AP News: భూ స‌ర్వేను ప‌రుగులు పెట్టించాలి: జ‌గ‌న్

జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు- భూర‌క్ష స‌ర్వే ఆల‌స్యం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. భూ స‌ర్వేపై ఇవాళ స‌మీక్ష నిర్వహించిన జ‌గ‌న్‌.. కొవిడ్ పరిస్థితుల వ‌ల్ల

Published : 02 Jun 2021 15:43 IST

అమ‌రావ‌తి: ‘జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు - భూ ర‌క్ష స‌ర్వే’ ఆల‌స్యం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. భూ స‌ర్వేపై ఇవాళ స‌మీక్ష నిర్వహించిన జ‌గ‌న్‌.. కొవిడ్ పరిస్థితుల వ‌ల్ల మంద‌గ‌మ‌నంలో ఉన్న ఈ పథ‌కాన్ని ప‌రుగులు పెట్టించాల‌ని సూచించారు. నిర్దేశించిన స‌మ‌యంలోగా ల‌క్ష్యాన్ని చేరాల‌న్నారు. స‌ర్వేను పూర్తి చేయ‌డానికి అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుతూ.. అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని సూచించారు.

మారుమూల ప్రాంతాల్లో సర్వేకు సిగ్న‌ల్స్‌ అందక సాంకేతిక స‌మ‌స్య‌లు ఉంటాయ‌న్న సీఎం.. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు అన్ని ర‌కాల సేవ‌లు అందించేలా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల సిబ్బంది సిద్దం కావాల‌ని జ‌గ‌న్ సూచించారు. ప్ర‌స్తుతం అందిస్తున్న జ‌న‌న‌, మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్లాగే అన్ని ర‌కాల స‌ర్టిఫికెట్లు ప్ర‌జ‌ల‌కు స‌చివాల‌యాల్లోనే అందేలా చూడాల‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. స‌ర్వే సిబ్బందికి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల మాన్యువ‌ల్‌ను డౌన్‌లౌడ్ చేసుకునేలా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచాల‌న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని