్తున్న షర్మిలా బేగం తదితరులు
సైదాపేట, న్యూస్టుడే: హెర్బల్ న్యాప్కిన్లు తయారు చేస్తూ స్త్రీల ఆరోగ్యానికి కృషి చేస్తున్నారు రామనాథపురానికి చెందిన షర్మిలా బేగం. నెలకు రూ.50 వేల ఆదాయం గడిస్తూ విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన విజయం రహస్యం గురించి షర్మిలా బేగం మాటల్లో తెలుసుకుందాం.... మూడేళ్ల క్రితం అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరాను. అక్కడ పరీక్షించిన వైద్యులు నేను ఉపయోగించిన న్యాప్కిన్ల వల్లే అనారోగ్యానికి గురైనట్లు వివరించారు. సాధారణ న్యాప్కిన్లలో తడిని పీల్చుకునేవిధంగా రసాయనాలు కలుపుతారని, అవి గర్భాశయ క్యాన్సర్కు కారణమవుతాయని తెలిపారు. ఇంకా మంచి వాసన కోసం కలిపే రసాయనాలు స్త్రీ జననాంగం, గర్భాశయంలో పలు సమస్యలు తెస్తాయని, ఉపయోగించేందుకు సులభంగా ఉండటంతో మహిళలు ఎక్కువగా ఉపయోగించి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారని చెప్పారు. అందుకు నేను దీనికి పరిష్కారం అడగగా... కాటన్ న్యాప్కిన్లు ఉపయోగించాలని చెప్పారు. స్త్రీ జననాంగంలో న్యాప్కిన్లతో సమస్యలు ఎదుర్కొనేవారు మూలికల (హెర్బల్)తో తయారు చేసిన వాటిని ఉపయోగించవచ్చని సూచించారు.
తయారీ ఆలోచన
దీంతో నేనే స్వయంగా మూలికలు నూరి కాటన్ గుడ్డలో పెట్టి ఉపయోగించటంతో సమస్య తొలగడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుపడింది. నాకు తెలిసిన మహిళల వద్ద ఇలాగే ఉపయోగించాలని సలహా ఇచ్చాను. అయితే ఎవరూ వినలేదు. ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారనే బాధ కలిగింది. అయితే వారు హెర్బల్ న్యాప్కిన్లకు వ్యతిరేకంగా లేరని, వారికి సమయం లేక వాడట్లేదనిపించింది. అందరూ నేను తయారు చేసి ఇస్తే ఉపయోగిస్తామని చెప్పారు. అప్పుడే ఈ వ్యాపారం చేయాలనే ఆలోచన కలిగింది.
ప్రయోజనాలపై ప్రచారం
మొదట హెర్బల్ న్యాప్కిన్లు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. చేతితోనే తయారు చేసి వైద్య కౌన్సిల్కు పంపి అనుమతి పొందాను. మొదట్లో నాకు తెలిసిన మహిళలకు రసాయనాలతో తయారు చేసిన న్యాప్కిన్ల వలన కలిగే సమస్యలు, హెర్బల్ వాటితో కలిగే ప్రయోజనాలను వివరించి ఇంటింటికీ వెళ్లి విక్రయించాను. ఆ విధంగా నేను తయారు చేసిన వాటిని ఉపయోగించినవారు మంచి మార్పును గుర్తించారు. దీంతో వారు ఇతరులకు సిఫారసు చేయడం ప్రారంభించారు. దీంతో వ్యాపారం పెరగడం మొదలైంది. కొన్ని దుకాణాల వారు నా దగ్గరకు వచ్చి ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే అధిక సంఖ్యలో చేతితో తయారు చేయడం కష్టంగా ఉండేది. దీంతో తిరువారూరులో తయారీ యంత్రాలు నాలుగు తీసుకున్నాం. ప్రస్తుతం రోజుకి 1000 తయారు చేస్తున్నాం. దీంతో మా వీధిలో ఉండే మహిళలకు కూడా ఉపాధి లభించింది. లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, లైనర్, డెలివరీ అని నాలుగు రకాలు తయారు చేస్తున్నాము. వేపాకు, తులసి తదితర మూలికలతో తయారు చేస్తున్నాము. కొన్ని మూలికలు దొరకడం కష్టంగా ఉంది. దీంతో దిండుక్కల్ గాంధీగ్రామం విశ్వవిద్యాలయంలో మూలికలు విక్రయిస్తున్నట్లు తెలుసుకుని అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు విదేశాల్లో కూడా వినియోగదారులు ఉన్నారు.
విజయానికి కారణం అదే..
ఒకరిని చూసి మరొకరు వచ్చి చేరి ప్రస్తుతం కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మదురై, దిండిక్కల్, చెన్నై, తిరునెల్వేలి, తిరువారూరు, కోయంబత్తూరు, తిరుప్పూరు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు పంపిస్తున్నాం. అలాగే మలేషియా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. మార్కెట్టులో దొరికే నాసిరకం వాటికంటే ఇవి ధర కాస్త ఎక్కువ. ఆరోగ్యానికి మంచి చేసే వాటికి ధర ఎక్కువైనా పర్వాలేదని కొనుగోలుదారులు భావించడం మా విజయానికి కారణం. నెలకు రూ.50 వేల ఆదాయం గడిస్తున్నాం. లాభాపేక్ష కంటే కొనుగోలుదారుల ఆరోగ్యం ముఖ్యంగా నడుపుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్పాలతో పరవశం
[ 11-05-2024]
నీలగిరి జిల్లా ఊటీలో 126వ పుష£్ప ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. పుష్పాలతో అలంకరించిన ఏనుగు, ఊటీ మౌంటెయిన్ రైలు, డిస్నీ వరల్డ్, సింహంతో పాటు పలు జంతువుల కళారూపాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
10వ తరగతిలో 91.55 శాతం ఉత్తీర్ణత
[ 11-05-2024]
రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 8వరకు జరిగాయి. మొత్తం 8,94,264 మంది రాశారు. ఫలితాలను శుక్రవారం ఉదయం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సేతువర్మ విడుదల చేశారు. -
ఎన్నికల్లో మోదీపై పోటీకి బయల్దేరిన రైతులు
[ 11-05-2024]
రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ ఖరారైనా నిరీక్షణ జాబితాలో పెట్టారంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తమిళనాడుకు చెందిన దక్షిణ నదుల భద్రతా రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను వారణాసి నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. -
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
[ 11-05-2024]
రాష్ట్రంలో నాలుగు రోజుల వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో.. 24 గంటల్లో సాధారణం కన్నా 5 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. -
విద్యార్థులూ.. వినండి
[ 11-05-2024]
ప్లస్ టూ, 10వ తరగతిలో మార్కులు ఘనంగా వచ్చాయని సంబరపడిపోయేవారు ఒకవైపు.. సరిగా రాక కుమిలిపోయే విద్యార్థులు మరోవైపు. రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఆశించిన మార్కులు రాకపోవడమో, ఫెయిల్ అయిపోవడమోలాంటి కారణాలతో క్షణికావేశ నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
విమానాశ్రయంలో వాకలేటర్ సేవలు
[ 11-05-2024]
డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినళ్లను అనుసంధానం చేసేందుకు కొత్తగా వాకలేటర్తో పాటు మల్టీ లెవల్ కారు పార్కింగు సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నగర విమానాశ్రయ యంత్రాంగం సిద్ధమవుతోంది. -
కబడ్డీలో సత్తా చాటిన హెడ్ కానిస్టేబుల్
[ 11-05-2024]
తేనీ జిల్లా అమైచ్చూర్ కబడ్డీ, చిన్న మరుదు కబడ్డీ ఆర్గనైజేషన్ తరఫున సీనియర్ మాస్టర్ కబడ్డీ పోటీలు ఇటీవల చిన్నమనూర్లో నిర్వహించారు. -
34 ఏళ్ల తర్వాత చేతికొచ్చిన సొంతిల్లు
[ 11-05-2024]
చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో పని చేసి పదవీవిరమణ చేసిన డీన్ విక్టర్కు షెనాయ్నగర్ ప్రాంతంలో సొంతిల్లు ఉంది. 2 గ్రౌండ్ల స్థలంలోని ఇంటిని వేరొకరిని చూసుకోమని చెప్పి 34 ఏళ్ల కిందట ఆయన అమెరికా వెళ్లి పోయాడు. -
అలవోకగా శాస్త్రీయనామాలు చెప్తున్న బాలుడు
[ 11-05-2024]
కూరగాయలు, పండ్ల శాస్త్రీయ నామాలు సెకన్లలో చెప్తూ ఓ బాలుడు అబ్బురపరుస్తున్నాడు. దిండుక్కల్ జిల్లా పళని నెయిక్కారపట్టికి చెందిన మహ్మద్ హిసామ్ ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. -
కంచి పట్టుచీరకు కష్టకాలం!
[ 11-05-2024]
పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచిన కాంచీపురం నగరంలోని చేనేత పట్టు వస్త్రాల ఉత్పత్తి, విక్రయ సహకార సంఘాల్లో నిల్వ ఉన్న రూ.110 కోట్ల విలువైన 70 వేల పట్టు చీరలను 65 శాతం రిబెట్తో విక్రయించే పరిస్థితి నెలకొంది. -
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
[ 11-05-2024]
తన ప్రియుడు వేరొకరికి దక్కకూడదని ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. పెట్రోల్పోసి నిప్పంటించింది. ఆమె కూడా నిప్పంటించుకోవడంతో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
పదో తరగతి ఫెయిల్ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య
[ 11-05-2024]
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పళ్లిపట్టు తాలూకా మేల్పొదటూర్ ప్రాంతానికి చెందిన మురళి, నదియ భార్యభర్తలు. కుమారి(15) అనే కుమార్తె ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!