కూటమి పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి
కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్
సుజాతనగర్(పెందుర్తి), న్యూస్టుడే: కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. పెందుర్తి అసెంబ్లీ కూటమి(జనసేన) అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అధ్యక్షతన ఆదివారం జీవీఎంసీ 97వ వార్డు పరిధిలోని సుజాతనగర్, గిరిప్రసాద్నగర్, గోపాలకృష్ణనగర్, వెంకటాద్రినగర్, సీ-2 జోన్, 70 ఫా€్లట్్స అపార్టుమెంట్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, స్థానికులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ మాట్లాడుతూ కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల ఆవశ్యత గురించి వివరించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పంచకర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, జీవీఎంసీ తెదేపా ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాసరావు, 97వ వార్డు కార్పొరేటర్ శానాపతి వసంత, 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఒక్కరోజు కష్టపడి ఓటేయండి
వేపగుంట, న్యూస్టుడే: పోలింగ్ రోజున ప్రతీ ఓటరు ఎండైనా, వానైనా కష్టపడి ఓటు వేసి తమను గెలిపిస్తే ఐదేళ్లు పాటు ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. సింహపురికాలనీలో పలు కాలనీ సంఘాల సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా దౌర్భాగ్యపు పాలన నుంచి విముక్తి పొందాలంటే విజ్ఞులైన ఓటర్లంతా కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా పద్మావతినగర్ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్, సింహపురికాలనీ అసోసియేషన్, వర్షిణి అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు, బాలాజీ హిల్వ్యూ అపార్ట్మెంట్ వాసులు సీఎం రమేశ్ను ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, కార్పొరేటర్లు బల్ల శ్రీనివాసరావు, పి.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు.
వేపగుంట శివాలయం వీధిలో ప్రచారం నిర్వహిస్తున్న కూటమి నాయకులు, కార్యకర్తలు
పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నడూలేని విధంగా భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేశ్ విజయం సాధిస్తారని 94వ వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు అన్నారు. వార్డు పరిధి శివాలయం వీధి, పైడిమాంబ కాలనీల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు, వార్డు జనసేన అధ్యక్షురాలు పిన్నింటి పార్వతి, నామాల అరుణ, యర్రానాగరాజు, శానాతి దేముడు తదితరులు పాల్గొన్నారు.
పరవాడ, న్యూస్టుడే: పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్కు మద్దతుగా జీవీఎంసీ 77వ వార్డు పరిధి మద్దివానిపాలెం, పలికిలివానిపాలెం, గొరుసువానిపాలెం, బూసువానిపాలెం గ్రామాల్లో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా, జనసేన నేతలు పాల అచ్చిలనాయుడు, కాకి గోవిందరెడ్డి, కాకిబాబు, కాకి శ్రీను, నక్క శ్రీను ఇంటింటికీ తిరిగి కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ.భోనంగి ఫార్మాసిటీ కాలనీలో తెదేపా సీనియర్ నేత అట్టా సన్యాసిఅప్పారావు, జనసేన నాయకుడు బుగిడి గోవింద ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. గాజు గ్లాసు, కమలం పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కీలకం.. మహిళా ఓటర్ల తీర్పు
[ 15-05-2024]
విశాఖ లోక్సభ స్థానానికి 33 మంది, అసెంబ్లీ స్థానాలకు 101 మంది పోటీ చేశారు.పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినా పోటీ మాత్రం తెదేపా కూటమి, వైకాపా మధ్యే కేంద్రీకృతం అయింది. -
ఈవీఎంలలో అభ్యర్థుల భవిత
[ 15-05-2024]
లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల భవిత ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు, కంట్రోలు యూనిట్లను ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపర్చారు. -
సహనానికి పరీక్ష
[ 15-05-2024]
పోలింగ్ రోజున నగరంలోని ఏ కేంద్రం వద్ద చూసినా బారులు తీరిన ఓటర్లు కనిపించారు. గంటల పాటు వరుసల్లో పడిగాపులు కాశారు. తీవ్ర ఉక్కపోతనూ భరించారు. వర్షానికీ వెనుదిరగలేదు. -
ఎన్నికల ఫలితాలపై పందేలు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఫలితాలకు జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండాలి. పోలింగ్కు, ఫలితాలకు మధ్య మూడు వారాల వ్యవధి ఉండటంతో అటు అభ్యర్థులు, -
భీమిలిలో రికార్డు విజయం సాధిస్తాం: గంటా
[ 15-05-2024]
భీమిలి నుంచి రికార్డు స్థాయిలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని తెదేపా ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. -
యువత ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి
[ 15-05-2024]
సమాజంలో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలని కాంక్షిస్తూ ఇస్కాన్ మందిరం (సాగర్నగర్) ఆధ్వర్యంలో నగరంలోని ఆర్కేబీచ్, రుషికొండ తదితర ప్రాంతాల్లో మంగళవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. -
22న సింహగిరిపై వైభవంగా నృసింహ జయంతి
[ 15-05-2024]
వైశాఖ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన అప్పన్న ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
అంధకారం.. అవాంతరాలను అధిగమించారిలా..
[ 15-05-2024]
ఈదురుగాలులతో కురిసిన వర్షం.. విద్యుత్తు సరఫరా నిలిచి పోలింగ్కు అంతరాయాలు ఓటర్ల చైతన్యం ముందు తలవంచాయి. రోలుగుంట మండలంలోని పలు పోలింగు కేంద్రాల్లో సోమవారం రాత్రి అంధకారం అలుముకుంది. -
సైకోతో ప్రజలే యుద్ధం చేశారు
[ 15-05-2024]
ఐదేళ్లు నరకం చూపించిన సైకో సీఎం జగన్తో ప్రజలే యుద్ధం చేశారని ఎలమంచిలి కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ తెలిపారు. -
ఆధిక్యంపైనే పేట నేతల లెక్కలు
[ 15-05-2024]
పాయకరావుపేట కూటమి అభ్యర్థి వంగలపూడి అనితతో నాలుగు మండలాలకు చెందిన తెదేపా నాయకులు మంగళవారం నక్కపల్లిలోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. -
ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకున్నారని అనకాపల్లి ఎంపీ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
నర్సీపట్నం చరిత్రలో రికార్డు స్థాయిలో..
[ 15-05-2024]
ప్రజల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. నర్సీపట్నంలో తొలుత పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనా చివరిలో పుంజుకుంది. -
సర్కారును సాగనంపాలనే కసితో ఓటేశారు
[ 15-05-2024]
ప్రభుత్వాన్ని గద్దె దించాలనే కసితో ఓటు వేసిన ప్రజలకు అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. -
క్షతగాత్రులకు కేజీహెచ్లో చికిత్స
[ 15-05-2024]
ఓటు వేసేందుకు వెళుతున్న గిరిజనుల వాహనం బోల్తా పడిన ఘటనలో గాయపడ్డ నలుగురు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. -
కూటమిని ప్రజలు నమ్మలేదు: బొత్స
[ 15-05-2024]
కూటమి మాయమాటలు, ప్రలోభాలను ప్రజలు నమ్మలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
ఉద్యోగుల పేరిట కుటుంబ సభ్యులకు వేతనాలు
[ 15-05-2024]
యశోదా ఆసుపత్రి గ్రూపులో కీలక విభాగంలో పనిచేసిన ఉద్యోగి రూ. 3.26 కోట్ల మొత్తాన్ని పక్కదారి పట్టించాడు. ఉద్యోగులకు చెల్లించే వేతనాల జాబితాలో తన కుటుంబ సభ్యుల పేర్లు చేర్చి, 2021 మే నుంచి 2023 సెప్టెంబరు మధ్య ఈ మొత్తం స్వాహా చేశాడు. -
వేతనాలకు ఉక్కు ఉద్యోగుల ఎదురుచూపులు
[ 15-05-2024]
మే నెల 15వ తేదీ వచ్చినా... ఉక్కు ఉద్యోగులకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారు. ఇంటి అద్దెలు, నెల వారీ బ్యాంకుల చెల్లింపులు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అతివలే ముందుండి నడిపారు!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోల్చితే అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం పెరిగింది. -
పెరిగిన ఓటింగ్.. కూటమిలో జోష్
[ 15-05-2024]
అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కాదు. అయినా ఓటర్లు ఎటు మొగ్గారో అంచనా వేయడానికి పార్టీల నాయకులు, కార్యకర్తలు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఏఏ అమల్లోకి వచ్చాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
-
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
-
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
-
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
-
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స
-
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు