ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు.
వైకాపా పాలనలో ఉపాధి లేక వెతలు
రోడ్డునపడ్డ భవన నిర్మాణ కార్మికులు
దిక్కుతోచక వలస పోతున్న పేదలు
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. ముఖ్యంగా తమ బతుకుల్లో వెలుగులొస్తాయని భవన నిర్మాణ కార్మికులు ఎంతగానో ఆశపడ్డారు. అలాంటి బడుగుల జీవితాల్లో వైకాపా ప్రభుత్వం ఏకంగా ఇసుక తుపాను సృష్టించి అతలాకుతలం చేసింది. ఐదేళ్లుగా ప్రతి రోజు పడుతున్న కష్టాలను తలచుకొని కుమిలిపోతున్న భవన నిర్మాణ కార్మికులు... ఏ క్షణం ఎన్నికలు జరిగినా తమ గుండెమంట చల్లారే తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈనాడు, విశాఖపట్నం
పనులకోసం వచ్చి వేచి ఉన్న కార్మికులు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణరంగం కుదేలైంది. గత ప్రభుత్వంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి సరఫరాను నిలిపేయడంతో పెద్ద సంఖ్యలో కార్మికులు రోడ్డునపడ్డారు. ఈ నిర్ణయం విశాఖ జిల్లాలో 1.50 లక్షల మంది భవన నిర్మాణ, అనుబంధ రంగాల కార్మికులపై తీవ్ర ప్రభావం చూపింది. వందల సంఖ్యలోని భారీ ప్రాజెక్టులు, వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి.
ఇప్పటికీ కొరతే: జిల్లాలో భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఇప్పటికీ వేధిస్తుంది. పూర్తిస్థాయి ఇసుక నిల్వ కేంద్రాలు లేక అవస్థలు తప్పడం లేదు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో సరిపడా దొరక్క అటు శ్రీకాకుళం, ఇటు రాజమహేంద్రవరం నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది.కొనుగోలుదారులకు ఇది అదనపు భారంగా మారింది. గతంలో ముడసర్లోవ, లంకెలపాలెం, భీమిలిలో నిల్వ కేంద్రాలు ఉండేవి. ఏడాది నుంచి వాటిని ప్రభుత్వం ఎత్తేసింది. రోజుకు పది వేల టన్నుల ఇసుక అవసరం. మొదట్లో ఆరు వేల టన్నులు సరఫరా చేసేవారు. ప్రస్తుతం అది కూడా లేకుండా పోయింది.
అవి భయానక క్షణాలు: గత ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ ద్వారా అనేక పథకాలు అందేవి. అన్న క్యాంటీన్లలో తక్కువ ధరకు భోజనం అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కార్మిక సంక్షేమ బోర్డు నుంచి పిల్లల చదువులు, కుటుంబ అవసరాలకు ఏ పథకాలు అందకపోగా ఈ ప్రభుత్వం అందులోని డబ్బులు వాడేసింది. ఇసుక కష్టాల సమయంలో రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చింది. పిల్లల చదువులకు ఫీజులు కట్టలేకపోయారు. ఇంటి అద్దెలు, నెలవారి కిస్తీలు చెల్లించలేకపోయారు. కూలి పనులు లేక పూటగడవడం కష్టంగా మారి కొత్తగా అప్పులు చేయాల్సివచ్చింది. కొందరైతే ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లిపోయారు. ఆ కష్టాల భయానక పరిస్థితులు ఇప్పటికీ కార్మికులను వెంటాడుతున్నాయి. నాడు చేసిన అప్పుల భారం నేటికీ తీరలేదు.
వేల కుటుంబాల ఆవేదన: తెదేపా హయాంలో రోజు వారి కూలీలు పనులకు వెళ్తే నిత్యం రూ.700లు దక్కేవి. అలా నెలలో 25 రోజులు పనిచేస్తే 17,500 వచ్చేది. కుటుంబంలో ఇద్దరు వెళ్తే ఆ మేరకు ఆదాయం ఉండేది. వైకాపా పాలనలో గడ్డురోజులు ఎదురై కొన్ని నెలలపాటు పనులు కరవయ్యాయి. మధ్యవయస్కులు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కు వలసపోయారు. చాలా మంది విశాఖలో పనుల్లేక, ఇక్కడ ఉండలేక సొంతూళ్లకు వెళ్లిపోయారు. అక్కడా పనులు లేక...ఆదాయం రాక నిత్యం సతమతమవుతున్నారు.
