రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు

రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 30 Apr 2024 06:20 IST

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం విశాఖ రైలు నిలయంలో ముమ్మర తనిఖీలు చేస్తున్న రైల్వే పోలీసులకు కదులుతున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన పల్లపు ముత్యాలు, మురళి, గొబ్బురు శ్రీనివాస్‌లు కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చేసిన దొంగతనాలను వెల్లడించారు. వారి నుంచి 16గ్రాముల బంగారు నెక్లెస్‌తో పాటు రూ.1500 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని