తాగునీటి సమస్య తలెత్తదు
చెన్నై మహానగరంలో సెప్టెంబర్ వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెన్నై తాగునీటి బోర్డు తెలిపింది.
చెన్నైలో సెప్టెంబర్ వరకు ఇబ్బంది లేదంటున్న అధికారులు
ఆర్కేనగర్, న్యూస్టుడే: చెన్నై మహానగరంలో సెప్టెంబర్ వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెన్నై తాగునీటి బోర్డు తెలిపింది. సాధారణంగా మార్చి 1 నుంచి ఏప్రిల్ 27 వరకు రాష్ట్రంలో సరాసరిగా 54 మి.మీ వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ ఏడాది 9.4 మి.మీ నమోదైంది. ఇది సాధారణం కంటే 83 శాతం తక్కువ. ఈ కాలంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, వేలూర్, తిరువణ్ణామలై, తిరుప్పత్తూర్, కడలూర్, ధర్మపురి, కృష్ణగిరి తదితర 16 జిల్లాల్లో అసలు వర్షాలే పడలేదు. అదే సమయంలో రోజురోజుకూ వేడితాపం అధికమవుతూ ఉంది. ఇందుకు సంబంధించి భారత వాతావరణ పరిశోధన కేంద్ర దక్షిణ మండల అధ్యక్షుడు బాలచంద్రన్ మాట్లాడుతూ... ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వేడితాపం అధికమవుతుందన్నారు.
చెరువుల్లో తగ్గుతున్న నీటిమట్టం
చెన్నై తాగునీటి అవసరాలు తీర్చే చెరువుల్లో నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం పూండి చెరువులో 1,020 మిలియన్ క్యూబిక్ అడుగులు, చోళవరంలో 130 మిలియన్ క్యూబిక్లు, పుళల్లో 2,930 మిలియన్ క్యూబిక్లు, కన్నన్కోట్టై-తేర్వాయికండిగైలో 386 మిలియన్ క్యూబిక్లు, చెంబరంబాక్కం చెరువులో 2,389 మిలియన్ క్యూబిక్ అడుగులు మొత్తం 6,855 మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు నిల్వ ఉంది. వీరాణం చెరువు పూర్తిగా ఎండిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి 8,263 మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు ఉంది. ఈ ఏడాది నీటి నిల్వలు శనివారం నాటికి 1,408 మిలియన్ క్యూబిక్ అడుగులకన్నా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడుతుందేమోనని భయపడుతున్నారు.
ఆదుకోనున్న నిర్లవణీకరణ ప్లాంట్లు
దీని గురించి చెన్నై తాగునీటి బోర్డు అధికారులు మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో సెప్టెంబర్ వరకు చెన్నైకు తాగునీరు అందించవచ్చన్నారు. అదేవిధంగా నిర్లవణీకరణ పథకం కింద ఇప్పటికే మీంజూర్, నెమ్మెలిలో నిత్యం 210 మిలియన్ లీటర్ల తాగునీరు అందుతోందని, ఈ ఏడాది నెమ్మెలిలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన నిర్లవణీకరణ ప్లాంటు ద్వారా నిత్యం 150 మి.లీటర్ల తాగునీరు అందుతుందని తెలిపారు. కావున ఈ ఏడాది వేసవిలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూర్వ విద్యార్థులే ఐఐటీ బలం!
[ 14-05-2024]
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థుల శ్రేయస్సు, దేశం కోసం ఎన్నో ప్రాజెక్టులు తెస్తోంది. భారీగా నిధులు ఖర్చుపెడుతోంది. ఈ విద్యాసంస్థ ఈ తరహాలో దూసుకుపోయేందుకు ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులే కారణమని అంటున్నారు -
పాఠకుల సంఖ్య పెంచుతా: రచయిత శివశంకర్
[ 14-05-2024]
నేటితరం యువత సెల్ఫోన్లకే పరిమితమవుతున్న తరుణంలో వారి దృష్టిని పుస్తకాల వైపు మళ్లించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ‘బుక్స్ అండ్ రీడర్స్-ఫిలిమ్స్ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ అద్యక్షుడు శివశంకర్ పేర్కొన్నారు. -
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ కన్నుమూత
[ 14-05-2024]
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ (67) సోమవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తిరువారూర్ జిల్లా నీడామంగళం కప్పలుడైయాన్ గ్రామానికి చెందిన సెల్వరాజ్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
జైలులో ప్రాణానికి ముప్పు: సవుక్కు శంకర్
[ 14-05-2024]
జైల్లో తన ప్రాణానికి ముప్పు ఉందని సవుక్కు శంకర్ ఆందోళన వ్యక్తం చేశాడు. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ సవుక్కు శంకర్ను పోలీసులు -
కన్నియాకుమరిలో జోరుగా వర్షాలు
[ 14-05-2024]
కన్నియాకుమరి జిల్లాలో గత కొన్నిరోజులుగా సాధారణం కంటే అధికంగా ఎండలు మండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఇంజినీరింగ్లో ఏఆర్ అండ్ వీఆర్ కోర్సు
[ 14-05-2024]
అన్నా విశ్వవిద్యాలయం (ఏయూ) ప్రాంగణంలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (సీఈజీ) 2024-25 విద్యా సంవత్సరం నుంచి ‘ఆగ్మెంటెడ్ రియాల్టి అండ్ వర్చువల్ రియాల్టి’ (ఏఆర్ అండ్ వీఆర్) మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించేందుకు ఆలోచిస్తోంది. -
మనస్తాపంతో వివాహిత బలవన్మరణం
[ 14-05-2024]
విళుపురం జిల్లా మరక్కాణం సమీపం కానిమేడు గ్రామానికి చెందిన చక్రవర్తి, వనిత దంపతులకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. -
పట్టాలపై పడుకున్న ముగ్గురు యువకులు
[ 14-05-2024]
పట్టాలపై నిద్రించిన ముగ్గురు యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. నాగపట్టిణం జిల్లా వేదారణ్యంకు చెందిన కుమారసారథి(18), తులసి నారాయణన్(18), ప్రభాకరన్(18) అనే ముగ్గురు యువకులు -
నడిగర్ సంఘానికి ధనుష్ విరాళం
[ 14-05-2024]
ఆర్థిక సంక్షోభం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన నడిగర్ సంఘం భవన నిర్మాణ పనుల కోసం పలువురు నటులు స్వచ్ఛందంగా తమవంతు విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ vs లఖ్నవూ.. నేటి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్పై ప్రభావమెంత..?
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!