జిల్లాలో నియోజక వర్గాల్లో నమోదైన కార్మికులు (సుమారు): 1,58,000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
[ 02-05-2024]
తెదేపా హయాంలో ‘బీఆర్ అంబేడ్కర్’ పేరుతో అమలు చేసిన విదేశీ విద్య పథకానికి ముఖ్యమంత్రి జగన్ నీళ్లొదిలారు. ఈ పథకానికి తన పేరు పెట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు. -
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
పాడికుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. ప్రతిపక్షం మీద కక్షతో జగన్ పాడిని పాడు చేశారు. -
మాటలు బడాయి.. పేదల వైద్యానికి బకాయి
[ 02-05-2024]
సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మెరుగైన వైద్య సేవలందించాలి. కానీ వైకాపా ప్రభుత్వం అవేవీ పట్టవన్నట్లు వ్యవహరిస్తోంది. -
మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసా..
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఓటు ఎక్కడ ఉంది? పోలింగ్ కేంద్రం ఎక్కడ? ఎలా చేరుకోవాలి? అనే సందేహాలు ఓటర్లలో తలెత్తుతున్నాయి. -
నేడు ‘దక్షిణం’లో పవన్ సభ
[ 02-05-2024]
దక్షిణ నియోజకవర్గ దుర్గాలమ్మ ఆలయం ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు జనసేన అధినేత పవన్కల్యాణ్ బహిరంగ సభ జరగనుందని ఆ పార్టీ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
ఫలితాలు తేల్చేది వనితలే!
[ 02-05-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏప్రిల్ 25 నాటికి 12,89,371 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి గత శనివారం రాజకీయ పార్టీల సమావేశంలో ప్రకటించారు. -
కాపులకు మేలు చేసింది తెదేపానే: గంటా
[ 02-05-2024]
రాష్ట్రంలో కాపులకు మేలుచేసిన పార్టీ తెదేపా మాత్రమేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
ఆరోగ్యశ్రీ పథకానికి అనారోగ్యం
[ 02-05-2024]
జగనన్న పాలనలో ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. -
విదేశీ విద్య.. అంతా మిథ్య
[ 02-05-2024]
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్న పేద విద్యార్థుల కలను జగన్ కల్లగానే మిగిల్చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరిట అమలు చేస్తున్న ఈ పథకం లబ్ధిదారులకు కఠిన నిబంధనలు అడ్డుగా మారాయి. -
జనసేనానికి జన నీరాజనం
[ 02-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పెందుర్తిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జనసేనానికి నీరాజనాలు పలికారు. -
ఎమ్మెల్యే సారూ.. జెట్టీ ఒట్టి మాటేనా..
[ 02-05-2024]
పరవాడ మండలం ముత్యాలమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం, జాలారిపేట, సమ్మెంగిపాలెంలోని మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన ఆధారం. -
నోటా కోసమే ఒక బ్యాలెట్ యూనిట్
[ 02-05-2024]
జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోల్చితే విశాఖ దక్షిణంలో పోలింగ్ ఈసారి కాస్త భిన్నంగా ఉండనుంది. ఇ -
స్వగ్రామానికి ఆర్మీ ఉద్యోగి మృతదేహం
[ 02-05-2024]
పశ్చిమబెంగాల్లో హఠాన్మరణం చెందిన ఆర్మీ హవల్దార్ చిల్ల త్రినాథరెడ్డి (36) మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన చిట్టివలస సమీప జీరుపేట గ్రామానికి బుధవారం తీసుకువచ్చారు. -
ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్యాయత్నం....
[ 02-05-2024]
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది. -
బాలికపై అత్యాచార యత్నం
[ 02-05-2024]
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై ఎండాడ దిశా పోలీసు స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు భీమిలి సీఐ డి.రమేశ్ తెలిపారు.