రాజంపేటలో గందరగోళం
రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన బూత్లో సాయంత్రం 6.30 గంటలకు పోలింగ్ ముగిసింది.
గుమిగూడిన తెదేపా, వైకాపా శ్రేణులు
రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద గుమికూడిన తెదేపా, వైకాపా శ్రేణులు
రాజంపేట, రాజంపేట గ్రామీణ, న్యూస్టుడే: రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన బూత్లో సాయంత్రం 6.30 గంటలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ పెట్టెలను తరలించే సమయంలో అన్ని బాక్సులకు సీల్ వేసిన అనంతరం కొందరు ఏజెంట్లు వెళ్లిపోయారు. తరువాత ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి తొమ్మిది బాక్సులను కలిపి ఒకే బాక్స్లోకి వేసి కట్టలు కట్టాలని పోలింగ్ సిబ్బంది మరోసారి చెప్పడంతో అక్కడే ఉన్న తెదేపా ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. ఒకసారి సీజ్ చేసిన బాక్స్లను సీజ్ తొలగించడం ఏంటంటూ వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా, వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులున్న గదిలో వాదోపవాదనలు సాగడంతో పోలీసులు లోపలికి వచ్చి సర్దుబాటు చేశారు. అదే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మోహన్రావు అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను ఒకే బాక్సులో వేయాల్సి ఉందని.. సంబంధిత ఏజెంట్లు ఉంటే వారి సమక్షంలోనే సీజ్ చేసిన బాక్సులను తెరచి మళ్లీ ఒక దానిలో ఒకటి వేస్తామని చెప్పడంతో తెదేపా ఏజెంట్లు వ్యతిరేకించారు. ఎన్నికల నిబంధనకు సంబంధించిన కాగితాన్ని చూపడంతో చివరికి సమ్మతించారన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత బాక్సులను సీజ్ చేసిన సమయంలో బయట నుంచి రెండు వాహనాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రెండు వాహనాల్లో అక్కడి వచ్చారని.. దొంగ ఓట్లు చేర్చే ప్రయత్నం జరిగిందని తెదేపా నాయకులు ఆరోపించారు. పోలింగ్ కేంద్రం వద్ద తమను చూసి వాహనాల్లో వచ్చినవారు పరారైనట్లు చెప్పారు. వారు ఎవరు..? ఎందుకు వచ్చారు..మమ్మల్ని చూసి ఎందుకు పారిపోయారో అధికారులు విచారించాలని డిమాండు చేశారు. డిగ్రీ కళాశాల వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఓసారి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గూడు’కట్టుకున్న గుబులు!
[ 02-06-2024]
గత ఐదేళ్లలో వైకాపా నేతల మాటలు విని ఇష్టారాజ్యంగా పని చేసిన అధికారుల్లో గుబులు నెలకొంది. ప్రత్యేకించి గృహ నిర్మాణ సంస్థలో మరింత భయం పుట్టుకుంది. అవసరానికి మించి భవన నిర్మాణ సామగ్రితోపాటు బిల్లుల చెల్లింపులకు పాల్పడినందున సర్వత్రా ఆందోళన నెలకొంది. -
తెదేపా శ్రేణులపై పోలీసుల ప్రతాపం
[ 02-06-2024]
తెదేపా శ్రేణులపై పోలీసులు తమ ప్రతాపం చూపుతున్నారని, జిల్లా బహిష్కరణ, గృహనిర్బంధాలు చేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే కడప నగరంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని శనివారం ఆయన ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో కలిసి పరిశీలించారు. -
మిరప రైతులపై శీతకన్ను!
[ 02-06-2024]
మిరప రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వం పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతేడాది జిల్లాలోని మైలవరం, జమ్మలమడుగు, ముద్దనూరు, పెద్దముడియం, కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన తదితర మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. -
చంద్రబాబుతో సి.రామచంద్రయ్య భేటీ
[ 02-06-2024]
విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మాజీమంత్రి సి.రామచంద్రయ్య తన కుమారుడితో కలసి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
సేవా లోపం... చెల్లించాలి పైకం..!
[ 02-06-2024]
విద్యుత్తు ఉద్యోగులపై ఏపీఈఆర్సీ కొరడా ఝళిపిస్తోంది. విద్యుత్తు వినియోగదారులకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటోంది. కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. -
కడపలో కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి పర్యటన
[ 02-06-2024]
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి శనివారం కడప నగరంలో పర్యటించారు. -
దొంగ అరెస్టు... బంగారు నగల స్వాధీనం
[ 02-06-2024]
బద్వేలు మండలం బయనపల్లెలో జరిగిన చోరీ ఘటనలో అట్లూరు మండలం చలంగారిపల్లెకు చెందిన గుండాల వెంకటసుబ్బయ్యను బద్వేలు గ్రామీణ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. -
అక్రమాలకు పక్కా ప్రణాళిక!
[ 02-06-2024]
పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో అక్రమ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. స్థిరాస్తివ్యాపారులు, భవన నిర్మాణదారులు ప్రభుత్వ అనుమతులు తుంగలో తొక్కి యధేచ్చగా భవనాలు నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో భాజపా హవా
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!
-
కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ.. టీ20ల్లో రికార్డు విజయం
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు