‘అత్యుత్తమ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దుతా’
కడప నగరపాలక సంస్థ కమిషనర్గా సూర్యసాయిప్రవీణ్చంద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలు, స్థితిగతులను పత్రికల ద్వారా తెలుసుకున్నానన్నారు. కడప నగరపాలక
బాధ్యతలు స్వీకరిస్తున్న కమిషనర్ సూర్యసాయిప్రవీణ్చంద్
కడప నగరపాలక, న్యూస్టుడే : కడప నగరపాలక సంస్థ కమిషనర్గా సూర్యసాయిప్రవీణ్చంద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలు, స్థితిగతులను పత్రికల ద్వారా తెలుసుకున్నానన్నారు. కడప నగరపాలక సంస్థను రాష్ట్రంలోని అత్యుత్తమ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని చెప్పారు. నగరాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా సలహాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం నగరపాలక సంస్థలోని కీలక విభాగాలకు చెందిన అధికారులతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంతో జరిగిన సమీక్షలో టెండర్ల దశలో ఉన్న పనులు మొదలుకుని పూర్తయ్యే దశలో ఉన్న పనుల వరకు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ● 14, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అధికారులను ప్రశ్నించారు. రాజీవ్మార్గ్ అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడానికి కారణాలపై సంబంధిత అధికారులను నిలదీశారు. ట్యాంక్బండ్ అభివృద్ధి పనులకు పిలిచిన టెండర్ల పురోగతిపై వివరాలు అడిగారు.● పారిశుద్ధ్య విభాగంపై చర్చిస్తూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాప్ పథకంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీల సంఖ్యపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని చిన్న, మధ్యతరహా, పెద్ద కాలువల పరిమాణాన్ని తెలపాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కాలువలను తనిఖీ చేస్తానన్నారు. ప్రణాళిక విభాగంపై జరిగిన చర్చలో రహదారుల విస్తరణను ప్రస్తావించారు. సీఎం నిధులు మంజూరు చేసిన మూడు రహదారుల విస్తరణ పనుల్లో జాప్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ను కలిసిన కమిషనర్ : జిల్లా సచివాలయం : కడప నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సూర్యసాయి ప్రవీణ్చంద్ కలెక్టర్ విజయరామరాజును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కలెక్టర్, జేసీ సూచనలు, మేయర్ సహకారంతో కడప నగరాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గూడు’కట్టుకున్న గుబులు!
[ 02-06-2024]
గత ఐదేళ్లలో వైకాపా నేతల మాటలు విని ఇష్టారాజ్యంగా పని చేసిన అధికారుల్లో గుబులు నెలకొంది. ప్రత్యేకించి గృహ నిర్మాణ సంస్థలో మరింత భయం పుట్టుకుంది. అవసరానికి మించి భవన నిర్మాణ సామగ్రితోపాటు బిల్లుల చెల్లింపులకు పాల్పడినందున సర్వత్రా ఆందోళన నెలకొంది. -
తెదేపా శ్రేణులపై పోలీసుల ప్రతాపం
[ 02-06-2024]
తెదేపా శ్రేణులపై పోలీసులు తమ ప్రతాపం చూపుతున్నారని, జిల్లా బహిష్కరణ, గృహనిర్బంధాలు చేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే కడప నగరంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని శనివారం ఆయన ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో కలిసి పరిశీలించారు. -
మిరప రైతులపై శీతకన్ను!
[ 02-06-2024]
మిరప రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వం పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతేడాది జిల్లాలోని మైలవరం, జమ్మలమడుగు, ముద్దనూరు, పెద్దముడియం, కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన తదితర మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. -
చంద్రబాబుతో సి.రామచంద్రయ్య భేటీ
[ 02-06-2024]
విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మాజీమంత్రి సి.రామచంద్రయ్య తన కుమారుడితో కలసి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
సేవా లోపం... చెల్లించాలి పైకం..!
[ 02-06-2024]
విద్యుత్తు ఉద్యోగులపై ఏపీఈఆర్సీ కొరడా ఝళిపిస్తోంది. విద్యుత్తు వినియోగదారులకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటోంది. కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. -
కడపలో కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి పర్యటన
[ 02-06-2024]
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి శనివారం కడప నగరంలో పర్యటించారు. -
దొంగ అరెస్టు... బంగారు నగల స్వాధీనం
[ 02-06-2024]
బద్వేలు మండలం బయనపల్లెలో జరిగిన చోరీ ఘటనలో అట్లూరు మండలం చలంగారిపల్లెకు చెందిన గుండాల వెంకటసుబ్బయ్యను బద్వేలు గ్రామీణ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. -
అక్రమాలకు పక్కా ప్రణాళిక!
[ 02-06-2024]
పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో అక్రమ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. స్థిరాస్తివ్యాపారులు, భవన నిర్మాణదారులు ప్రభుత్వ అనుమతులు తుంగలో తొక్కి యధేచ్చగా భవనాలు నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో భాజపా హవా
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!
-
కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ.. టీ20ల్లో రికార్డు విజయం
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు