పాక్ను ఇప్పుడేమనాలి..!
పాకిస్థాన్కు అరబ్ ప్రపంచలోని ఎటువంటి విలువ లేదని జరుగుతున్న పరిణామలు చెబుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలను పెట్టుకోగానే.. పాకిస్థాన్కు పూనకం వచ్చింది.. టర్కీ ఎగదోయడంతో నోటికొచ్చినట్లు మాట్లాడింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు
* టర్కీ తోకపట్టుకున్నందుకు తలబాదుకోలేక..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పాకిస్థాన్కు అరబ్ ప్రపంచంలో ఎటువంటి విలువ లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకోగానే.. పాకిస్థాన్కు పూనకం వచ్చింది. టర్కీ ఎగదోయడంతో నోటికొచ్చినట్లు మాట్లాడింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోపక్క పాక్ను ఎగదోసిన టర్కీ మాత్రం ఇజ్రాయెల్తో సంబంధాలను నెరుపుతోంది. తాజాగా ఇజ్రాయెల్లో తన రాయబారిని నియమించింది. ఈ పరిణామం పాక్ను ప్రపంచం ముందు వెర్రిదాన్ని చేసింది.
ఆగస్టు నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-ఇజ్రాయెల్ ‘అబ్రహం అకార్డ్’పై సంతకం చేయడంతో గల్ఫ్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. చాలా ముస్లిం దేశాలు యూఏఈ, సౌదీల నాయకత్వం నుంచి బయటకు వచ్చేస్తాయని.. వాటికి తాము నాయకత్వం వహించవచ్చని టర్కీ, పాక్లు భావించాయి. అబ్రహం అకార్డ్ తర్వాత టర్కీ, పాక్లు ఇజ్రాయెల్ను, పరోక్షంగా యూఏఈని విమర్శించాయి. అంతకుముందు కశ్మీర్ విషయంలో సౌదీ మద్దతు లభించకపోవడంపై పాక్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు కోపం వచ్చింది. సౌదీ తమకు చెల్లించాల్సిన రుణాలు వాపస్ చేయాలని కోరింది. దీంతో గతి లేని పరిస్థితుల్లో పాక్ చైనా ఎదుట చేయిజాచి సొమ్ము తీసుకొంది. సౌదీకి వాపస్ చేసింది. అంతేకాదు, సౌదీ సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా చేసిన ప్రయత్నాలూ సత్ఫలితాలను ఇవ్వలేదు. పాక్ ఇక్కడ ఒక విషయం మర్చిపోయింది.. ఆర్థిక అండదండలు ఇచ్చే సౌదీ-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై స్వరం పెంచి మాట్లాడింది. దీంతో చమురు, నిధులు ఇచ్చే సౌదీ దూరమైంది. కేవలం టర్కీ ఉందనే ధైర్యంతో ఇలా చేసింది.
పాక్ను రెచ్చగొట్టి.. తాను పక్కకు తప్పుకొని..
వాస్తవానికి టర్కీ-ఇజ్రాయెల్కు ఎప్పటి నుంచో దౌత్య సంబంధాలు ఉన్నాయి. 2018 మే వరకు టర్కీ రాయబారి ఇజ్రాయెల్లో ఉన్నారు. 2017లో అమెరికా జెరుసలేమ్ను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా గుర్తించింది. ఆ తర్వాత పరిణామాలతో 2018లో టర్కీ తన రాయబారిని వాపస్ తీసుకుంది. తాజాగా తన ప్రత్యర్థులైన సౌదీ, యూఏఈతోపాటు బహ్రెయన్, సూడాన్, మొరాకో వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్తో దోస్తీ చేస్తున్నాయి. టర్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు కఠినంగా.. చేతలు మాత్రం ఉదారంగానే ఉన్నాయి. తాజాగా బైడెన్ శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతుండటంతో ఇక తన ఆటలు సాగవని టర్కీకి అర్థమైంది. దీంతో ఇజ్రాయెల్ను దూరం పెట్టడం ఏమాత్రం మంచిది కాదని భావించి.. ఆగమేఘాల మీద ఓ రాయబారిని నియమించింది. ‘అబ్రహం అకార్డు’ను విమర్శించిన ఐదు నెలల్లోనే టర్కీ స్వరం మారిపోయింది. వాషింగ్టన్ను శాంతపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. ఇక టర్కీ వెనుక ఉన్న పాక్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది.
టర్కీ చర్యతో ఏమి చేయాలో తెలియని పాక్ విదేశాంగశాఖ మంత్రి ఖురేషీ ‘‘తాము మాత్రం ఇజ్రాయెల్ను గుర్తించం’’ అని తెలిపారు. యూఏఈ, సౌదీ నుంచి ఒత్తిడి వస్తోందని.. ఖురేషీ చెప్పారు. తాము మాత్రం యుఏఈకి పాక్ ప్రజల మనోభావాలను వెల్లడించామన్నారు.
త్వరలో సౌదీ సంకేతాలు..
ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకునే దేశాల్లో త్వరలో సౌదీ అరేబియా కూడా చేరే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ రీజనల్ కోపరేషన్ మినిస్టర్ అఫీర్ అకునీస్ వైనెట్ న్యూస్తో మాట్లాడుతూ..‘‘త్వరలో మరో రెండు దేశాలు కూడా తమతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురానున్నాయి. వీటిల్లో ఒకటి గల్ఫ్ ప్రాంతానికి చెందింది. ఒక పెద్ద ముస్లిం దేశం.. పాకిస్థాన్ మాత్రం కాదు’’ అని తెలిపారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!