logo

ప్రజల పక్షాన పోరాడితే 25 కేసులు పెట్టారు: నిమ్మల

జగన్‌ ప్రభుత్వంలో ప్రజల పక్షాన సమస్యలపై పోరాడినందుకు తనపై 25 కేసులు పెట్టారని, కక్షసాధింపునకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

Published : 28 Apr 2024 04:22 IST

జిన్నూరులో పార్టీలో చేరినవారితో ఎమ్మెల్యే రామానాయుడు

జిన్నూరు (పోడూరు), న్యూస్‌టుడే: జగన్‌ ప్రభుత్వంలో ప్రజల పక్షాన సమస్యలపై పోరాడినందుకు తనపై 25 కేసులు పెట్టారని, కక్షసాధింపునకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. జిన్నూరులో శనివారం శెట్టిబలిజ, ఎస్సీలు పలువురు తెదేపాలో చేరారు. ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయిదేళ్ల జగన్‌ అరాచక పాలనలో అన్నివర్గాల ప్రజలు మోసపోయారన్నారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో అన్నివర్గాలకు మేలు జరుగుతుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని