కూటమి జోష్!
ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు రంగంలోకి దిగడం మరింత జోష్ నింపుతోంది.
నేతలంతా ఐకమత్యంగా ప్రచారం
అంగళ్లు గ్రామంలో దోశ పోస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి. పక్కన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేమన సతీష్
ఈనాడు, కడప: ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు రంగంలోకి దిగడం మరింత జోష్ నింపుతోంది. టిక్కెట్ రాకపోవడంతో అలక బూనిన నేతలందరూ తెదేపా అధినేత చంద్రబాబు మంత్రాంగంతో చల్లబడి ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజంపేటలో రెండు రోజుల కిందట చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్రెడ్డి, తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డితో సమావేశమై ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. దీంతో రామాపురం మండలం గొల్లపల్లిలో శనివారం వారిద్దరూ కలిసి ప్రచారం చేపట్టారు. మదనపల్లెలో కీలక నేతలు రాటకొండ బాబురెడ్డి, రాందాస్చౌదరిలు మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తీసుకున్న చొరవతో ప్రచారంలోకి దిగారు. తంబళ్లపల్లెలోనూ తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ సైతం కిరణ్కుమార్రెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేమన సతీష్ నేతల్ని సమన్వయం చేసే బాధ్యతలు తీసుకున్నారు. ఫలితంగానే శనివారం జరిగిన ఎన్డీఏ ఆత్మీయ సమావేశం దిగ్విజయంగా సాగింది. మదనపల్లెలోనూ సమస్యలన్నీ అధిగమించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. పీలేరులో నల్లారి కిషోర్కుమార్రెడ్డి పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఈయనకు సోదరుడు నల్లారి కిరణ్కుమార్రెడ్డి అదనపు బలంగా మారింది. రాజంపేటలో చిన్నపాటి సమస్యల్ని పరిష్కరించడానికి సమన్వయకర్తలు దీపక్రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి తాజాగా చొరవ తీసుకున్నారు. రైల్వేకోడూరులో కూటమి అభ్యర్థి ఆరవ శ్రీధర్ ప్రచారానికి గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి భాజపాతో పాటు తెదేపా, జనసేన నేతలను సమన్వయం చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేసింది శూన్యం... దోచింది అనంతరం
[ 12-05-2024]
మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం చేసింది శూన్యం కానీ దోచింది మాత్రం అనంతం... గుట్టను, మట్టిని, ఇసుకను అక్రమంగా తవ్వుకోవడంతో పాటు భూకబ్జాలు, దౌర్జన్యాలు, గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణా వంటి అక్రమాలతో అలజడులు సృష్టించారు. -
కాంగ్రెస్ సహకారంతోనే కడప ఉక్కు సాకారం
[ 12-05-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కడప ఉక్కు పరిశ్రమ వస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కడప నగరంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. -
తెదేపాలో చేరికలు... జోరుగా ప్రచారాలు
[ 12-05-2024]
భారీగా జరిగాయి. శనివారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ మండలాల్లో ఎన్డీఏ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేశారు. -
దొంగనోట్లు పంచి ప్రలోభాలకు గురి చేస్తున్నారు జాగ్రత్త : వరద
[ 12-05-2024]
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి మోసగాడని, ఎన్నికల్లో గెలిచేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు. స్థానిక తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
‘రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది’
[ 12-05-2024]
తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి ఆయన లాగే పాలిస్తారని అనుకున్నాం. -
వైకాపా ప్రభుత్వం మైనారిటీలకు ఏం చేసిందని ఓటేయాలి?
[ 12-05-2024]
వైకాపా ప్రభుత్వం మైనారిటీల కోసం ఏం చేసిందని ఆ పార్టీ నాయకులకు ఓటేయాలని తెదేపా పట్టణాధ్యక్షుడు జబీవుల్లా ప్రశ్నించారు. -
కోదండరాముడి అభిషేకం
[ 12-05-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకం క్రతువును నయనానందకరంగా నిర్వహించారు. -
రాచమల్లు అరాచకాలపై వరద కరపత్రం విడుదల
[ 12-05-2024]
స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారంటూ తెదేపా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి శనివారం ‘ధుర్యోదన నీ చేష్టలు నీచాతినీచం’ పేరుతో కరపత్రం విడుదల చేశారు -
ఆదినారాయణరెడ్డి ప్రగతిపై కరపత్రం చక్కర్లు
[ 12-05-2024]
జమ్మలమడుగు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి’ పేరిట ఒక కరపత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.