వైకాపా ప్రభుత్వ తీరుతో గిరిజనులకు తీరని అన్యాయం
గిరిజనులకు వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర గిరిజన సమాఖ్య (ఆర్జీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కోనేటి దివాకర్ అన్నారు
అంబేడ్కర్ కూడలిలో నిరసన తెలుపుతున్న రాష్ట్ర గిరిజన సమాఖ్య నాయకులు
మదనపల్లె పట్టణం, న్యూస్టుడే : గిరిజనులకు వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర గిరిజన సమాఖ్య (ఆర్జీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కోనేటి దివాకర్ అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆర్జీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గిరిజనులు నిరసన కార్యక్రమం చేశారు. ముందుగా విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దివాకర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 40 లక్షల జనాభా కలిగిన గిరిజనులు నేటికీ అవిద్య, అనారోగ్యంతో దయనీయమైన జీవితం గడుపుతున్నారని అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి, అన్యాయం చేయడం తగదన్నారు. గిరిజనులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకపడ్డారని వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చినట్లైతే గిరిజనుల జీవన విధానానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వాల్మీకులు నేడు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెంది వారికంటూ సముచిత స్థానాన్ని కలిగి ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు లేవనెత్తుతామన్నారు. వైకాపా ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. నిరసన కార్యక్రమంలో కొండ్రెడ్డి, శేఖర్ కిల్లా, రెడ్డిశేఖర్, నరేంద్ర, కె.గంగులప్ప, దేవేంద్ర, చంద్ర, రామచంద్ర, కిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి అన్నావ్.. ఉసురు పోసుకున్నావ్!
[ 11-05-2024]
ఏటా ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన హామీని విస్మరించి నిరుద్యోగులను సీఎం జగన్ నిండా ముంచారు. కొత్త కంపెనీలు రాకపోగా, ప్రోత్సాహకాలు లేక ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలివెళ్లాయి. -
ఆస్తులు మనవి కావాలంటే జగన్ను ఓడించాలి
[ 11-05-2024]
ప్రజల భూములు కాజేసేందుకే వైకాపా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తోందని తెదేపా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు. -
రాష్ట్రంలో వైకాపాకు ఇవే చివరి ఎన్నికలు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపాకు సోమవారం జరిగే ఎన్నికలు చవరివని ఆ పార్టీ ఎన్నికల తరువాత ప్రజలిచ్చే తీర్పుతో కనుమరుగు కావడం ఖాయమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. లింగారెడ్డి పేర్కొన్నారు. -
తెదేపాలో భారీగా చేరికలు... శ్రేణుల్లో ఉత్సాహం
[ 11-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపాలోకి చేరికలు, వసలు, కలయికలతో కళకళలాడుతోందని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. -
రాచమల్లు చెప్పేదొకటి... చేసేది మరొకటి
[ 11-05-2024]
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి ఆయన మాటలు కోటలు దాటుతాయి... చేతలు మాత్రం గడప దాటవు. గొప్ప మాటకారి. అభినవ దానకర్ణుడిగా పేరుపొందారు. -
ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలను జమ్మలమడుగులో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
ఓటింగ్ ప్రక్రియ ముగిసేవరకు సహకరించాలి
[ 11-05-2024]
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా ముగిసే వరకు అభ్యర్థులు అన్ని విధాలుగా సహకరించాలని ఎన్నికల పరిశీలకుడు భానుదాసు పాల్వే, ఆర్వో కౌసర్ బాను స్పష్టం చేశారు. -
జగన్లో కాంగ్రెస్ కలవరం!
[ 11-05-2024]
వైకాపా అధినేత, సీఎం జగన్ ఎన్నడూ లేని విధంగా కడపలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పదేపదే కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించారు. ఓట్లు చీల్చేస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. -
మమ్మల్ని నమ్మడంలేదు... మీరైనా రండి!
[ 11-05-2024]
ప్రజల మనసును తెలుసుకున్న వైకాపా నేతలు వాలంటీర్ల వెంటపడుతున్నారు. జగనే మా నమ్మకం అంటూ నినదించిన ఆ పార్టీ నేతలు... ఇప్పుడు మీరే మా దిక్కంటూ వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!