వార్డు వాలంటీర్లు మొబైల్ ఫోన్లు అప్పగించాలి
ఆంధ్రప్రదేశ్లోని వార్డు వాలంటీర్ల మొబైల్ ఫోన్ల అప్పగింతపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్కు వెళ్లింది.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని వార్డు వాలంటీర్ల మొబైల్ ఫోన్ల అప్పగింతపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్కు వెళ్లింది. ఎస్ఈసీ పిటిషన్పై డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు మున్సిపల్ ఎన్నికల అధికారులకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రక్రియ నుంచి వార్డు వాలంటీర్లను పూర్తి దూరంగా ఉంచాలని ఎస్ఈసీ గతంలో ఆదేశాలు ఇచ్చింది. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదని.. లబ్ధిదారుల డేటా దృష్ట్యా వాలంటీర్ల ఫోన్లను నియంత్రించాలని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మొబైల్ ఫోన్లు అప్పగించాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్లింది. ఈ నేపథ్యంలో వార్డు వాలంటీర్లు మొబైల్ ఫోన్లను మున్సిపల్ అధికారులకు అప్పగించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!