భార్య, బిడ్డ మృతికేసులో భర్త అరెస్టు
పురుగుల మందు తాగి భార్య, బిడ్డ మృతిచెందిన సంఘటనలో...భర్త సంపంగి మోహనకృష్ణను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత శైలజ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో
పెదవాల్తేరు, న్యూస్టుడే: పురుగుల మందు తాగి భార్య, బిడ్డ మృతిచెందిన సంఘటనలో...భర్త సంపంగి మోహనకృష్ణను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత శైలజ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో ఆమెతో పాటు చిన్నారి అక్షిత మృతిచెందిన సంగతి విదితమే. భర్త వేధింపులే దీనికి కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శైలజ భర్తను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సి.ఐ. ప్రసాద్ తెలిపారు.
చికిత్స పొందుతున్న తుషిత : ఈ సంఘటనలో శైలజ పెద్దకుమార్తె తుషిత(4) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యుల పరిశీలనలోనే ఉందని.. ఇంకా 72 గంటలు పరిశీలనలో ఉంచాల్సి ఉందని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో 142 మందికి జైలు
ఎం.వి.పి.కాలనీ, భీమునిపట్నం, న్యూస్టుడే: వేములవలస మార్కెట్, ఆనందపురం, భీమిలి క్రాస్రోడ్డు, భీమిలి, తగరపువలస ముఖ్య కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న 142 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో భీమిలి పోలీసుస్టేషన్ పరిధిలో 69 మంది, ఆనందపురం పోలీసుస్టేషన్ పరిధిలో 73 మంది ఉన్నారు. వీరిని భీమిలి 14వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు శనివారం హాజరుపరిచగా.. మోటారు వాహన చట్టం ప్రకారం ఒక్కొక్కరికి ఐదు రోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు రోజులు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సిందిగా తీర్పు ఇచ్చారు. దీంతో శిక్ష పడిన వారిని కేంద్ర కారాగారానికి తరలించారు.
భార్యను వేధించిన కేసులో భర్తకు ఆరు నెలల శిక్ష
విశాఖ, న్యూస్టుడే: భార్యను వేధించిన కేసులో నేరం రుజువు కావడంతో భర్తకు ఆరు నెలల కారాగార శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ ఒకటో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం న్యాయమూర్తి సీహెచ్.యుగంధర్ తీర్పునిచ్చారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింహాచలం ప్రాంతానికి చెందిన బత్తుల కృష్ణకిషోర్తో నగరానికి చెందిన బి.వి.ప్రశాంతి వివాహం 2013లో జరిగింది. ఆ సమయంలో ప్రశాంతి తల్లిదండ్రులు రూ.3 లక్షల కట్నం ఇచ్చారు. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం కృష్ణకిషోర్ మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. ఈ మేరకు బాధితురాలు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి యుగంధర్ నిందితునికి పైవిధంగా శిక్ష విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాల్లో వైకాపా అభ్యర్థి హల్చల్
[ 14-05-2024]
అనకాపల్లి అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మలసాల భరత్ ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచారు. అనుచర గణంతో కేంద్రాల్లోకి దూసుకువెళ్లి ప్రచారం నిర్వహించారు. -
దొంగ ఓటుకు వాలంటీర్ యత్నం
[ 14-05-2024]
జగనన్న సైన్యంగా చెప్పుకొంటున్న వాలంటీర్లు ఎన్నికల్లో బరితెగించారు. సోమవారం పోలింగ్ జరుగుతున్న కేంద్రాల్లోకి వెళ్లి ప్రచారాలు చేపట్టారు -
మోసయ్యపేటలో వైకాపా దౌర్జన్యకాండ
[ 14-05-2024]
అచ్యుతాపురంలోని మోసయ్యపేట పోలింగ్ కేంద్రంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులపై దౌర్జన్యానికి దిగారు. -
తెదేపా, వైకాపా వర్గాల కొట్లాట
[ 14-05-2024]
కొత్తరేవుపోలవరంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాజీ సర్పంచి చోడిపల్లి బంగారి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వస్తుండగా, వైకాపాకు చెందిన సర్పంచి మల్లే లోవరాజు వర్గీయులు కవ్వింపు చర్యలకు దిగారు. -
నిలిచారు.. ఓటర్లే గెలిచారు!!
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగింది. పలు బూత్లలో సమయం ముగిసినా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటంతో అధికారులు వారికి ఓటేసే అవకాశం కల్పించారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద...వైకాపా ప్రచారాలు
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రలోభాలకు గురి చేస్తూ ప్రచారాలు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు కళ్లు మూసుకున్నారు. -
అరకొర బస్సులు..కొనసాగుతున్న ఇక్కట్లు
[ 14-05-2024]
సొంత గ్రామాలకు చేరుకోవాలని ద్వారకా బస్స్టేషన్కు చేరినవారికి ఆర్టీసీ నిరాశ మిగిల్చింది. మూడు గంటల నుంచి నాలుగు గంటల సేపు వేచి ఉంటే వచ్చే బస్సులోనూ సీట్లు దొరక్క అవస్థలు పడాల్సి వచ్చింది. -
సుబ్బారెడ్డికి నిరసన సెగ
[ 14-05-2024]
మధురవాడ మల్లయ్యపాలెం 331 పోలింగ్ బూత్లో ఓటేసేందుకు వచ్చిన వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డికి ఓటర్ల నుంచి నిరసన సెగ తగిలింది. -
మొరాయించిన ఈవీఎంలు..నత్తనడకన పోలింగ్
[ 14-05-2024]
విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభంలో నెమ్మదిగా మొదలై క్రమంగా జోరందుకుంది. -
50 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్
[ 14-05-2024]
విశాఖ జిల్లాలో సోమవారం రాత్రి 10.30గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. -
బారులు తీరి.. కూటమికి బాసటగా నిలిచి..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలింగ్ను రెండు గంటల ముందుగా ముగించారు. -
మొరాయించిన ఈవీఎం... ఆలస్యంగా పోలింగ్
[ 14-05-2024]
రాజవొమ్మంగి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఈవీఎం, వీవీ ప్యాట్ల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!