ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు.
ఎడప్పాడి
సైదాపేట, న్యూస్టుడే: రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. ప్రధాని మోదీ రాజస్థాన్లో చేసిన ప్రసంగంపై ఆయన విడుదల చేసిన ప్రకటనలో... ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ నేతలు, దేశ ఉన్నత పదవుల్లో ఉండే ప్రధాని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశ సార్వభౌమత్వానికి మంచిది కాదని పేర్కొన్నారు. ముస్లింలను కించపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. దేశ సంక్షేమానికి రాజకీయ నేతలు ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల వద్ద ఉండే బంగారం, ఆస్తులు లాక్కొని దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఇస్తుందని ప్రధాని తన ప్రసంగంలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
జిల్లా కార్యదర్శులతో సమాలోచనలు
సైదాపేట: లోక్సభ ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై జిల్లా కార్యదర్శులతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి సమాలోచనలు జరిపారు. చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శులు డి.జయకుమార్, విరుగై రవి, ఆదిరాజారామ్, బాలగంగా, టీనగర్ సత్య, వెంకటేష్బాబు, ఆర్ఎస్ రాజేష్, వేళచ్చేరి అశోక్, కేపీ కందన్, మాధవరం మూర్తి, లోక్సభ అభ్యర్థులు రాయపురం మనో, జయవర్థన్, డాక్టర్ ప్రేమ్కుమార్, పెరుంబాక్కం రాజశేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు పరిస్థితులు వివరించారు. ఈ సందర్భంగా శశికళ అన్నాడీఎంకే కార్యకర్తలకు రాసిన లేఖ గురించి కూడా చర్చించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్తడి నేలలపై అంతులేని నిర్లక్ష్యం
[ 03-05-2024]
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న నగరాలు, ప్రాంతాలు రాష్ట్రంలో ఎక్కువే. వాటినుంచి కాపాడే సత్తా ఉన్న చిత్తడినేలలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఫలితంగా కొన్ని అన్యాక్రాంతమవడంతో పాటు ఆక్రమణలకు గురవుతున్నాయి. -
ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ
[ 03-05-2024]
ఆలయ ఉత్సవాల్లో ఒక వర్గం వారు ప్రార్థన చేయడానికి నిరాకరించడంతో ఏర్పడిన ఘర్షణ భారీ విధ్వంసానికి దారి తీసింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని ఓమలూరు సమీపం తీవట్టిపట్టి వద్ద హిందూ దేవాదాయ శాఖ -
డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు
[ 03-05-2024]
మెట్రో రెండో దశ మార్గంలో రానున్న డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు సమకూరనున్నాయి. బోగీల్లో ఆనుకుని కూర్చునేందుకు వీలుగా సీట్లు, డ్రైవర్ల వీక్షణ (డ్రైవర్స్ వ్యూ), సెల్ఫోన్లకు ఛార్జింగు వంటి పలు సదుపాయాలతో బోగీ నిర్మాణం జరగనుంది. -
నేపథ్య గాయని ఉమా రమణన్ కన్నుమూత
[ 03-05-2024]
నేపథ్య గాయని ఉమా రమణన్(71) ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నై అడయారులోని నివాసంలో బుధవారం రాత్రి 7.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆమె భర్త రమణన్ వెల్లడించారు. -
కర్ణాటక కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం
[ 03-05-2024]
కావేరి జలాల వ్యవహారంలో కర్ణాటక కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తెలిపారు. తేనాంపేటలోని కామరాజర్ ఆడిటోరియంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. -
దుర్గాస్టాలిన్ బోటు షికారు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంతో పాటు కొడైకెనాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. బుధవారం సాయంత్రం కొడైకెనాల్ చెరువులో స్టాలిన్ సతీమణి దుర్గాస్టాలిన్ పడవ సవారీ చేశారు. -
సర్పాలతో జాగ్రత్త!
[ 03-05-2024]
వేసవి ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సర్పాలు ఖాళీ స్థలాలు, గృహాలలోకి చొరబడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ సూచిస్తోంది. -
దాహార్తి తీరుస్తున్న నెమ్మెలి నిర్లవణీకరణ పథకం
[ 03-05-2024]
రాష్ట్ర రాజధాని తాగునీటి అవసరాలు తీర్చేందుకు పూండి, పుళల్, చెంబరంబాక్కం, చోళవరం, వీరాణం చెరువు నుంచి దక్షిణ చెన్నై ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. -
స్వీయ కాన్పుతో బిడ్డను చంపుకొన్న నర్సుపై హత్యయత్నం కేసు
[ 03-05-2024]
సన్నిహితుడి ద్వారా గర్భవతి అయిన ఓ నర్సు స్వీయ కాన్పునకు యత్నించి బిడ్డను చంపిన ఘటనలో నగర పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
అజిత్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం : జయకుమార్
[ 03-05-2024]
నటుడు అజిత్కుమార్ రాజకీయాల్లో వస్తే స్వాగతిస్తామని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి