మోసయ్యపేటలో వైకాపా దౌర్జన్యకాండ
అచ్యుతాపురంలోని మోసయ్యపేట పోలింగ్ కేంద్రంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులపై దౌర్జన్యానికి దిగారు.
వైకాపా, కూటమి నాయకుల తోపులాట
అచ్యుతాపురం, న్యూస్టుడే: అచ్యుతాపురంలోని మోసయ్యపేట పోలింగ్ కేంద్రంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులపై దౌర్జన్యానికి దిగారు. ఓటు వేయడానికి బంధువైన వృద్ధుడిని తీసుకెళ్తున్న చిట్టిబాబు అనే యువకుడిని పోలింగ్ కేంద్రంలోకి రాకుండా వైకాపా ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. దీనిపై కూటమికి చెందిన ఏజెంట్లు మీరు తీసుకొస్తే న్యాయమా? మేం తీసుకొస్తే అన్యాయమా? అని ప్రశ్నించారు. దీంతో పోలింగ్ వీరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సమాచారం కేంద్రం వెలుపల ఉన్న వైకాపా నాయకులకు అందించడంతో వారంతా ఒకేసారి వచ్చి కూటమి నాయకులపై దాడికి దిగారు. పోలింగ్ కేంద్రంలో ఇటుకలను ఒకరిపై ఒకరు విసురుకొని భౌతికదాడులకు దిగారు. అందరూ చూస్తుండగా కొట్టుకుంటూ పోలింగ్ బూత్ నుంచి వైకాపా నాయకులు బయటకు వచ్చారు. ఈ కొట్లాటలో కూటమికి చెందిన పుర్రే రాజు చెయ్యి విరిగిపోయింది. ఈ ఘటనతో ఓటర్లు పరుగులు తీశారు. సమస్యాత్మక గ్రామమైనా ఒకే ఒక కానిస్టేబుల్ను బందోబస్తుకు ఉంచారని, గట్టి చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని కూటమి నాయకులు పుర్రే శ్రీను మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతో వైకాపా నాయకులు కొట్లాటకు దిగారని ఆయన ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దాసుపత్రిలోఏం జరుగుతోంది..?
[ 29-05-2024]
కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో కొద్ది రోజులుగా అధికారుల మధ్య పోరు జరుగుతోంది. ఫలితంగా పెద్దాసుపత్రిలో పాలన కుంటుపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్టీఆర్తోనే తెలుగు వారికి గుర్తింపు
[ 29-05-2024]
తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిరస్మరణీయులని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. మంగళవారం ఉదయం తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
సాంఘిక సంక్షేమశాఖ స్థలాన్ని కాజేసే కుట్ర..!
[ 29-05-2024]
సిరిపురం కూడలి సమీపంలోని సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్)కు ఆనుకుని ఉన్న సాంఘిక సంక్షేమశాఖకు చెందిన స్థలాన్ని వివాదంలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
కార్డెన్ సెర్చ్లో ముగ్గురు వైకాపా కార్యకర్తల అరెస్టు
[ 29-05-2024]
జీవీఎంసీ 96వ వార్డు పరిధి పెందుర్తిలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో పోలీసులు మంగళవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. -
పలు రైళ్ల రద్దు.. కొన్ని రీ షెడ్యూల్
[ 29-05-2024]
ప్రయాణికుల ఆదరణ లేని కారణంగా జూన్ 17, 24 తేదీల్లో సంబల్పూర్-కాచిగూడ (08325) ప్రత్యేక రైలు, జూన్ 18, 25 తేదీల్లో కాచిగూడ-సంబల్పూర్ (08326) ప్రత్యేక రైలును రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
సర్కారు లోపాలు సరిదిద్దేదెవరు?
[ 29-05-2024]
విద్యా వ్యవస్థలో వైకాపా సర్కారు తీసుకొచ్చిన సంస్కరణలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. కొత్తగా జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయకుండా ఉన్నత పాఠశాలల్లోనే రెండు, మూడు గ్రూపులతో హైస్కూల్ ప్లస్ పేరుతో ఇంటర్ తరగతులను నిర్వహిస్తున్నారు. -
కొనుగోలు దారులకు ధరల మంట
[ 29-05-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పప్పులు సహా అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. -
అపరాధం ఎవరిది?
[ 29-05-2024]
నగరంలో ట్రాఫిక్ నియంత్రణ పేరుతో ఇప్పటికే పలు కూడళ్లను రాజకీయ నేతల లబ్ధి కోసం మూసివేసి చోదకులకు చుక్కలు చూపిస్తున్నారు. -
అప్పన్న స్వామికి రికార్డు స్థాయి ఆదాయం
[ 29-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామికి రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. -
ఆస్తి పంచమంటే అంతమొందించారు
[ 29-05-2024]
ఆస్తి పంచాలంటూ కొడుకు పెడుతున్న హింస తట్టుకోలేక కన్నతండ్రి, తోడబుట్టిన తమ్ముడు కలిసి కిరాయి హంతకులకు డబ్బులిచ్చి మట్టుపెట్టించిన ఉదంతమిది. -
ప్రియురాలి తీరుతో మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య
[ 29-05-2024]
ఎన్ని సార్లు ఫోన్ చేసినా ప్రియురాలు తీయడంలేదని మనస్తాపం చెందిన రోమాల గంగాధర్ (24) ఆమె పుట్టిన రోజు నాడు ఆత్మహత్య చేసుకున్నారు.