పేదల ఆశలపై నీళ్లు.. పాలకులేనా వీళ్లు!!
‘జగన్ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా ఉండను. 2020 వరకు సమయం ఇవ్వండి.
కల్యాణమస్తు, షాదీ తోఫా అమలులో నిర్లక్ష్యం
‘రెట్టింపు’ పేరిట జగన్ దగా
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: జగన్ మాట: ‘జగన్ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా ఉండను. 2020 వరకు సమయం ఇవ్వండి. బ్రహ్మాండమైన ‘పెళ్లికానుక’ పథకాన్ని తీసుకొస్తాం. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేసి ఇస్తాం.
2019 నవంబరు 11న విజయవాడలో..
ఇదీ మోసం: అధికారంలోకి రాగానే నిబంధనలు మార్చారు. అమ్మాయిలు కనీసం డిగ్రీ వరకైనా చదవాలనే ఉద్దేశంతోనే పదో తరగతి నిబంధన పెట్టామన్నారు. ఎక్కువ మందికి లబ్ధి కలగకుండా కట్టడి చేశారు. ఆరు దశల వడపోతతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు. సాయం అందజేతలోనూ ఆలస్యం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ఇతర వర్గాలకు అండగా ఉంటానని ప్రతిపక్షనేతగా జగన్ ఊరూరా ప్రచారం చేశారు. పేదింట ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికసాయం అందజేస్తామని గత ఎన్నికల ముందు ఊదరగొట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం కల్యాణమస్తు, ముస్లిం వర్గాల వారికి షాదీ తోఫా అమలు చేస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక పేద వర్గాల ఆశలపై నీళ్లు చల్లారు. తెదేపా హయాంలో తీసుకొచ్చిన పథకానికి హడావుడిగా పేరు మార్చిన జగన్ ప్రభుత్వం..అమలులో నిరక్ష్యంగా వ్యవహరించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల పాటు దీనిపై కనీసం దృష్టి పెట్టలేదు. దీంతో పేద కుటుంబంలో వివాహం జరిపించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
కొవిడ్ సాకు చూపి: గత తెదేపా ప్రభుత్వం 2018లో ‘పెళ్లి కానుక’ పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వంలో 2018-19లో ఉమ్మడి జిల్లాలో 5000 మందికి పైగా రూ.14 కోట్లు అందజేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు ఆమోదం తెలిపారు. నిధులు కేటాయించినట్లు ప్రకటించడంతోపాటు 2020 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ గడువు ముగిసినా పథకాన్ని అమలుచేయలేదు. 2019 మార్చి నుంచి అక్టోబరు వరకు దరఖాస్తు చేసుకున్న వధూవరులకు ఆర్థికసాయం అందించనే లేదు. తర్వాత కరోనాను సాకుగా చూపి దరఖాస్తుల ప్రక్రియ నిలిపివేశారు. కొవిడ్ ముగిసిన తర్వాత ఏడాదిన్నర పాటు సాయం అందించకుండా కాలయాపన చేశారు.
అర్హుల సంఖ్య తగ్గించి: ముస్లిం వర్గాలు కోర్టును ఆశ్రయించడంతో 2022లో పథకాన్ని అమలు చేయడం ప్రారంభించినా.. నిబంధనల పేరిట అర్హుల సంఖ్యను తగ్గించారు. పాత జీవోను పక్కపెట్టి.. 2022 సెప్టెంబరులో మరో జీవోను తెరపైకి తెచ్చారు. వాటిని 2022 అక్టోబరు నుంచి అమలుచేస్తామని ప్రకటించారు. 2019 జూన్ నుంచి 2022 సెప్టెంబరు వరకు వివాహం చేసుకున్న పేదలకు లబ్ధిని దూరం చేశారు. అప్పటి నుంచి 2023 వరకు కల్యాణమస్తు, షాదీతోఫా పథకాల కింద అయిదు విడతలుగా నిధులు అందజేశారు. జిల్లాలో కేవలం 1,782 జంటలకు రూ.11.39 కోట్లు అందజేశారు.
నిర్దాక్షిణ్యంగా తొలగింపు
‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కల్యాణమిత్రలుగా మీరే ఉంటారు. ఒక్కో పెళ్లికి ఇచ్చే ప్రోత్సాహకాలు పెంచుతాం’ అని జగన్ హామీ ఇచ్చారు. కల్యాణ మస్తు పథకం అమలవుతున్నా కల్యాణమిత్రలను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించే వారికి ఉపాధి లేకుండా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల నరకం వే(ఓ)టేస్తేనే.. నవశకం!!
[ 12-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. ‘మూడు విధ్వంసాలు.. ఆరు ఆక్రమణలు’ అన్నట్లుగా కొందరు నాయకులు వీరంగం సృష్టించారు. -
ఆస్తి మాది.. హక్కులు సమాధి..!!
[ 12-05-2024]
ముఖ్యమంత్రి నుంచి... మంత్రుల వరకు అందరూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల ప్రమాదం ఏమీ లేదు అని చల్లగా చెబుతున్నారు!! కానీ... ప్రమాదకరమైన చట్టం తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని మరో వైపు జనం మండిపడుతున్నారు!! -
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన
[ 12-05-2024]
జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలే ఎక్కువ. సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నా వారి బతుకులు బాగుపడడం లేదు. విత్తు నుంచి ఎరువుల వరకు ధరలు పెంచేశారు. అయిదేళ్లలో వ్యక్తిగతంగా ఒక్క రాయితీ యంత్రమూ ఇవ్వలేదు. -
పాలన దగా.. బడుగుజీవి భగభగ!
[ 12-05-2024]
ఆదాయం గుప్పెడంత పెరుగుతుంటే ఖర్చులు కొండలా పెరుగుతున్నాయి. తప్పనిసరి అవసరాలకు, తప్పించుకోలేని ఖర్చులకు మధ్య జనం కిందమీదా పడుతున్నారు. అన్నింటికీ బటన్ నొక్కుతున్నామని చెబుతున్న జగన్ పాలనలో ధరల తగ్గింపు బడ్జెట్ బటన్ నొక్కడం మరిచిపోయాడని బడుగుజీవి ఆగ్రహంతో ఉన్నాడు. -
‘దక్షిణం’లో కూటమి భారీ ర్యాలీ
[ 12-05-2024]
దక్షిణ నియోజకవర్గ కూటమి(జనసేన) అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం నియోజకవర్గ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి ఘనంగా ముగింపు ఇస్తూ మూడు పార్టీల శ్రేణులు భారీగా తరలివచ్చాయి. -
పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
[ 12-05-2024]
విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. -
అవంతిపై ‘ట్రోల్స్’కు అవధుల్లేవ్!
[ 12-05-2024]
భీమిలి వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి)పై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. ఊసరవెల్లి రంగులు మార్చినంత తేలికగా పార్టీ మార్చారంటూ పోస్టులు పెడుతున్నారు. -
ఓటు నీ ఆయుధం.. మరువకు ఏ క్షణం..!
[ 12-05-2024]
అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని క్రెడాయ్ ప్రతినిధులు కోరారు. ఈమేరకు శనివారం సూర్యబాగ్ ప్రాంతంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. -
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం: శ్రీభరత్
[ 12-05-2024]
సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారుల సంక్షేమానికి తెదేపా కూటమి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
కూటమి అభ్యర్థులకు బీసీ సంఘం మద్దతు
[ 12-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో తెదేపా కూటమి అభ్యర్థులకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశాన శంకరరావు వెల్లడించారు. -
యువతా.. తొలిసారి ఓటేస్తున్నారా..!
[ 12-05-2024]
కొత్తగా ఓటు నమోదు చేసుకున్న 18-19ఏళ్ల యువత ఈ ఎన్నికల్లో తొలిసారి ఆ అమూల్యమైన హక్కును వినియోగించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే తొలిసారి కావడంతో ఓటు ఎలా వేయాలో తెలియక కొందరిలో ఆందోళన ఉంటుంది. -
‘తెదేపా కూటమితో... ప్రగతి, ప్రజా సంక్షేమం’
[ 12-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం సాధ్యమవుతాయని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
ప్రచారం పరిసమాప్తం.. కూటమిదే పైచేయి..!
[ 12-05-2024]
జిల్లాలో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన మార్చి 16 నుంచే అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి గత నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
తాజా వార్తలు (Latest News)
-
వికృత నేరాల రూపం.. కొడగు బాలిక కేసు కొత్తమలుపు
-
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/24)
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