అన్నంపై పగెందుకు జగన్!!
అన్నదానం మహాదానం అన్న మాట వెనుక ఎంతో అర్థముంది. అదే స్ఫూర్తితో తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్లు’ పేదల ఆకలి తీర్చాయి. బడుగులు ఆకలితో బాధ పడకూదనే సహృదయంతో చంద్రబాబు ఏర్పాటు చేస్తే...
పేదల పొట్టకొట్టిన వైకాపా ప్రభుత్వం
రూ.5కే భోజనం లభించే అన్నక్యాంటీన్ల మూసివేత
అన్న క్యాంటీన్ ఉన్నప్పుడు ధైర్యంగా రోడ్డు మీదకొచ్చి పని వెతుక్కునే వాళ్లం. ఆ రోజు పని దొరక్కపోయినా ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే రూ.5కే కడుపునిండా అన్నం లభించేది. ఇప్పుడు పనులు కూడా దొరకడం లేదు. వైకాపా వచ్చాక అర్ధాకలి బతుకులు అయిపోయాయి’.
ఇదీ ఓ రోజువారీ కూలీ ఆవేదన
అన్నదానం మహాదానం అన్న మాట వెనుక ఎంతో అర్థముంది. అదే స్ఫూర్తితో తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్లు’ పేదల ఆకలి తీర్చాయి. బడుగులు ఆకలితో బాధ పడకూదనే సహృదయంతో చంద్రబాబు ఏర్పాటు చేస్తే... అధికారంలోకి వచ్చిన జగన్ ‘అన్న క్యాంటీన్ల’ను నిర్దయగా మూసేసి పేదలంటే ఎంత చులకనో చేతల్లోనే చూపించారు. ఈ నిర్ణయంతో... అప్పటి వరకూ రూ. 5లకే కడుపునిండా భోజనం చేసే పేదలు ఒక్కసారిగా విలవిల్లాడారు. ఐదేళ్లుగా ఆ బాధను పంటికింద భరిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కుతో తమ సత్తా చాటి...మళ్లీ అన్నక్యాంటీన్లు నడిపించేలా చేస్తామని ప్రతిన బూనుతున్నారు.
కన్నుకుట్టింది: నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ నామస్మరణ చేస్తున్న సీఎం జగన్ చివరకు అదే నిరుపేదల నోట్లో మట్టి కొట్టారు. పేదలకు కడుపునిండా తిండి పెట్టాలన్న మహోన్నత లక్ష్యంతో గత తెదేపా ప్రభుత్వం అన్నక్యాంటీన్లను ప్రారంభించింది. కేవలం రూ.5కే భోజనం లభించేది. దీంతో అనాథలు, పేదలు, రోగుల సహాయకులు, వీధి వర్తకులు, కూలీలు, వివిధ రంగాల కార్మికులు, తదితరులు మూడు పూటలా ఎంచక్కా కడుపునింపుకునేవారు. 2019లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక కన్నుకుట్టింది. తెదేపా ప్రభుత్వం మీద అక్కసుతో అన్నక్యాంటీన్లను అన్యాయంగా మూయించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అన్నక్యాంటీన్ల భవనాలు ప్రస్తుతం అధ్వానంగా మారాయి. నాడు పేదల ఆకలి తీర్చిన నిర్మాణాలు నేడు ఎందుకూ పనికిరాని విధంగా మార్చేశారు.
మూతపడిన అన్న క్యాంటీన్
నెలకు రూ.3 వేలు మిగిలేవి..
ఏ ప్రభుత్వమైనా పేదలకు మేలు చేసే పథకాలను తప్పక కొనసాగిస్తుంది. వైకాపాకు అలాంటి ఆలోచనే లేదు. అన్నక్యాంటీన్ల విషయంలో కక్ష కట్టినట్లు వ్యవహరించింది. మాటల్లో పేదలపై ఎంతో ప్రేమ కురిపించే జగన్ తీరువల్ల ఎంతో మంది అర్ధాకలితో రోజులు గడుపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.5కు భోజనం ఇక్కడ అందించేవారు. మూడు పూటలా తిన్నా రూ.15 ఖర్చయ్యేది. నాణ్యమైన పోషకాహారం దొరికేది. ఇప్పుడు వందల్లో ఖర్చు చేసినా.. ఆ సంతృప్తి దొరకడం లేదు. పైగా ఇప్పుడు ఆ ఖర్చు రూ.100 అవుతోంది. అలా నెలకు రూ.3 వేల వరకూ, ఏడాదికి రూ.36 వేల వరకూ ఖర్చవుతోంది. సంపాదించిన ఆదాయంలో సగం డబ్బులు ఈ రూపంలోనే ఖర్చైపోతున్నాయి. బటన్ నొక్కి పేదలను ఆదుకుంటున్నానంటున్న జగన్కు ఇవన్నీ కనిపించవా అని పేదలు మండిపడుతున్నారు.
ఇలా.. జిల్లాలో..
నియోజకవర్గాలు7
సగటున రోజుకి భోజనం చేసిన వారు (సుమారు) 27,620
ప్రయోజనం: ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు చేసేవారు. ప్రతి నెలా లక్షలాది మంది ఈ క్యాంటీన్లను వినియోగించుకునేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఎక్కువ.. ఎవరి వైపు!!
[ 16-05-2024]
మహిళల ఓట్లు ఎక్కువగా తమకే పడ్డాయని, గెలుపు అవకాశాలు తమవేనంటూ తెదేపా కూటమి, వైకాపా అభ్యర్థులు ఎవరికి వారు దీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీ గణాంకాలను విశ్లేషిస్తున్నారు. -
ఏదీ.. ఏమయింది నాటి కళ!
[ 16-05-2024]
వైకాపా ప్రభుత్వం రుషికొండపై సాగించిన విధ్వంసానికి సమీప బీచ్ కళావిహీనంగా మారింది. ఎన్నికలకు ముందు సీఎం క్యాంపు కార్యాలయం కోసమంటూ బీచ్లోని వసతులను ఎత్తేశారు. -
‘ఓటమి భయంతో వైకాపా మూకల దాడులు’
[ 16-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమికే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని, ఇది చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మూకలు తెదేపా నాయకులు, శ్రేణులపై దాడులకు దిగుతున్నాయని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. -
నేటి నుంచి నిర్మాల్య చందనం విక్రయాలు
[ 16-05-2024]
చందనోత్సవం సందర్భంగా ఈనెల 10వ తేదీన అప్పన్న స్వామి దేహంపై నుంచి వేరుచేసిన నిర్మాల్య చందనం విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. -
నిధుల విడుదలలో.. కుట్ర కోణం?
[ 16-05-2024]
ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల లబ్ధిని జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నానా హడావుడి చేశారు. -
జిల్లాలో 70.03 శాతం పోలింగ్ నమోదు
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
అర్ధరాత్రి విధ్వంసం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
నేటి నుంచి గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 16-05-2024]
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నడుస్తున్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగులు సీట్ల ప్రవేశాలకు ఈనెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ జరుపుతున్నామని విశాఖ, అనకాపల్లి జిల్లాల గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపవతి వెల్లడించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడి మృతి
[ 16-05-2024]
మధురవాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
ముందుకెళ్లే వీల్లేక.. మార్గ మధ్యలో నిలిచే..!
[ 16-05-2024]
గోపాలపట్నం నుంచి బాజీకూడలి మీదుగా ఎన్ఏడీకూడలికి వెళ్లే బీఆర్టీఎస్ సేవా మార్గంలో నిత్యం ట్రాఫిక్ వెతలతో వాహన చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
మీ అభిమానం మరువలేనిది
[ 16-05-2024]
తనకు అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థిగా సీటు ఖరారు చేసినప్పటి నుంచి పోలింగు వరకు తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూపిన అభిమానానికి సీఎం రమేశ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
నాడు-నేడు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
అనకాపల్లిలో పెరిగిన పోలింగ్
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అనకాపల్లి, ఎలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా, ఓర్పుతో ఓటు వేశారు. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగింది.