దారి పొడవునా గులాబీ దండు!
భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది.
కేసీఆర్కు ఘన స్వాగతం
శ్రేణుల్లో జోష్ నింపిన భారాస అధినేత
వీణవంకలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో వినోద్కుమార్, కౌశిక్రెడ్డి
కరీంనగర్ (ఈనాడు), జగిత్యాల, వీణవంక (న్యూస్టుడే) : భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. వీణవంక నుంచి జగిత్యాల వరకు దారి పొడువునా జనాలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత బస్సులో కేసీఆర్ వీణవంకకు చేరుకున్నారు. అక్కడి ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాస గృహంలో బస చేశారు. ఆదివారం మధ్యాహ్నం అక్కడ రైతులు, వివిధ వర్గాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఉమ్మడి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ గడ్డ ఉద్యమకాలంలో అండగా నిలిచిన తీరుతోపాటు అభివృద్ధి పరంగా ఇక్కడికి అందిన సంక్షేమ ఫలాలను గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు. నిరుత్సాహపడకుండా ఉత్తేజంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. వీణవంక నుంచి జగిత్యాల వరకు బస్సు యాత్రలో సందడి కనిపించింది. ఊరూరా నాయకులు ఆపి ఉద్యమ నేతకు అభివాదం తెలుపుతూనే పూల వర్షాన్ని కురిపించి అభిమానాన్ని చూపించారు. మానకొండూర్, కరీంనగర్, కొత్తపల్లి, గంగాధర, పూడూరు, మల్యాల, జగిత్యాలలో పెద్దఎత్తున శ్రేణులు దారికి ఎడమ వైపున నిలిచిన ప్రజలు, కార్యకర్తలకు కేసీఆర్ విజయ సంకేతాన్ని చూపిస్తూ ముందుకు సాగారు. కొండగట్టు వద్ద హోటల్లో టీ తాగి జగిత్యాలకు వెళ్లారు. జగిత్యాల కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడి కూడలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ తమ హయాంలో జరిగిన అభివృద్ధిని తన ప్రసంగంలో వివరించారు. ప్రత్యర్థులపై విమర్శల బాణాలతో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. జగిత్యాల జిల్లా ఉండాలా వద్దా అని ప్రశ్నించగా జనం ఉండాలి అని సమాధానమిచ్చారు.. వరద కాలువ తమ హయాంలో సజీవంగా ఉండేదని.. ఇప్పుడు ఎండిపోయిందని దీనికి కారకులెవరో గుర్తించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ. వారికి పింఛన్ తీసుకొచ్చా.. వారందరూ భారాస అండగా నిలవాలని కోరారు. జగిత్యాలకు వైద్య కళాశాల వస్తదని ఎప్పుడన్నా ఊహించారా.. అది సాకారం చేశామని గుర్తు చేశారు. నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, పెద్దపల్లి భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు.
మాట్లాడుతున్న కేసీఆర్, చిత్రంలో అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు కె.సంజయ్, ఎం.సంజయ్కుమార్
సైడ్లైట్స్..
- హుజూరాబాద్ టైగర్ అని కౌశిక్రెడ్డిని కేసీఆర్ పేర్కొన్న సమయంలో నాయకులు, కార్యకర్తలు ఈలలు, చప్పట్లతో సందడి చేశారు.
- బస్సులో కేసీఆర్తోపాటు భారాస మూడు నియోజకవర్గాల అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు కూర్చున్నారు.
- నిర్ణీత సమయానికన్నా రెండు గంటల ఆలస్యంగా జగిత్యాలకు కేసీఆర్ చేరుకున్నప్పటికీ జనం భారీ సంఖ్యలో పాత బస్టాండ్ వద్ద గుమిగూడారు.
- హుజూరాబాద్కు మరొక్కసారి వచ్చి 24 గంటలపాటు ఇక్కడే ఉండి స్థానికులందరిని కలుస్తానన్నారు. పాడి కౌశిక్రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందన్నారు.
- జగిత్యాలలో బస్సు యాత్ర దాదాపు గంటపాటు కొనసాగింది. కేసీఆర్ను సీఎం, సీఎం అనే నినాదాలు చేస్తూ పార్టీ కార్యకర్తలు అభిమానాన్ని చూపించారు.
జగిత్యాలలో రోడ్షోకు హాజరైన జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యమస్ఫూర్తి.. చైతన్యకీర్తి
[ 02-06-2024]
పల్లె గొంతెత్తింది.. పట్నం కదిలింది.. రోడ్లు స్తంభించాయి.. వంటావార్పులకు దారులే అడ్డాగా మారాయి. -
జై బోలో హనుమాన్కీ
[ 02-06-2024]
‘ఓం శ్రీరామ జయరామ జయజయ రామా.. రామలక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్కీ..’ నినాదాలతో అంజన్న క్షేత్రం మారుమోగింది. -
బడిబాటకు వేళాయె!
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రతీ సంవత్సరం లాగానే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని రూపొందించింది. -
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ
[ 02-06-2024]
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ గని ఏర్పాటు చేయనున్నారు. -
మూత ‘బడి’కి మోక్షం!
[ 02-06-2024]
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి పంచాయతీలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనవరిలోనే విద్యాశాఖను ఆదేశించారు. -
సాంకేతిక కోర్సులు.. ఉపాధికి బాటలు
[ 02-06-2024]
వారంతా పాఠశాల స్థాయిలో నేర్చుకున్న పాఠాలను ఉపాధి, ఉద్యోగాలుగా మలుచుకోవడానికి వచ్చిన అభ్యర్థులు. -
పుస్తక పఠనం.. బాలల వికాసం
[ 02-06-2024]
నేటికాలం పిల్లలు పాఠ్యపుస్తకాలు తప్పితే కథలు, గేయాలు, జీవిత చరిత్రలు వంటి ఆలోచింపజేసే పుస్తకాలకు దూరంగా ఉంటున్నారు. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!
-
కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ.. టీ20ల్లో రికార్డు విజయం
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
-
అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి