విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు.
నేటితో ముగియనున్న గడువు
రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేస్తున్న మెట్టరామారావు, కొంగరపు గణపతి, అచ్యుత కిరణ్బాలాజీ, నాగ సత్యనారాయణ, మురాల అరుణశ్రీ
వన్టౌన్, న్యూస్టుడే: విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు.
అసెంబ్లీ స్థానాలకు 44 దాఖలు: జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు 44 మంది అభ్యర్థులు బుధవారం నామపత్రాలు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుÄలతో పాటు పలువురు స్వతంత్రులు వీరిలో ఉన్నారు. భీమిలి 8, తూర్పు 8, విశాఖ దక్షిణం 7, ఉత్తరం 5, విశాఖ పశ్చిమం 6, గాజువాక 7, పెందుర్తికి 3 చొప్పున వచ్చాయి. నామపత్రాల దాఖలుకు గురువారంతో గడువు ముగియనున్నది.
వైకాపా హయాంలో ‘పల్లా’పై మూడు కేసులు
గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కుటుంబ అప్పులు గత అయిదేళ్లలో అయిదింతలు పెరిగాయి. 2019లో అప్పులు రూ.40.45 లక్షలు. వారి ప్రస్తుత అప్పులు రూ.2.33 కోట్లు. ఆయనపై వైకాపా హయాంలో మూడు కేసులు పెట్టారు. పల్లా కుటుంబ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.34.32 కోట్లు. వాటిలో శ్రీనివాసరావు పేరిట స్థిరాస్తులు రూ.7.13 కోట్లు, చరాస్తులు రూ.14.91 లక్షలు. ఆయన భార్య లావణ్య దేవి పేరిట స్థిరాస్తులు రూ.6.59 కోట్లు, చరాస్తులు రూ.61.34 లక్షలు. అవిభక్త కుటుంబానికి (హెచ్యూఎఫ్) రూ.20.26 కోట్లున్నాయి. మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్లో రూ.18 లక్షల చీటీ ఉన్నట్లు పేర్కొన్నారు.
విశాఖ తూర్పులో ఎంవీవీ...
వన్టౌన్, న్యూస్టుడే: విశాఖ తూర్పు వైకాపా అభ్యర్థిగా, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బుధవారం నామపత్రం దాఖలు చేశారు. ఎంవీపీ కాలనీలోని కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్కేబీచ్, కోస్టల్బ్యాటరీ మీదుగా కలెక్టరేట్కు మధ్యాహ్నం 1.30గంటలకు ర్యాలీ చేరుకుంది. అనంతరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జేసీ మయూర్అశోక్కు ఎంవీవీ నామపత్రం అందజేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ముఖ్య నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.
గాజువాకలో అమర్నాథ్...
అక్కిరెడ్డిపాలెం, న్యూస్టుడే : గాజువాక నియోజకవర్గం వైకాపా అభ్యర్థిగా... రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ బుధవారం నామినేషన్ వేశారు. ఉదయం తన స్వగ్రామం మింది నుంచి ర్యాలీగా గాజువాక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి లక్ష్మారెడ్డికి నామపత్రాలు అందించారు. ర్యాలీలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భీమిలిలో ముత్తంశెట్టి...
గ్రామీణభీమిలి, న్యూస్ టుడే: భీమిలి వైకాపా అభ్యర్థిగా సిటింగు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం నామినేషన్ వేశారు. భార్య జ్ఞానేశ్వరి, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, తదితరులతో కలిసి ఆయన నాలుగు సెట్ల నామపత్రాలను ఎన్నికల రిటర్నింగు అధికారి ఎస్.భాస్కరరెడ్డికి అందించారు. డమ్మీ అభ్యర్థిగా ముత్తంశెట్టి భార్య జ్ఞానేశ్వరి కూడా రెండుసెట్ల నామినేషన్ వేశారు. అంతకుముందు భీమిలి బీచ్లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
భారీగా పెరిగిన గణబాబు అప్పులు: విశాఖ పశ్చిమ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పి.గణ వెంకట రెడ్డి నాయుడు (గణబాబు) అప్పులు గత అయిదేళ్లలో భారీగా పెరిగాయి. 2019లో వారి కుటుంబ అప్పులు రూ.93 లక్షలు. ప్రస్తుతం వారికి రూ.12.67 కోట్ల అప్పులున్నాయి. వారి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.39.67 కోట్లు. వీటిలో ఆయన పేరిట చరాస్తులు రూ.60.39 లక్షలు, స్థిరాస్తులు రూ.35.41 కోట్లు. ఆయన భార్య మాధవీ లత పేరిట చరాస్తులు రూ.42.14 లక్షలు, స్థిరాస్తులు రూ.1.05 కోట్లు. అవిభక్త కుటుంబానికి (హెచ్యూఎఫ్) రూ.2.63 కోట్ల ఆస్తులున్నాయి. ఆయనపై కేసులు లేవు.
వంశీకృష్ణ ఆస్తులు రూ.13.32 కోట్లు: విశాఖ దక్షిణం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్కు స్థిర, చరాస్తులు కలిపి రూ.13.32కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో ప్రస్తావించారు. వంశీకృష్ణ, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యుల పేరుతో చరాస్తులు రూ.7.41కోట్లు, స్థిరాస్తులు రూ.5.91కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. వంశీకృష్ణ పేరుతో 663 గ్రాముల బంగారం ఉంది. అప్పులు రూ.2.11కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఏడు క్రిమినల్, సివిల్ కేసులు నమోదై ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాదాలు.. విశాఖ నిండా దందాలు!!
[ 04-05-2024]
అధికారంలోకి రాగానే విశాఖలో జగన్ రుషికొండపై విధ్వంసం చేస్తే.. వైకాపా కార్పొరేటర్లు ఊరికే ఉంటారా? విలువైన ప్రాజెక్టులు..భూములు ముఖ్య నేతలు కొల్లగొడుతుంటే కార్పొరేటర్లు కళ్లు మూసుకుంటారా? అన్నకు మించిన దందాలకు తెగబడ్డారు. -
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
అభివృద్ధా.. విధ్వంసమా!!
[ 04-05-2024]
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా శుక్రవారం నగరంలో బాలకృష్ణ రోడ్షో నిర్వహించారు. జాలారిపేట నుంచి మొదలైన రోడ్డు షో వెంకోజిపాలెం, డెయిరీ ఫాం కూడలి, రవీంద్రనగర్, చినగదిలి మీదుగా సాగింది. -
జగన్ సమర్పించు క్లాప్ దోపిడీ..!
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వంలో దోపిడీ విధానాలు కోకొల్లలు. ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్ వాహనాల్లో కూడా వైకాపా కీలక నేతలు దండుకుంటున్నారు. -
సామాన్య భక్తులే లక్ష్యంగా..
[ 04-05-2024]
గత చందనోత్సవ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సామాన్య భక్తులందరికీ సులువుగా అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. -
ఎంవీవీ కార్యాలయంలో తనిఖీల కలకలం
[ 04-05-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. -
‘సీబీసీఎన్సీ’ ధూళి ప్రమాదకరం..!
[ 04-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్)లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపడుతున్న భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో గృహాలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసి మోసపోవద్దని సీబీసీఎన్సీ ప్రతినిధి దాసరి యాకోబ్ తాడేపల్లి పత్రికా ప్రకటన ఇచ్చారు. -
చందనోత్సవ టికెట్ల విక్రయాలకు శ్రీకారం
[ 04-05-2024]
ఈనెల 10వ తేదీన చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శన టికెట్ల విక్రయం శుక్రవారం నుంచి ప్రారంభించారు. సింహగిరిపై జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి, ఆర్జేసీ సుబ్బారావు సంబంధిత వెబ్సైట్ను ప్రారంభించారు. -
ప్రజా సహకారంతో కూటమి గెలుపు : శ్రీభరత్
[ 04-05-2024]
తెదేపా కూటమి గెలుపునకు అన్ని వర్గాలు సహకరించాలని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ , గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. -
కూటమితో మెరుగైన పాలన : గణబాబు
[ 04-05-2024]
తెదేపా కూటమితో మెరుగైన పాలన అందుతుందని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. శుక్రవారం ఆయన 92వ వార్డు ఇందిరానగర్, గణేశ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పేదలను వేధిస్తున్న సైకో జగన్
[ 04-05-2024]
పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే వారి చిత్రాలను టీవీల్లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వం రావడం ఖాయం
[ 04-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. జల్లూరు, సుంకపూరు, బాపిరాజు కొత్తపల్లి, రామచంద్రపాలెం, సన్యాసిరాజుపాలెం, పాములవాక, బోడపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న జాగాలు.. జోరుగా బేరాలు
[ 04-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. -
పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాం
[ 04-05-2024]
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తూ వారిని చదివించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు. -
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 04-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అదనంగా వినియోగించనున్న ఈవీఎంల (సప్లిమెంటరీ) ర్యాండమైజేషన్ను శుక్రవారం పూర్తి చేశారు. -
సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్
[ 04-05-2024]
విశాఖ జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్లను పంపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. -
పోస్టల్ బ్యాలెట్ కోసం ఆరు కేంద్రాలు
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ఆరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిణి రోజారాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!