logo

ఎన్నికల వేళ.. ఇదేమి తీరు!!

ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు జగన్‌ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్‌ డేటా ఎంట్రీ’ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది.

Published : 28 Apr 2024 03:46 IST

వివరాలు నమోదు చేసి ప్రింటు తీస్తే చాలు!
రిజిస్ట్రేషన్‌ అయిపోయినట్లే..
విశాఖ జిల్లాలో రెండు చోట్ల ప్రయోగాత్మక పరిశీలన

ఈనాడు, విశాఖపట్నం: ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు జగన్‌ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్‌ డేటా ఎంట్రీ’ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. ఇందులో వినియోగదారుడికి ఆస్తి పత్రంలో తగిన వివరాలు నమోదు చేసుకునేందుకు కొంత వెసులుబాటు ఉండేది. తాజాగా అమలు చేయనున్న విధానంలో అటువంటి అవకాశం లేదు. ఆన్‌లైన్‌లో పేర్కొన్న వివరాలు నమోదు చేస్తే దాన్ని సబ్‌రిజిస్ట్రార్‌ పరిశీలించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం ప్రింటు తీసుకొని వెళ్లిపోవచ్చు. ఇక నుంచి దాన్నే ఆస్తి దస్త్రంగా పరిగణిస్తారు. ఈ విధానంపై అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. ఇటువంటి విధానపరమైన నిర్ణయాలు అమలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. విశాఖ జిల్లాలో మధురవాడ, సూపర్‌ బజార్‌ కార్యాలయాల్లో నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. శనివారం కొన్ని డాక్యుమెంట్లను ఆ విధంగా పరిశీలించారు. కొత్త విధానంలో కొనుగోలు, అమ్మకందారులు వారికి నచ్చిన వివరాలను పొందుపరచడానికి వీలుపడదు. కొందరు వారి కుటుంబాలకు సంబంధించి అన్ని వివరాలు పొందుపరిచి రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇకపై ఆ అవకాశం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని