icon icon icon
icon icon icon

విజయవాడ ఎంపీ బరిలో ఒకే ఇంటి నుంచి ముగ్గురు

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి మూడు ప్రధానపార్టీల తరఫున ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు.

Updated : 25 Apr 2024 07:10 IST

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి మూడు ప్రధానపార్టీల తరఫున ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా నుంచి కేశినేని శివనాథ్‌ (చిన్ని), వైకాపా నుంచి కేశినేని శ్రీనివాస్‌ (నాని) ఇదివరకే నామినేషన్లు వేశారు. వారిద్దరూ అన్నదమ్ములు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కేశినేని వెంకయ్య కుమారుడు రామస్వామి, ఆయన తనయులు శివనాథ్‌, శ్రీనివాస్‌. వెంకయ్య కుమార్తె వల్లూరు కస్తూరి. ఆమె మనవడు భార్గవ్‌. అంటే వెంకయ్య ఇద్దరు మనవళ్లు శివనాథ్‌, శ్రీనివాస్‌ కాగా... భార్గవ్‌ మునిమనవడు కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని