అనకాపల్లి లోక్సభ నుంచి15మంది పోటీ!
అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
కలెక్టరేట్, న్యూస్టుడే: అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన నామినేషన్ల ఉపసంహరణలో 22 నామినేషన్లకు ఏడుగురు అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి సమక్షంలో ఉపసంహరించుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ నిర్వహించారు. భాజపా అభ్యర్థి సీఎం రమేశ్, బూడి ముత్యాలనాయుడు (వైకాపా), వేగి వెంకటేశ్ (కాంగ్రెస్)తో పాటు, పలక శ్రీరామమూర్తి (బహుజన సమాజ్వాదీ పార్టీ), ఆడారి శరత్చంద్ర (జై భారత్ పార్టీ), వడ్లమూరి కృష్ణస్వరూప్ (దళిత బహుజన పార్టీ), నమ్మి అప్పలరాజు (భారత చైతన్య యువజన), కర్రి విజయలక్ష్మి (పిరిమిడ్), సిద్ద లోవరాజు, వంకాయల రామచం్రë¢రావు, తుమ్మగంట అప్పలనాయుడు, తుమ్మపాల హరిశంకర్, గార సూర్యారావు, జున్నూరి శ్రీనివాస్, పెట్ల నాగేశ్వరరావు బరిలో మిగిలారు. వీరిలో దళిత బహుజన పార్టీకి చెందిన వడ్లమూరి కృష్ణస్వరూప్కు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవితో పాటు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలిచ్చినా అదే గుర్తు వేరే వారికి కేటాయించడం సరికాదన్నారు.
ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు 69 మంది పోటీ!
కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలోని మాడుగుల, పాయకరావుపేట, ఎలమంచిలి, చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ తరవాత 69 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పార్లమెంట్ పరిధిలో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మాడుగులలో 11 నామినేషన్లలో ఇద్దరు, పాయకరావుపేటలో 10 నామినేషన్లకు ఒక్కరు, ఎలమంచిలిలో 14 నామినేషన్లకు నలుగురు, చోడవరంలో 8 నామినేషన్లకు ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనకాపల్లిలో 12 మంది, నర్సీపట్నంలో 8 మంది అభ్యర్థులు చివరికి బరిలో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఎక్కువ.. ఎవరి వైపు!!.. భారీ పోలింగ్పై నేతల విశ్లేషణలు
[ 16-05-2024]
మహిళల ఓట్లు ఎక్కువగా తమకే పడ్డాయని, గెలుపు అవకాశాలు తమవేనంటూ తెదేపా కూటమి, వైకాపా అభ్యర్థులు ఎవరికి వారు దీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీ గణాంకాలను విశ్లేషిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడి మృతి
[ 16-05-2024]
మధురవాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
ఏదీ.. ఏమయింది నాటి కళ!
[ 16-05-2024]
వైకాపా ప్రభుత్వం రుషికొండపై సాగించిన విధ్వంసానికి సమీప బీచ్ కళావిహీనంగా మారింది. ఎన్నికలకు ముందు సీఎం క్యాంపు కార్యాలయం కోసమంటూ బీచ్లోని వసతులను ఎత్తేశారు. -
‘ఓటమి భయంతో వైకాపా మూకల దాడులు’
[ 16-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమికే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని, ఇది చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మూకలు తెదేపా నాయకులు, శ్రేణులపై దాడులకు దిగుతున్నాయని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. -
నేటి నుంచి నిర్మాల్య చందనం విక్రయాలు
[ 16-05-2024]
చందనోత్సవం సందర్భంగా ఈనెల 10వ తేదీన అప్పన్న స్వామి దేహంపై నుంచి వేరుచేసిన నిర్మాల్య చందనం విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. -
నిధుల విడుదలలో.. కుట్ర కోణం?
[ 16-05-2024]
ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల లబ్ధిని జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నానా హడావుడి చేశారు. -
జిల్లాలో 70.03 శాతం పోలింగ్ నమోదు
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
అర్ధరాత్రి విధ్వంసం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
నేటి నుంచి గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 16-05-2024]
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నడుస్తున్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగులు సీట్ల ప్రవేశాలకు ఈనెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ జరుపుతున్నామని విశాఖ, అనకాపల్లి జిల్లాల గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపవతి వెల్లడించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
ముందుకెళ్లే వీల్లేక.. మార్గ మధ్యలో నిలిచే..!
[ 16-05-2024]
గోపాలపట్నం నుంచి బాజీకూడలి మీదుగా ఎన్ఏడీకూడలికి వెళ్లే బీఆర్టీఎస్ సేవా మార్గంలో నిత్యం ట్రాఫిక్ వెతలతో వాహన చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
మీ అభిమానం మరువలేనిది
[ 16-05-2024]
తనకు అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థిగా సీటు ఖరారు చేసినప్పటి నుంచి పోలింగు వరకు తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూపిన అభిమానానికి సీఎం రమేశ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
నాడు-నేడు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
అనకాపల్లిలో పెరిగిన పోలింగ్
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అనకాపల్లి, ఎలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా, ఓర్పుతో ఓటు వేశారు. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
-
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!