6 కిలో మీటర్లు.. 2 ప్రమాదాలు.. 5 గురు మృతులు
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి ఆదివారం రక్తసిక్తమైంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. ఆరు కిలోమీటర్ల పరిధిలో కొద్ది గంటల తేడాతో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒక ప్రమాదంలో దంపతులు మృతిచెందగా, మరో ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.
ఆ పేద బతుకులు తెల్లారాయి!
ఆ ఇద్దరు మహిళలకు భర్తలు లేరు. కుటుంబ పోషణ భారమంతా వారిపైనే పడింది. కష్టమైనా తప్పని స్థితిలో ఇసుకను తోడే పనికి ఆటోలో వెళుతున్నారు. కూలీపని వద్ద పరిచయమైన వారు స్నేహితుల్లా కలిసి పనులకు బయలుదేరుతారు. పనిలోకి వెళ్లేందుకు తెల్లవారుజామునే ఆటోలో బయలుదేరిన వారి ఆటోను 4 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం మృత్యురూపంలో ఢీ కొట్టడంతో ఆ ఇద్దరి బతుకులు తెల్లారాయి. ఎల్కతుర్తి మండలం దండెపల్లి గ్రామానికి చెందిన పల్లపు పద్మ(35), హనుమకొండ వినాయకనగర్కు చెందిన వల్లెపు మీన(28), డ్రైవర్ యాకుబ్పాష అక్కడికక్కడే మృతిచెందారు. పద్మకు 16 ఏళ్ల పాప, 14 ఏళ్ల బాలుడు ఉన్నారు. మీనకు చిన్న పాప ఉంది. తండ్రులు లేని పిల్లలకు ఇపుడు తల్లులు కూడా దూరమవడంతో చిన్నారులు ఎవరూ లేక రోడ్డున పడ్డారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లీపురానికి చెందిన యాకూబ్పాష(బబ్లూ)కు ఇంకా వివాహం కాలేదు. అన్న మానసిక వ్యాధితో ఎటో వెళ్లిపోయారు. తల్లిలేదు. కుమారుడి మృతితో ఉన్న ఒక్క తండ్రి అనాథగా మిగిలారు. ఢీకొట్టిపోయిన వాహనం ఆచూకీ కోసం మూడు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.
మరో గంటలో ఇంటికి చేరేలోపే..
హనుమకొండ హంటర్రోడ్డులో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్యోన్యంగా ఉండే దంపతులిద్దరు మృతిచెందారు. మరో గంటలో సొంతింటికి చేరుతారనగా వారిని మృత్యువు బలితీసుకుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన తాడూరి సారయ్య , భార్య సుజాత వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని వంతెనపై నుంచి కిందపడింది. ఘటనలో దంపతులు ఇద్దరూ మృతిచెందగా, డ్రైవర్ ఖాసింకు తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన దంపతులు దుర్గామాతను నిత్యం జపిస్తుంటారని సారయ్య జేబులో ఉన్న కాగితం తెలుపుతోంది. ఓం దుర్గాయైనమః అనే మంత్రాన్ని రోజుకు 21 సార్లు జపిస్తే శుభం జరుగుతుందని దానిపై రాసి ఉంది. కనీసం ఆ తల్లి కూడా కాపాడలేకపోయిందే అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గంటకు ఇంటికి చేరుకునే వారని బంధువులు విలపించారు. ఎంజీఎం మార్చురీలో విగత జీవులుగా ఉన్న తమ తల్లిదండ్రులు సారయ్య, సుజాత మృతదేహాలపై పడి వారి కుమార్తె దివ్యరాణి, కుమారుడు వినయ్కుమార్ రోదించడం చూపరులను కంటతడిపెట్టించింది. అదే సమయంలో బొల్లికుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు మృతుల కుటుంబాలు అక్కడకు చేరగా, వారి, వీరి రోదనలతో మూర్చురీ ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదానికి కారణమైన కారును సుబేదారి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతులు సారయ్య
సుజాత
చికిత్స పొందుతున్న డ్రైవర్ ఖాసిం వలీ
వంతెన వద్ద ప్రమాదం జరిగిన స్థలం
అసంపూర్తిగా వంతెన పనులు..
న్యూశాయంపేట, న్యూస్టుడే: అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి హంటర్రోడ్డు ఖమ్మం రైల్వే వంతెనపై నుంచి కారు పడిపోయి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. హంటర్రోడ్డు ప్రధాన రహదారి నుంచి ఖమ్మం వైపు వెళ్లే రైల్వే ఓవర్ బ్రిడ్జికి సమాంతరంగా నాలుగేళ్ల కిందట రూ. 50 కోట్ల వ్యయంతో ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షణలో మరో వంతెన నిర్మించేందుకు దిమ్మెలను నిర్మించి వదిలేశారు. నిధుల మంజూరు లేకపోవడంతోనే ఆగిపోయిందని చెబుతున్నారు. ఇది పూర్తయితే నిత్యం ఈ రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా మరో వంతెన ఉపయోగపడేది. ఇది పూర్తి కాక రోడ్డు ఇరుకుగా మారి రోడ్డు ప్రమాదానికి కారణమైందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడి సత్వరమే అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏనాటిదో ఓరుగల్లు కల... నెరవేరదేమి!
[ 11-05-2024]
అవసరం ఉన్నా ఇక్కడికే వస్తారు.. అలాంటిది ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ - యూజీడీ) ప్రాజెక్టు నెరవేరడం లేదు. ప్రతి లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు నినాదంలా మారుతోంది. -
కమలాపూర్.. గులాబీమయం
[ 11-05-2024]
-
నగర ఓటరుకు ఏమైంది?
[ 11-05-2024]
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది వరంగల్ మహానగరం పరిధిలో ఉండే వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లోనే. -
తల్లి దర్శనం.. ఇంత కష్టమా!
[ 11-05-2024]
అక్షయ తృతీయ పర్వదినం, భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు, శుక్రవారం శుభదినం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దేవాలయం బయట, గర్భాలయం ముందు క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
[ 11-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ఠ బందోబస్తు చేపట్టినట్లు జిల్లా పోలీస్ అధికారి సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలి
[ 11-05-2024]
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నాలుగు నెలలుగా జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, సింగరేణి కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, విప్లవ రచయితల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షు బాలసాని రాజన్నలు డిమాండ్ చేశారు. -
పకడ్బందీగా పోలింగ్ నిర్వహణ
[ 11-05-2024]
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగిసినందున శుక్రవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు శాఖ కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ఎన్నికలకు సంబంధించిన సేవల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. -
చెరువుల్లో మట్టి దందా!
[ 11-05-2024]
భూగర్భ జలాలు అడుగంటడంతో.. చెరువుల్లో విధ్వంసకాండ యథేచ్ఛగా సాగుతోంది. అధికారుల కుమ్మక్కుతో అక్రమ దందా నాలుగు యంత్రాలు.. ఎనభై ట్రాక్టర్లుగా విరాజిళ్లుతోంది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ నల్లమట్టి తరలింపునకు ఎదురులేకుండా పోయింది. -
ప్రశాంత ఎన్నికలకు భారీ భద్రత
[ 11-05-2024]
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లాలో ఎన్నికల నిర్వహణలో పోలీసులదే కీలకపాత్ర. కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. -
ఎన్నికలలో ఏ పార్టీ ఎన్ని సార్లు!
[ 11-05-2024]
దేశంలో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల ఏర్పాటు.. రద్దులాంటి కీలక పరిణామాలు జరిగాయి. -
భద్రత కట్టుదిట్టం..
[ 11-05-2024]
మే 13న జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరగాలంటే పోలీసుల పాత్ర ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కూడలి సమావేశంలో కడియం కావ్య, నాగరాజు ప్రసంగించారు. -
జిల్లా జనరల్ ఆసుపత్రి ఓపీ సేవలకు క్యూఆర్ కోడ్
[ 11-05-2024]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓపీ సేవలు పొందేందుకు పేరు నమోదు చేసుకోవడానికి ఇక నుంచి క్యూఆర్కోడ్ స్కాన్ ఉపయోగించవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. -
ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు కృషి
[ 11-05-2024]
-
ఓటుకు పోటెత్తాలి..!
[ 11-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఎంతో కీలకమైనది ఓటు.. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ, నేటితరం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. -
ఇళ్ల కేటాయింపులో కాలయాపన ఎందుకో..?
[ 11-05-2024]
భారాస హయాంలో జిల్లా కేంద్రంలో వెయ్యి రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాం.. ఇందులో 540 ఇళ్లు అర్హులైన పేదలకు పంపిణీ చేశాం.. మిగతా 460 ఇళ్లను ఆరు నెలలుగా పేదలకు కేటాయించకుండా స్థానిక ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
‘సీఎం రేవంత్రెడ్డి మాయమాటలు నమ్మొద్దు’
[ 11-05-2024]
దొంగ హామీలు, మాయమాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, సీఎం రేవంత్రెడ్డి మరోసారి లోక్సభ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచేందుకు చూస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. -
ప్రజల రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్లో చేరా..
[ 11-05-2024]
-
భాజపాతోనే వరంగల్ అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని భాజపా వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. -
స్వల్పం.. ఆధిక్యం..
[ 11-05-2024]
వరంగల్ లోక్సభ స్థానం 1952లో ఆవిర్భవించింది. ఈ స్థానంలో ఇప్పటి వరకు 17 సార్వత్రిక, మూడు ఉప ఎన్నికలు జరిగాయి. -
పదమూడు దేశాల్లో ‘నోటా’..!
[ 11-05-2024]
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యత.. పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చక పోతే తన అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశాన్ని సైతం ఎన్నికల సంఘం కల్పించింది. -
కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 11-05-2024]
తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ గుర్తుతెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం జరిగింది. -
గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 11-05-2024]
గంజాయి కేసులో ఇద్దరికి పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!